అధ్యయనం పేర నగరానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంఎల్ఏలు అమెరికా పర్యటన చేసి అక్కడి నగరాల గురించి ప్రచారం చేస్తున్నారు. విశాఖ నగరాన్ని కూడా శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్లగా మారుస్తామని అంటున్నారు. నగరాలు బాగా అభివృద్ది చెందాయని, అక్కడ రోడ్మీద కాగితం కూడ ఉండదని, ప్రతి నీటిబొట్టుకి డబ్బుచెల్లిస్తారని, ట్రాఫిక్, పొల్యుషన్ సమస్యలేదని, డ్రైనేజివ్యవస్థ బాగుంటుదని, ప్రతిసేవకు యూజర్ చార్జీలు వసూలు చేస్తారని తెలియజేస్తున్నారు.