March

AP వ్యవసాయ బడ్జెట్ వివరాలు..

Ap రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు..

వ్యవసాయ బడ్జెట్ హెలైట్స్

AP బడ్జెట్ 2016-17 హైలెట్స్..

  • బడ్జెట్ వ్యయం రూ.1,35,688 కోట్లు
  • ప్రణాళికేతర వ్యయం రూ.86,584 కోట్లు
  • ప్రణాళికా వ్యయం రూ. 49,134
  • ఆర్థిక లోటు రూ. 20,497 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లు
  • వృద్ధిరేటు లక్ష్యం 10.9 శాతం
  • రుణమాఫీకి 3,512 రూ. కోట్లు
  • అమరావతి నిర్మాణానికి రూ. 1500 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులకు రూ.7,325 కోట్లు
  • పాఠశాల విద్యకు రూ.17,502 కోట్లు
  • ఉన్నత విద్యకు రూ.2,548 కోట్లు
  • గృహనిర్మాణానికి రూ.1,132కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ.2,233 కోట్లు
  • కాపు కార్పొరేషన్కు రూ. వెయ్యి కోట్లు

లక్షా 35 వేల 688 కోట్ల బడ్జెట్

ఏపీ శాసనసభలో 2016-17 సంవత్సరానికి రూ.1, 35,688 కోట్లతో ఏపీ బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల శాసనసభ ఎదుట ప్రవేశ పెట్టారు.2029 నాటికి మోస్ట్ డెవలప్ స్టేట్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని, ఏడాది పాలనలోనే రెండంకెల వృద్ధి రేటును సాధించడానికి చర్యలు తీసుకున్నామన్నారు.ప్రణాళిక వ్యయం రూ. 49,134 కోట్లు. ప్రణాళికేతర వ్యయం రూ.86,554 కోట్లు. ఆర్థిక లోటు రూ. 20,491 కోట్లు కేంద్రం నుండి వచ్చింది రూ.2,333 కోట్లు గా తెలిపారు.

అమెరికా నగరాల పై వాస్తవాలు మరుగున పరుస్తున్న విశాఖనగర ప్రజాప్రతినిధులు. మౌలికసదుపాయాలు, సేవలు, ప్రైవేటీకరణకు కుట్ర.

అధ్యయనం పేర నగరానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంఎల్‌ఏలు  అమెరికా పర్యటన చేసి అక్కడి నగరాల  గురించి ప్రచారం చేస్తున్నారు. విశాఖ నగరాన్ని కూడా శాన్‌ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌లగా మారుస్తామని అంటున్నారు. నగరాలు  బాగా అభివృద్ది చెందాయని, అక్కడ రోడ్‌మీద కాగితం కూడ ఉండదని, ప్రతి నీటిబొట్టుకి డబ్బుచెల్లిస్తారని, ట్రాఫిక్‌, పొల్యుషన్  సమస్యలేదని, డ్రైనేజివ్యవస్థ బాగుంటుదని, ప్రతిసేవకు యూజర్‌ చార్జీలు  వసూలు  చేస్తారని తెలియజేస్తున్నారు.

ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారాలు లేకుండా చూడాలి. పేద‌ల‌కు ఆంక్ష‌లు లేకుండా క‌నెక్ష‌లు ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ బ‌కాయిలు ప్ర‌భుత్వ‌మే చెల్లించాలి.

    విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2016-17కి సంబంధించి  ఆదాయము, వ్యయముల‌పై సమర్పించిన నివేదికలో ప్రతిపాదించిన టారిఫ్‌పై విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ బహిరంగ విచారణలో  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యు సిహెచ్‌.బాబూరావు  ప‌లు అంశాలు అధికారులు తీసుకెళ్ళారు. విద్యుత్‌ వినియోగదారులపై 783 కోట్ల రూపాయ భారాన్ని మోపే ప్రతిపాదనల‌ను ఉపసంహరించుకోవాలి. గృహవినియోగదారులు, చిరువ్యాపారులు, స్థానిక సంస్థలు, రైల్వేట్రాక్షన్‌, కుటీరపరిశ్రమల‌పై ఈ భారం పడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతిమంగా ప్రజలే వీటిని మోయాల్సి వస్తుంది.

ఎన్నికల ప్రచారం చేయను:కన్నయ్య

పశ్చిమ బెంగాల్‌, కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేసే అవకాశాలు లేవని జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ సూచన ప్రాయంగా చెప్పారు. 'ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోవడంలేదు. నేను ఒక విద్యార్థిని. నేను నా పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయుడిని కావాలన్నది నా కోరిక. అయితే, అప్పుడు కూడా నా క్రియాశీలత కొనసాగుతుంది' అని కన్నయ్య పేర్కొన్నారు. 

EPF పై కేంద్రం వెనకడుగు..

2016-17 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ పై 60 శాతం పన్ను విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించడంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి..దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 

నకిలీ వీడియోలపై కేజ్రిని కలిసిన ఏచూరి

జెఎన్‌యు ఘటనలో ప్రధాన ఆధారంగా ఢిల్లీ పోలీసులు చూపించిన నకిలీ వీడియోలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి డిమాండు చేశారు. సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ను జెడియు నాయకులు కె.సి త్యాగితో కలసి సీతారామ్‌ ఏచూరి ఢిల్లీ సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఏచూరి మాట్లాడుతూ...జెఎన్‌యు ఘటనలపై ఢిల్లీ ప్రభుత్వం తరపున విచారణ జరిపినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపామన్నారు.

లెఫ్ట్‌ తొలి జాబితాలో 116

పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సోమవారం సిపిఐ(ఎం) విడుదల చేసింది. మొత్తం 294 స్థానాలకు గాను 116 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బిమన్‌ బసు ఇక్కడ మీడియా గోష్టిలో విడుదల చేశారు. వీరిలో 16 మంది మహిళలు, మైనార్టీ కమ్యూనిటికి చెందిన వారు 25 మంది ఉన్నారు. కాంగ్రెస్‌తో వేదిక పంచుకునే ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

Pages

Subscribe to RSS - March