March

రాజధానిలో సి.పి.ఎం.నేతల‌ అక్రమ అరెస్టుల‌కు నిరసనగా విజయవాడ సి.ఆర్‌.డి.ఏ. కార్యాయం వద్ద ధర్నా

తాత్కాలిక సచివాల‌య నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శుక్ర‌వారం పరిశీలించనున్న నేపథ్యలో ముందస్తుగానే సిపిఎం రాజధాని ప్రాంత నాయకు లు ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ల‌ను అరెస్టు చేసి, నిర్భందించడాన్ని నిరసిస్తూ  విజ‌య‌వాడ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో లెనిన్‌ సెంటర్‌లోని సి.ఆర్‌.డి.ఏ కార్యాయం వద్ద ధర్నా చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకుల‌ను వెంటనే విడుద చేయాల‌ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా  సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ప్రజారాజధాని నిర్మిస్తామని చెబుతూనే ప్రజపై నిర్భంధ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

స్మార్ట్‌ సిటీ ఫీజు - పిపిపి పేర ప్రాజెక్టులు ప్రైవేటీకరణ నిధులన్నీ స్మార్ట్‌ ఏరియాకి తరలింపు

స్మార్ట్‌సిటీ వలన కలిగే ప్రయోజనాలకు ప్రతి ఫలంగా జివిఎంసి ఆస్ధిపన్నుపై 10 శాతం అదనంగా స్మార్ట్‌సిటీ ఫీజు వసూలు  చేయాలని నిర్ణయించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ప్రతిపాదను నగర టాక్స్‌ పేయర్స్‌కు తీవ్ర హాని చేస్తుందని సిపిఐ(ఎం) అభిప్రాయపడుతున్నది. స్మార్ట్‌సిటీలో అనేక ప్రాజెక్టులను పిపిపి పేర అధికార పార్టీ నాయకులు బినామీ సంస్థలకు ధారాదత్తం చేయుటకు పలు  ప్రతిపాదనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ స్కీము క్రింద మంజూరయ్యే నిధులన్నీంటిని స్మార్ట్‌ ఏరియా ప్రాంతమైన ఆర్‌.కె బీచ్‌ ఏరియాకి మల్లించే ప్రతిపాదను చేశారు.

విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభ, భారత రాజ్యాంగం- పౌరహక్కులు అనే సెమినార్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

    ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కు సంఘం రాష్ట్ర మహాసభలు  మార్చి 27వ తేదీన విశాఖనగరంలో జరుగుతుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం - పౌరహక్కులు  అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్‌ జరుగుతుంది. ఈ సెమినార్‌ను జయప్రదం చేయాలని ఈ రోజు (24-03-2016) పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణలో విశాఖ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు  కె.ఎస్‌. సురేష్‌ కుమార్‌, ఐలూ నాయకులు ఎన్‌. హరినాధ్‌, ఎ.కె.ఎన్‌ మల్లేష్‌, ఐ.ఎ.ఎల్‌ నాయకులు వెంకటేశ్వరరావు, సాయికుమార్‌ లు  పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వారు ప్రసంగించారు.

విషం చిమ్ముతున్న దివిస్‌

 పరిశ్రమలొస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్న మాటలు భ్రమలు కల్పించేవి తప్ప భరోసా ఇచ్చేవి కావని అర్థమవుతోంది. నమ్మించి పారిశ్రామికవేత్తల అవసరాలు తీర్చడం కోసం ప్రజలతో ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలని అనుభవాలు చెబుతున్నాయి.

బాక్సైట్‌పై చంద్రబాబు కపటనాటకం

       విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని చెబుతున్న చంద్రబాబు, దానికి సంబంధించిన జిఒ 97ను రద్దు చేయకుండా కపట నాటకం ఆడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18న జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో బాక్సైట్‌కి సంబంధించి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలం నాటి, కాలం చెల్లిన 222, 289 జిఒలను రద్దు చేసి గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

బలవంతపు భూసేకరణ ఆపాలి

           సబ్బవరం మండలం, వంగలి రెవెన్యూ పరిధిలోని అసైన్డ్‌ భూముల్లో బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం హెచ్చరించారు. బలవంతపు భూసేకరణను నిరసిస్తూ, రీసర్వే నిర్వహించాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన వంగలి గ్రామ రైతులు తహశీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.

రోహిత్‌ చట్టం తెచ్చే వరకు పోరాటం..

రోహిత్‌ చట్టం తెచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని కన్నయ్యకుమార్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటానని కన్నయ్యకుమార్‌ చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానన్నారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఏడాదిలో పోస్టల్‌ బ్యాంకింగ్‌ సేవలు..

తపాల శాఖ మార్చి 2017 నుంచి పేమెంట్‌ బ్యాంక్‌ సేవాలను అందించనుందని కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఐటి శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇందుకోసం త్వరలోనే కేబినెట్‌ అనుమతి లభించనుందని పేర్కొన్నారు. బీమా, బ్యాంకింగ్‌ ఇతర సేవలకై 60 అంతర్జాతీయ సంస్థలు పోస్టల్‌ శాఖతో ఒప్పందాలు కుదర్చుకున్నాయని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసిన డిజిటల్‌ ఇండియా సమ్మిట్‌ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారత్‌లో కోర్‌ బ్యాంకింగ్‌ సేవల్లో తపాల శాఖ అతిపెద్ద నెట్‌వర్క్‌ కలిగి ఉంది.

జార్ఖండ్‌ సిఎంతో బృందాకారత్‌ భేటి..

సిపిఐ(ఎం) పొలిట ్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ మంగళవారం జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌తో భేటీ అయ్యారు. లతేహర్‌ జిల్లాలో మార్చి 18నజరిగిన ఇద్దరి హత్యపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. కరత్‌ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం రఘువర్‌ దాస్‌కు ఒక మెమోరాండంను సమర్పించింది. 32 ఏళ్ళ వయస్సు గల ఒక యువకుడు, 13 ఏళ్ళ వయస్సు గల బాలుడు హత్యోదంతంలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. హత్యకు గురైన వ్యక్తి భార్యకు, బాలుడి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. బృందాకరత్‌ సోమవారం లతేహర్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించారు.

Pages

Subscribe to RSS - March