July

కార్పొరేట్ల నుంచి దేశ రక్షణే లక్ష్యం

   దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల నుంచి రక్షించి ప్రభుత్వరంగాన్ని కాపా డటమే సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌యూనియన్లు తలపెట్టిన సమ్మె లక్ష్యమని సిఐటియు ఆలిండియా ప్రధానకార్యదర్శి తపన్‌సేన్‌ ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ 'మేకిన్‌ ఇండియా' పేర దేశ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ వినాశనమే మోడీ, బిజెపి ధ్యేయమన్నారు.

ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?

 బిజెపి భీష్మాచార్యులు లాల్‌కృష్ణ అద్వానీ ''మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయని'' తన భయాన్ని పైకి వ్యక్తీకరించి, కొందరి మనసులనున్న, బయటకు రాని భయాన్ని ఆవిష్కరించారు. ''ఇప్పుడు మనం ప్రజాస్వా మ్యంలోనే ఉన్నామా?'' అసలు ప్రజాస్వామ్యమంటే ఏమిటీ? అనే ఇంకో ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ''అద్వానీ ఆ మాట ఎందుకన్నారు? రాబోయే చీకటి రోజుల చిహ్నాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఎలా అంచనా వేయగలిగారు? అన్నిటికీ సమాధానాలు అవసరమే!

ప్రకృతి గతితర్కం

 పురాతన కాలంనాటి అద్భుతమైన స్వాభావిక తాత్విక ఊహలు, అరబ్బుల కాలంలో అడపాదడపా చోటు చేసుకున్న మహావిష్కరణలు ఎక్కువభాగం ఎలాంటి ఫలితాలు ఇవ్వకుండానే అంతర్ధానమైపో యాయి. ప్రకృతిని ఆధునికంగా పరిశోధించి సాధించిన శాస్త్రీయమైన, క్రమబద్ధమైన పరిపూర్ణమైన శాస్త్రీయాభివృద్ధి మాత్రమే కాల పరీక్షకు నిలిచింది. ఈ ఆధునిక శాస్త్ర పరిశోధనాకాలంనుండి ఒక నూతన శకం ఆరంభమయ్యింది. ఇదంతా అతి సమీప చరిత్రయే. జర్మన్లు ఈ శకాన్ని సంస్కరణ యుగంగా పిలుచుకుంటే, ఫ్రెంచి వారు పునరుజ్జీవనశకంగా పిలుచుకున్నారు. ఇటలీవారు సంగీత, సాహిత్యాలు, కళలు, కుడ్యాల నిర్మాణంలో అద్భుత ప్రగతిసాధించిన కాలంగా పేర్కొన్నారు.

నేటినుండి బ్రిక్స్‌ సదస్సులు

బుధవారం నుండి రష్యాలో ప్రారంభం కానున్న బ్రిక్స్‌ దేశాల కూటమి సదస్సు, షాంఘై సహకార సంస్థ సదస్సు సానుకూల ఫలితాల సాధనపైనే దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంక్‌ (ఎఐఐబి) ఏర్పాటు వంటి అంశాలతో పాటు ఇప్పటి వరకూ చర్చలకు మాత్రమే పరిమితమైన ఈ రెండు వ్యవస్థలు సకారాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. రష్యాలోని ఉఫాలో ప్రారంభం కానున్న బ్రిక్స్‌ గ్రూప్‌ దేశాల సదస్సులో ఎఐఐబి ఏర్పాటు, అత్యవసర రిజర్వ్‌ ఏర్పాటు వంటి అంశాలను చైనా ప్రధానంగాచర్చకు తెనున్నట్టు తెలుస్తుంది.

రాజ్యం-విప్లవం

                లెనిన్‌ రాసిన ప్రసిద్ధ గ్రంథాల్లో ఒకటి 'రాజ్యము-విప్లవము'. దీన్నాయన 1917 ఫిబ్రవరిలో జరిగిన బూర్జువా విప్లవానంతరం అజ్ఞాతంలో వుంటూ, 1917 ఆగస్టు, సెప్టెం బర్‌ నెలల్లో రాశాడు.

వ్యాపంపై 9న విచారణ

మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు కోరుతూ కాంగ్రెస్‌ నేత దిగ్విజరు సింగ్‌, ముగ్గురు ఆర్‌టిఐ కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 9న విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. ''అన్ని అంశాలు కలిపి ఒకేసారి విచారించాలని నిర్ణయించాం. జులై 9న విచారిస్తా''మని ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు, జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ అమితవ రారులతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

రాజీలేని తీర్పు..

అత్యాచార కేసుల్లో ఎటువంటి మధ్యవర్తిత్వానికి, రాజీకి తావు ఉండరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం హర్షణీయం. ఇవి అపరాధ రుసుముతో చెల్లిపోయేంత స్వల్ప నేరాలు కావనీ, ఏమాత్రం మెతక వైఖరి అవలంబించడానికి ఆస్కారం లేనివనీ కింది కోర్టులకు సుప్రీం స్పష్టం చేయడం అభినందనీయం. మైనర్‌ బాలిక రేప్‌ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సదరు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు చేసిన సంచలన తీర్పు అది.

సెక్షన్‌8కు వ్యతిరేకిని:పవన్‌

సెక్షన్‌-8కి తాను వ్యతిరేకినని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ అందరికీ సొంతిళ్లు వంటిదని, ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలను కేంద్రానికి అప్పగించాలనడం సరికాదని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అంతర్యుద్ధం వచ్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అప్పుడు సెక్షన్‌ 8 అవసరం వస్తుందని చెప్పారు. సెక్షన్‌ 8ను ప్రవేశపెట్టి కొత్త రాష్ట్రం ఇచ్చిన ఆనందాన్ని హరించొద్దని ఆయన అన్నారు. అవసరమైతే దీనికోసం హైదరాబాద్‌లో ఓ కేంద్ర కార్యాలయాన్ని పెట్టండి. ఓ ఐపీఎస్‌ అధికారికి దాని పర్యవేక్షక బాధ్యతలను అప్పగించండి. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి జవాబు చెప్పేలా చేయండి..' అని అన్నారు.

మారకపోతే పాతిపెడతారు : మధు

             రాజధాని ప్రాంతంలో రైతులను తప్ప పేదలను, దళితులను, వ్యవసాయ కార్మికులను, మైనార్టీలను, మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇకనైనా తీరుమార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాజధానిలోనే ప్రజలు ప్రభుత్వాన్ని పాతిపెడతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాజధానిలో పేదల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ రూ. 9 వేలు పరిహారమివ్వాలని, అసైన్డ్‌, సీలింగ్‌, చెరువుపోరంబోకు భూముల లబ్ధిదారులకు పరిహారం వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మికసంఘం, డ్వాక్రా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తుళ్లూరులో క్రిడా కార్యాలయం ముందు బైఠాయించారు.

Pages

Subscribe to RSS - July