అర్హులైన పేదలందరికీ జిఒ 298 ప్రకారం ఇళ్ళపట్టాలు ,స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యాన శనివారం శాంతానగర్, అంబేద్కర్నగర్, గాంధీనగర్, కార్మికనగర్, జ్యోతినగర్, వుడాకాలనీ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్ బి గంగారావు మాట్లాడుతూ జిఒ 296 ప్రకారం వంద గజాల లోపు ఇళ్లను, స్థలాను ఉచితంగా క్రమబద్దీరకణ చేస్తామని ప్రకటించి, దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటిల్లో అనేకం గెడ్డలు, కొండలు, చెరువులని చెప్పి తొలగించాలరన్నారు. పేదలకు జి+1 ఇళ్లు ఇవ్వాలని, హుదూద్ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.