EPF పై తుది నిర్ణయం చెప్తాం

ఉద్యోగుల భవిష్యనిధి విత్‌డ్రాలపై పన్ను విధించాలని బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనకు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం దీనిపై స్పందిస్తూ, పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చకు తాను సమాధానమిచ్చేటపుడు తుది నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాక్షికంగా వెనక్కి మళ్ళుతామని మంగళవారం ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియ చేసింది. అధిక వేతన జీవులను ఉద్దే శించి ఈ చర్య తీసుకున్నామని, అంతే కానీ 3.7కోట్ల మంది గల ఇపిఎఫ్‌ సభ్యులనుద్దేశించి కాదని జైట్లీ చెప్పారు..