AP బడ్జెట్ 2016-17 హైలెట్స్..
- బడ్జెట్ వ్యయం రూ.1,35,688 కోట్లు
- ప్రణాళికేతర వ్యయం రూ.86,584 కోట్లు
- ప్రణాళికా వ్యయం రూ. 49,134
- ఆర్థిక లోటు రూ. 20,497 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లు
- వృద్ధిరేటు లక్ష్యం 10.9 శాతం
- రుణమాఫీకి 3,512 రూ. కోట్లు
- అమరావతి నిర్మాణానికి రూ. 1500 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులకు రూ.7,325 కోట్లు
- పాఠశాల విద్యకు రూ.17,502 కోట్లు
- ఉన్నత విద్యకు రూ.2,548 కోట్లు
- గృహనిర్మాణానికి రూ.1,132కోట్లు
- ఆరోగ్య రంగానికి రూ.2,233 కోట్లు
- కాపు కార్పొరేషన్కు రూ. వెయ్యి కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ.8,832 కోట్లు
- బ్రాహ్మణ కార్పొరేషన్కు రూ. 67 కోట్లు
- పెన్షన్లకు రూ. 2,998 కోట్లు
- కృష్ణా పుష్కరాలకు రూ.250 కోట్లు
- నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు
- యువత సాధికారితకు రూ.252 కోట్లు
- భూపరిపాలనకు రూ.3,119 కోట్లు
- బడ్జెట్ అంచనాలు 20 శాతం పెంపు
- విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థకు రూ.1000 కోట్లు
- విద్యుత్ శాఖకు రూ.4,020 కోట్లు.. గతేడాదితో పోలిస్తే రూ.3 వేల కోట్ల తగ్గింపు
- ఎస్సీల సంక్షేమానికి రూ.8,724 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.4,728 కోట్లు
- శాంతి భద్రతలకు రూ.4,785 కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660 కోట్లు
- మైనార్టీలకు రూ.710 కోట్లు
- ఐసీడీఎస్కు రూ.772 కోట్లు
- గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,195 కోట్లు
- వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.16,490 కోట్లు
- ఐటీ రంగానికి రూ. 360 కోట్లు
- మత్స్య శాఖకు రూ. 339 కోట్లు
- ఎస్టీల సంక్షేమానికి రూ. 3,100 కోట్లు
- రహదారుల అభివృద్ధికి రూ.3,184 కోట్లు
- ఆహార పరిశ్రమకు రూ. 100 కోట్లు
- పర్యావరణం, అడవులకు రూ.257 కోట్లు
- పారిశుద్ధ్యానికి రూ.320 కోట్లు
- క్రీడలకు రూ. 215 కోట్లు
- రాష్ట్రాభివృద్దికి ఏడు మిషన్లు, రెండు గ్రిడ్లు
- ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2702.20 కోట్లు
- పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.819 కోట్లు
- ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ.344 కోట్లు
- జాతీయ నూనెగింజలు, ఆయిల్ పామ్ మిషన్కు రూ.79 కోట్లు
- రూ.10 కోట్లతో రహదారి భద్రతా నిధి
- పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మచిలీపట్నం, భావనపాడు నౌకాశ్రయాల అభివృద్ధి
- కాకినాడ-కృష్ణపట్నం-విశాఖపట్టణంలో 3 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు
- రాష్ట్ర నిధులతో కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి
- 2016-17 నాటికి అన్ని గృహాలకు ఎల్ పీజీ సౌకర్యం
- పండ్ల తోటల అభివృద్ధికి రూ.659 కోట్లు
- పోలవరం ఎడమ కాలువ పనులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో పూర్తి
- పోలవరం మొదటి దశను జూన్ 2018 నాటికి పూర్తి