July

అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించలేం

భారత్‌లో అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించేందుకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తి తన గదిలో కూర్చుని అశ్లీల చిత్రాలు చూడాలనుకునే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాధమిక హక్కును ఎవరూ నిలువరించలేరని నిస్సహాయత వ్యక్తంచేసింది. ''అటువంటి తాత్కాలిక ఆదేశాలను ఈ కోర్టు జారీ చేయలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు కోర్టుకు వచ్చి మైనారిటీ తీరిన వ్యక్తిని నేను, నా గదిలో కూర్చుని నేను చూస్తుంటే మీరెలా నన్ను నిలువరించగలుగుతారు. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రశ్నించవచ్చని'' ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు మౌఖికంగా తెలిపారు.

టిడిపి ప్రభుత్వ ఏడాది పాలన నిర్వాకం

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆందోళనలు చెయ్యకూడదట. వీధుల్లోకి రాకూడదట. ఏం చేసినా కుక్కినపేనులా పడుండాలట. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మహానాడులో తీర్మానాన్నే ఆమోదించింది. అంగన్‌వాడీ, ఐకెపి ఉద్యోగులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అతీగతీ లేదు.
          సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు జూన్‌ 29, 30 తేదీలలో విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితి, సంక్షేమ పథకాలు, వాగ్దానాల అమలు, కార్మికుల, ఉద్యోగుల స్థితిగతులు, వాటిపట్ల ప్రభుత్వ తీరును సమావేశం సమీక్షించింది. దాని పూర్తి పాఠం.....

ఉర్దూ పట్ల నిర్లక్ష్యం తగదు

భారతదేశం గుర్తించిన రెండవ అధికార భాష అయిన ఉర్దూను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఇంగ్లీషు తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష ఉర్దూ. కావున ఉర్దూనే మరింత అభివృద్ధి చేయాలి. అయితే ఉర్దూ భాష ఎక్కువగా ముస్లింలకే అనే ముద్రపడింది. కానీ ఉర్దూ అంతర్జాతీయ భాష. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం జపనీస్‌ భాషను కోర్సుగా పెట్టి నేర్పించాలని ప్రయత్నిస్తున్నది. కానీ ఇప్పటికే వాడుకలో ఉన్న ఉర్దూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. గతంలో ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉండేది. కానీ నేడు ముస్లిం సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఉర్దూ పాఠశాలలు అధికంగా ఏర్పాటు చేశారు.

ఏచూరి లండన్ పర్యటన

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లండన్‌ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. అక్కడ ఆయన వరుసగా జరిగే పలు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నెల 11వ తేదిన అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కమ్యూనిస్ట్స్‌ అండ్‌ ఇండియన్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌, గ్రేట్‌ బ్రిటన్‌ నిర్వహించనున్న రెండు సమావేశాల్లో పాల్గొంటారు. 12వ తేదిన అదే సంస్థ, సిపిఐ, ఇతర వామపక్ష ప్రజాతంత్ర సంస్థల మిత్రుల సహకారంతో నిర్వహించబోయే పౌర సన్మానంలో పాల్గొంటారు. బ్రిటన్‌లో పర్యటించే సమయంలో సిపిఎం, ఇతర వామపక్షాల మద్దతుదారులు నిర్వహించే పలు కార్యక్రమాలు, సంఘీభావ సదస్సుల్లో ఏచూరి పాల్గొంటారు. 

చౌహాన్‌ రాజీనామాకై 16న రాష్ట్ర వ్యాప్త సమ్మె

వ్యాపమ్‌ కేసులో నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరగడానికి వీలుగా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై ఒత్తిడి పెంచేందుకు జూలై 16న మధ్య ప్రదేశ్‌లో సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో కలసి రావాల్సిందిగా సోదర వామపక్ష పార్టీలకు, ఇతర ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. పార్టీ సీనియర్‌ నేత మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ పీపుల్స్‌ డెమొక్రసీ తాజా సంచికలో రాసిన సంపాద కీయంలో ఈ మేరకు పిలుపు నిచ్చారు.

రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

కృష్ణా: ముసునూరు తహశీల్దార్ పై దాడికి నిరసనగా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

సమ్మె నివారించాలి

వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్లబోతున్నారు. ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా మున్సిపల్‌ కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను నివారించే మార్గం చూడాలి. అసలే వర్షాకాలం. మామూలుగానే దోమల ద్వారా, గాలి ద్వారా రోగాలు వ్యాపించే కాలం. దీనికి తోడు సమ్మె వలన అంటువ్యాధులు విజృంభిస్తే ఆ పాపం ప్రభుత్వానిదే అవుతుంది. మున్సిపల్‌ కార్మికులు ఒక రోజు విధులను బహిష్కరిస్తేనే రాష్ట్రం చెత్త కుప్పగా మారుతోంది.

భారత్ కు పాక్ అణుహెచ్చరిక..

రక్షణ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగించడానికి వెనుకాడమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు. పాక్ చానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన కుండబద్దలు కొట్టారు. ‘మమ్మల్ని రక్షించుకోవడానికి అణుబాంబులు మాకున్న అవకాశాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం మేం ఉంచుకోవడం లేదు. అయితే ఆ అవసరం ఎప్పటికీ రాకూడదని మేం భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాం. కానీ మాకే ప్రమాదం వస్తే ఉపేక్షించేది లేద’ని పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదం పేట్రేగిపోతుండడం.. భారత్‌‌తో పరోక్ష యుద్ధానికి దారి తీయొచ్చని చెప్పారు.

Pages

Subscribe to RSS - July