July

రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు : బాబు

తప్పు చేసిన వారు ఎవ్వరైనా వదిలిపెట్టే సమస్య లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం పలువురు కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు అనంతర మీడియాతో మాట్లాడుతూ..తాను జులై 5న జపాన్‌కి వెళ్లి 9న సాయం త్రం ఢిల్లీకి చేరుకున్నానని, ఏపీకి పెట్టుబడులే ముఖ్యద్ధేశ్యంగా తాను జపాన్‌లో అనేక మంది మంత్రులను, ప్రభుత్వ సంస్థలని, ప్రైవేటు వ్యక్తులని కలిశానని వారందరూ పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే 7 ప్లాంట్‌లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం

మీడియా, పత్రికా జర్నలి స్టులపైన భౌతిక, దూషణలతోకూడిన దాడులు పెరిగాయని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీిఐ) ఆందోళన వ్యక్తంచేస్తూ వీటిని శిక్షార్హమైన నేరంగా పరిగణించి శిక్షించటానికి వీలుగా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. జర్నలిస్టులపై జరిగే దాడులన్నింటినీ ప్రత్యేక కోర్టులకు సమర్పించి దర్యాప్తు చేయించాలని, చార్జిషీటు దాఖలు చేసిన సంవత్సరంలోపు విచారణ పూర్తిచేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ కోరింది. జర్నలిస్టుల రక్షణకు సంబంధించి ప్రెస్‌కౌన్సిల్‌ సబ్‌కమిటీ పలు సిఫార్సులు చేసింది. సిఫారసులను కౌన్సిల్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ జడ్జి చంద్రమౌళికుమార్‌ ప్రసాద్‌ విలేకరులకు గురువారం వివరించారు. 

పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమే

ఇటీవల స్మార్ట్‌ సిటీల గురించి పదేపదే వార్తలొస్తు న్నాయి. 2014లో ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణం చేసిన తర్వాత భారతదేశంలో స్మార్ట్‌సిటీలు నిర్మిస్తామని ప్రకటించారు. దేశంలో 100 నగరాలు నిర్మిస్తామని, కనీసంగా ప్రతి రాష్ట్రంలోనూ ఒక నగరమైనా నిర్మిస్తామని ప్రకటించారు. గరిష్టంగా గుజరాత్‌, కేరళ, కర్ణాటకలో ఒక్కో రాష్ట్రంలోనూ ఏడు సిటీల చొప్పున, కనిష్టంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే ఒక్క నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో సరాసరిన 4 నుంచి 5 వరకూ నగరాలను నిర్మించనున్నట్టు ప్రకటనలు గుప్పించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నగరాలు నిర్మిస్తారు.

అధికార మాఫియా

 అసలే ఇసుక మాఫియా, దానికి అధికార పార్టీ అండ చేరితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వంలో భాగమైన శాసనసభ్యుడు అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి తానే స్వయంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి ఆనక అడ్డొచ్చిన తహసీల్దార్‌పై మహిళ అని కూడా చూడకుండా మందీమార్బలంతో విచక్షణారహితంగా దాడి చేయడం ఘోరం. అక్రమ ఇసుక దందాను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి చితక బాదడం దారుణం. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్‌ ప్రభుత్వ యంత్రాంగ మనోనిబ్బరంపై వేసిన వేటు.

ఇలా ఐతే రాష్ట్ర వ్యాప్త బంద్ తప్పదు : మధు

పదో పిఆర్‌సి ప్రకారం రూ. 15,432 కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు శుక్రవారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. పలు జిల్లాల్లో విధుల బహిష్కరించి ర్యాలీలు, రాస్తా రోకోలు, ధర్నాలు తదితర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. వివిధ రూపాల్లో వెల్లువెత్తిన వీరి ఆందోళనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు పలకడం విశేషం. వెంటనే సమస్యలను పరిష్క రించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్‌ తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు.

ఏకపక్షంగా చట్టాల సవరణ: గఫూర్‌

మోడీ, చంద్ర బాబు ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ దుయ్య బట్టారు. తిరుపతిలోని ఎంబి భవన్‌లో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల క్లస్టర్ల సమావేశంలో ఆయన ప్రసం గించారు. సెపెంబర్‌ 2న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వ త్రిక సమ్మె ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకొన్న చట్టాలను మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా సవరణకు పూనుకుందన్నారు.

2జి స్కాంలో కొత్త కోణం..

 2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి న ముడుపుల సొమ్ము సూరత్ మీదు గా స్విట్జర్లాండ్ వంటి పన్నులకు స్వర్గ్ధామైన దేశాలకు తరలిపోయిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తులో వెల్లడయింది. ఈ నిధులను ఆపరేటర్లు చెన్నై నుంచి సూరత్ మీదుగా స్విట్జర్లాండ్ వంటి దేశాలకు తరలించినట్లు రూ. 5,395 కోట్ల విలువ గల హవాలా కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఇడి పరిశోధనలో తేలింది. అహ్మదాబాద్ జోనల్ యూనిట్ ఇడి అధికారులు ఈ నెల ఒకటో తేదీన కోట్లాది రూపాయల హవాలా కుంభకోణంతో సంబంధం ఉన్న దుబాయికి చెందిన వ్యాపారవేత్త మనీశ్ షాను సూరత్‌లో అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రజావ్యతిరేక విధానాలపై ఉధృతంగా ఉద్యమాలు..

ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న వారి సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. విజయవాడ కానూరు పప్పుల మిల్లు సెంటర్‌ శ్రీనివాసా కళ్యాణమండపంలో సిపిఎం కృష్ణాజిల్లా కమిటీ విస్తృత సమావేశం గురువారం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ, రాజధాని ప్రాంత భూముల్లో పంటలు లేకపోవడంతో ఉపాధిపోయి వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించలేం

భారత్‌లో అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించేందుకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తి తన గదిలో కూర్చుని అశ్లీల చిత్రాలు చూడాలనుకునే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాధమిక హక్కును ఎవరూ నిలువరించలేరని నిస్సహాయత వ్యక్తంచేసింది. ''అటువంటి తాత్కాలిక ఆదేశాలను ఈ కోర్టు జారీ చేయలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు కోర్టుకు వచ్చి మైనారిటీ తీరిన వ్యక్తిని నేను, నా గదిలో కూర్చుని నేను చూస్తుంటే మీరెలా నన్ను నిలువరించగలుగుతారు. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రశ్నించవచ్చని'' ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు మౌఖికంగా తెలిపారు.

టిడిపి ప్రభుత్వ ఏడాది పాలన నిర్వాకం

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆందోళనలు చెయ్యకూడదట. వీధుల్లోకి రాకూడదట. ఏం చేసినా కుక్కినపేనులా పడుండాలట. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మహానాడులో తీర్మానాన్నే ఆమోదించింది. అంగన్‌వాడీ, ఐకెపి ఉద్యోగులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అతీగతీ లేదు.
          సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు జూన్‌ 29, 30 తేదీలలో విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితి, సంక్షేమ పథకాలు, వాగ్దానాల అమలు, కార్మికుల, ఉద్యోగుల స్థితిగతులు, వాటిపట్ల ప్రభుత్వ తీరును సమావేశం సమీక్షించింది. దాని పూర్తి పాఠం.....

Pages

Subscribe to RSS - July