March

సంఘపరివార్‌ ఆటలు సాగనివ్వం:ఏచూరి

దేశంలో నానాటికీి పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగంపౖౖె పోరాడాలని యువజన సంఘాల సదస్సులో సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలో గాలిబ్‌ హాల్‌లో 13 వామపక్ష, ప్రజా తంత్ర యువజన సంఘాలు సంయుక్త జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మతతత్వ ఎజెండాను ఈ సదస్సు ఖండించింది.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏచూరి మాట్లాడుతూ, దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజలపై సరికొత్త దాడికి పూనుకుందని, ప్రజల మధ్య విచ్ఛిన్నకర భావాలను ప్రేరేపించి, విభజిం చు..!పాలించు..! విధానాన్ని అమలుచేస్తోందని విమర్శించారు. 

పఠాన్‌కోట్‌ తీవ్రవాదుల ఫోటోలు విడుదల

పఠాన్‌కోట్‌ తీవ్రవాద దాడికి సంబంధించి పాకిస్తానీ దర్యాప్తు బృందం పర్యటన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఆ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు తీవ్రవాదుల ఫోటోలను విడుదల చేసింది. ఆ తీవ్రవాదుల ఎత్తు, ఇతర వివరాలను వివరిస్తూ ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. వారిలో ఒక తీవ్రవాదికి రెండు కాళ్ళకు బొటనవేలు లేదని కూడా తెలిపింది. ఈ చిత్రాను విడుదల చేస్తూ ఇంకా ఇతరత్రా సమాచారం ఏమైనా తెలిసివుంటే పంచుకోవాల్సిందిగా ప్రజలను కోరింది. సంబంధిత సమాచారాన్ని ఇస్తే వారికి లక్ష రూపాయిల వరకు బహమతి ఇవ్వబడుతుందని ఎన్‌ఐఎ తెలిపింది.

జై అంటే జాతీయవాదం ఉన్నట్టా?

''భారత్‌ మాతా కీ జై'' ప్రాతిపదికన జాతీయవాదాన్ని నిర్ణయించడాన్ని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ సోమవారం తీవ్రంగా విమర్శించారు.భారత్‌ మాతా కీ జై అని అనడం నాకు సంతోషమే, అయితే అ ంత మాత్రాన అందరినీ అలా అనాల్సిందేనని నేను ఒత్తిడి తీ సుకురాగలనా? అని ప్రశ్నించారు. జెఎన్‌యులో విద్యార్ధులనుద్దేశించి ఆయన ఆదివారం రాత్రి మాట్లాడారు. కేవలం ''హిందీ, హిందూ, హిందూస్తాన్‌'' దేశం మనది కాదని, ఇది భారతదేశమని, మరింత వై విధ్యతను ఆమోదించే దేశమని అన్నారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనానికి తీర్మానం చేయాలి:బాబూరావు

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల స్వాధీనానికి అసెంబ్లీలో తీర్మానం చేయా లని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూ రావు డిమాండ్‌ రూ.1200 కోట్ల విలువ చేసే హారు ల్యాండ్‌, కీసరలోని 200 ఎకరాల భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాల న్నారు. బాధితుల కోసం తక్షణమే రూ.2 వేల కోట్లతో ప్రభుత్వమే నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు ప్రభుత్వం అమ్ముడుపోయిందని, అందుకే ఏడాది పాటు కేసును తాత్సారం చేసిందని విమర్శించారు. డిజిపి జెవి రాముడు కూడా నిందితులకు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు.

నేడు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఛలో విజయవాడలో

పట్టణ, నగర ప్రాంతాల నివాసులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ప్రదర్శన, బహి రంగ సభ ఏర్పాటు కానున్నాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి గాంధీనగర్‌లోని జింఖానా క్లబ్‌ వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు వామ పక్ష నాయకులు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పట్టణ, నగ ర ప్రాంత వాసులకు ఒక్క ఇంటినిగానీ, నివేశన స్థలాన్నిగానీ మంజూరు చేయలేదని నాయకులు విమర్శించారు. సుమారు పది లక్షల మంది ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం జన్మభూమి మాఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకు న్నారు.

ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న‌ ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి

ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న‌ ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి ఆర్. రఘు, చౌటపల్లి రవి, కోడాలి.శర్మ

కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ర‌ద్దు చేయాలి.

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన,వినాశ‌క‌ర‌మైన‌,ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించే  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ర‌ద్దు చేయాల‌ని సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి డిమాంఢ్ చేసారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంకు వ్య‌తిరేకంగా సిపియం ప్ర‌జాసంఘాల ఆద్వ‌ర్య‌ములో  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్ర‌భావిత గ్రామాల‌లోప‌ర్య‌టించారు.సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రమ‌ని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓల‌ను ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేసారు.

నీరుగారుతున్న గృహ నిర్మాణం..

గుడిసెలులేని ఆంధ్రప్రదేశ్‌, పేదలకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ళు, 2022 నాటికి అందరికీ ఇళ్ళు అంటూ పాలకులు ఊదరగొడుతున్నారు. ప్రభుత్వాలు మారాయి. గృహనిర్మాణ పథకాల పేర్లు మారాయి. ఇందిరమ్మ, రాజీవ్‌ పథకాల స్థానంలో ఎన్‌టిఆర్‌ పథకాలొచ్చాయి. కానీ ప్రభుత్వాల తీరు మాత్రం మారలేదు. 22 నెలలు గడచినా తెలుగుదేశం, బిజెపి పాలనలో పేదలకు గూడు కల్పించడంలో వెనుకడుగే తప్ప ముందడుగు లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేదలకు మూడు సెంట్ల ఇళ్ళ స్థలం, పక్కా ఇల్లు, మధ్యతరగతివారికి ప్రత్యేక గృహ పథకం పేరుతో వాగ్దానాల వర్షం కురిపించింది. ఈ కాలంలో ''గాలిమేడలే'' తప్ప ఇళ్ళ నిర్మాణం సాగలేదు.

ఉన్నత విద్యామండలి వివాదంపై సుప్రీం..

ఉన్నత విద్యా మండలిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య వాటాలు 52:48 నిష్పత్తిలో జరగాలని సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఖాతాల్లో ఇరు రాష్ట్రాలకు వాటా వుంటుందని స్పష్టం చేసింది. జస్టిస్‌ గోపాలగౌడ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఉన్నత విద్యామండలి కేసులో శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

JNU ఉమర్‌,అనిర్బన్‌లకు బెయిల్‌..

రాజద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న జేఎన్‌యూ రీసెర్చ్‌ స్కాలర్లు ఉమర్‌ ఖాలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలకు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ 6 నెలల పాటు అమలులో ఉంటుంది. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా 'దేశ వ్యతిరేక' నినాదాలు చేశారన్న ఆరోపణలపై వారిని గత నెలలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అదనపు సెషన్స్‌ జడ్జి రీతీశ్‌సింగ్‌ ఇద్దరు స్కాలర్లను రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తంలో జామీను ఇవ్వాలని ఆదేశిం చారు.

Pages

Subscribe to RSS - March