March

కేంద్రబడ్జెట్లో సీమకు మొండిచేయి:VSR

ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మరోమారు మొండిచెయ్యి చూపించిందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన 'రాయలసీమ బస్సుయాత్ర' మంగళవారం గుంతకల్లుకు చేరింది. ఆఖరి రోజు కళ్యాణదుర్గంలో ప్రారంభమైన యాత్ర బెళగుప్ప, కణేకల్‌, ఉరవకొండ, వజ్రకరూరు మీదుగా రాత్రికి గుంతకల్లుకు చేరింది. బుధవారం ఉదయం కర్నూలు జిల్లా మద్దికెరలోకి ప్రవేశిస్తుంది.పలుచోట్ల జరిగిన సభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు.

రాష్ట్రం పట్ల ఎందుకీ వివక్ష?

మొన్నటికి మొన్న రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం, నిన్న జనరల్‌ బడ్జెట్‌లోనూ అదే తీరున వ్యవహరించింది. రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎందుకింత వివక్ష? రాష్ట్రంలో వున్నది తన మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమానా? లేక ఆంధ్రప్రదేశ్‌ అంటే ఖాతరులేనితనమా? కేంద్రం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు ఒక ఎత్తు అయితే, ఇది అన్యాయమని తెలిసినా నోరు మెదపకుండా మిన్నకుండిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత మరో ఎత్తు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి తరువాత మాట్లాడతానని చెప్పడం శోచనీయం. ఇప్పుడు ప్రశ్నించకుండా తరువాత ఎప్పుడో మాట్లాడి ఉపయోగమేమిటి?

JNU వీడియోస్ నకిలీవే..

 జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌పై దేశద్రోహం అభియోగాలకు చూపుతున్న వీడియో సాక్ష్యాల్లో పస లేదని తేలింది. ఢిల్లీ ప్రభుత్వం ఫోరెన్సిక్‌ లేబొరేటరీలకు పంపిన ఏడు వీడియోల్లో రెండు నకిలీవని ట్రూత్‌ ల్యాబ్స్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. 

US వెళ్లనున్న మోడీ,షరీఫ్

నరేంద్ర మోదీ, నవాజ్‌ షరీఫ్ మళ్లీ చేతులు కలపనున్నారు. వారి కరచాలనానికి వాషింగ్టన్‌లో ఒక శిఖరాగ్ర సభ వేదిక కానున్నది. షరీఫ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ మంగళవారం ఈ విషయం చెప్పారు. మార్చి 31, ఏప్రిల్‌ 1న వాషింగ్టన్‌లో జరగనున్న అణుభద్రత శిఖరాగ్ర సభ సందర్భంగా మోదీ, నవాజ్‌లు భేటీ అయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.

మోడీని కలిసినా ప్రయోజనం లేదు..

మోడీని స్వయంగా కలిసి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో కేంద్రంపై తన అసంతృప్తిని ఆయన బహిరంగంగా వెల్లడించారు. ప్రత్యేక హాదా, రాజధాని నిర్మాణానికి నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, పారిశ్రామికాభివృద్ధికి ఊతం, పోలవరానికి నిధులు, విశాఖకు రైల్వే జోన్‌ వంటి అంశాల్లో కూడా బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు.

ఇష్రాత్‌ కేసు విచారణకు సుప్రీం

బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఇష్రాత్‌ జహన్‌ను హతమార్చిన ఆరోపణలపై గుజరాత్‌ పోలీసులపై తీసుకున్న చర్యలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇటీవల పోలీసుల నిర్బంధంలో ఉన్న లష్కరే తోయిబాకు చెందిన డేవిడ్‌ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 2004 ఇష్రాత్‌ జహన్‌ ఎన్‌కౌంటర్‌లో క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌, సస్పెన్షన్‌ సహా గుజరాత్‌ పోలీసులపై చేపట్టిన అన్ని చర్యలను ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలైంది. 

10న దేశవ్యాప్త సమ్మె: దాస్ గుప్తా

న్యూఢిల్లీ : ఇపిఎఫ్‌ వినియోగదారులు విత్‌డ్రా చేసే మొత్తాలపై, యజమానులు చెల్లించే వాటాలపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను బిఎంఎస్‌తో సహా కేంద్ర కార్మిక సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది కార్మిక వ్యతిరేక చర్య అని, ద్వంద్వ పన్నుల విధానానికి ఇదొక చక్కని ఉదాహరణ అని పేర్కొన్నాయి. ఇది కార్మికులపై దాడి చేయడం తప్ప మరొకటి కాదని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి గురుదాస్‌ దాస్‌గుప్తా విమర్శించారు. ఇది పొదుపు చర్యల వ్యతిరేక ప్రతిపాదన అని పేర్కొన్నారు.

బడ్జెట్ పై పవన్ ప్రశ్నిoచడేం ..

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదాకానీ, రాజధాని నిర్మాణానికి కానీ ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఏపీ నేతలంతా పార్టీలకతీతంగా కేంద్రంపై మండిపడుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాత్రం స్పందించకపోవడంపై చర్చ జరుగుతోంది.

JNU విద్యార్థుల పార్లమెంట్‌ మార్చ్‌..

న్యూఢిల్లీ : జెఎన్‌యు విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌, మరో ఇద్దరిపై దేశద్రోహ కేసును నిరసిస్తూ విద్యార్ధులు బుధవారం పార్లమెంట్‌కు ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కేసులో అరెస్టయి జైల్లో వున్న మిగిలినవారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు

'తుమ్మపాల సుగర్స్‌'లో ఉద్రిక్తత

 - ఎమ్‌డి ఛాంబర్‌లో రైతులు, కార్మికుల బైటాయింపు
 - తలుపులు బద్దలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు
 - బాలకృష్ణ, ఫణిరాజ్‌, హరినాథ్‌బాబులపై కేసులు బనాయింపు

Pages

Subscribe to RSS - March