March

ఏపీతోనూ 'మహా' దౌత్యం

గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం కోసం మహారాష్ట్రతో జరిపిన దౌత్యం మాదిరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌తోనూ ఇదేవిధంగా జల సమస్యలను అధిగమిస్తామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి తెలిపారు. దేశమంతా నీటి కోసం యుద్ధాలు చేసుకుంటూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక నూతన దిశానిర్దేశం చేశారని చెప్పారు. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులపై ఈ నెల 8న మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని వెల్లడించారు.

ఇరానీపై సభా హక్కుల నోటీస్‌..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా ఎంపీ సీతారాం ఏచూరి సభా హక్కుల నోటీస్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీకి ఒక లేఖ రాశారు. గత నెల 24న రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన హక్కులకు భంగం కలిగించే విధంగా మాట్లాడారని ఏచూరి తెలిపారు. తాను హిందూ దేవత దుర్గా మాతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానంటూ ఆధారంలేని ఆరోపణలు చేశారని వివరించారు. కేంద్ర మంత్రే స్వయంగా అలా మాట్లాడిన తరువాత తన అంతు చూస్తామంటూ కొంత మంది దుండగులు లెక్కలేనన్ని ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో తనను దూషిస్తున్నారని పేర్కొన్నారు.

EPF పై తుది నిర్ణయం చెప్తాం

ఉద్యోగుల భవిష్యనిధి విత్‌డ్రాలపై పన్ను విధించాలని బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనకు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం దీనిపై స్పందిస్తూ, పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చకు తాను సమాధానమిచ్చేటపుడు తుది నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాక్షికంగా వెనక్కి మళ్ళుతామని మంగళవారం ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియ చేసింది. అధిక వేతన జీవులను ఉద్దే శించి ఈ చర్య తీసుకున్నామని, అంతే కానీ 3.7కోట్ల మంది గల ఇపిఎఫ్‌ సభ్యులనుద్దేశించి కాదని జైట్లీ చెప్పారు..

విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మిగులు విద్యుత్ ఉండడమే కాకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు.

క‌నీస వేత‌నం అడిగితే ఇలా అక్ర‌మ అరెస్టులా? ఇదేమి ప్ర‌జాస్వామ్యం? పోలీసుల‌తో ప్రభుత్వ పాల‌నా సిగ్గు, సిగ్గు!!

 క‌నీస వేత‌నం అడిగితే ఇలా అక్ర‌మ అరెస్టులా?  ఇదేమి ప్ర‌జాస్వామ్యం?  పోలీసుల‌తో ప్రభుత్వ పాల‌నా సిగ్గు, సిగ్గు!!

క‌నీస వేత‌నం అడిగితే ఇలా అక్ర‌మ అరెస్టులా? ఇదేమి ప్ర‌జాస్వామ్యం? పోలీసుల‌తో ప్రభుత్వ పాల‌నా సిగ్గు, సిగ్గు!!

 క‌నీస వేత‌నం అడిగితే ఇలా అక్ర‌మ అరెస్టులా?  ఇదేమి ప్ర‌జాస్వామ్యం?  పోలీసుల‌తో ప్రభుత్వ పాల‌నా సిగ్గు, సిగ్గు!!

JNUని మూసేందుకే కుట్ర..

తనపై ఎన్ని కేసులు పెట్టిన బయపడేది లేదని, జెఎన్‌యు విద్యార్థి ఉద్యమ వారసత్వం తనకు అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చిందని తీహార్‌ జైల్‌ నుంచి విడుదల అయిన జెఎన్‌యు ఎస్‌యు అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ పేర్కొన్నారు. ఆ రోజు(ఫిబ్రవరి 9)న జెఎన్‌యులో ఎవరూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని, ఎబివిపి సహాయ కార్యదర్శి ముందుస్తు ప్రణాళికతోనే, జి న్యూస్‌ చానల్‌ను తీసుకొచ్చి తప్పుడు వీడియోలు సృష్టించారని ఆరోపించారు. జెఎన్‌యు డిఎన్‌ఎలోనే అట్లాంటి ఆలోచన లేదని కానీ బిజెపి ప్రభుత్వం జెఎన్‌యుపై కక్షకట్టి ఈ ఘాతుకానికి వడిగట్టిందన్నారు.

అంగన్‌వాడీలకు భారీ కోత..

మోడీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాదీ మాతాశిశుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపుల్లో అంగన్‌వాడీలకు భారీ కోతలు విధించింది. గతేడాదితో పోల్చితే సుమారు రూ. 5,500 కోట్లు(7 శాతం) తగ్గించింది. 2015-16కు గానూ రూ.15,483.77 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ.14 వందల కోట్లతో సరిపెట్టింది.

లోక్ సభలో ఆధార్ రగడ..

ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్‌ కార్డును అనుసంధానించడాన్ని చట్టబద్దం చేయడానికి లోక్‌సభలో కేంద్రం ఆధార్‌ బిల్లును గురువారం ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎమ్‌.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ బిల్లు ఆమోదం పొందితే రూ.20 వేల కోట్ల వృథాని అరికట్టొచ్చని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ కూడా ఎన్‌ఐడిఎఐ బిల్లుపేరుతో దీన్ని ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నాయకుడు మల్లిఖార్జున్‌ ఖర్గే అన్నారు. దీనకి జైట్లీ వివరనిస్తూ 'ఇది కాస్త భిన్నమైంది. ఇది స్వతహాగా ప్రభుత్వ చెల్లింపులకు మాత్రమే పరిమితమౌతుంది' అని చెప్పారు.

Pages

Subscribe to RSS - March