July

బాబూ ఆత్మవిమర్శ చేసుకో:చిరు

రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడటంపై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు.కృష్ణా పుష్కరలప్పుడు జరిగిన ఘటనపై ప్రతిపక్ష నాయకుడిగా తను చేసిన వ్యాక్యల్ని గుర్తుచేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.. 

25లక్షల పరిహారం ఇవ్వాలి:సీపీఎం

రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడిన కుటుంబాకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేపట్టింది. అంతే కాకుండా క్షత గాత్రులను పరామర్శించేందుకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చిన సీఎం చంద్రబాబును అడ్డగించే ప్రయత్నం చేశారు.అప్రమత్తమైన పోలీసులు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు

డిమాండ్లపై కెవిపిఎస్‌ ఉద్యమం

 భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపర్చడం వల్ల దళితులు ఉద్యోగాలు పొంది కొంతవరకైనా అభివృద్ధి అవుతున్నారు. దీన్ని కూడా అగ్రకుల దురహంకారులు ఓర్వలేక పోతున్నారు. ఇంకెన్నాళ్లు రిజర్వేషన్లు, తీసేయమని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుందని అంటున్నారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు అమలుచేయబోమని పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు ముక్తకంఠంలో చెబుతున్నాయి. కానీ పాలకులు ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కల్గిస్తోంది.

కరువు చర్యలేవీ?

ఆదిలోనే హంసపాదులా ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావం తీవ్రరూపం దాల్చడం ఆందోళనకరం. నిరుటి కరువు, తుపాను ప్రకృతి బీభత్సాలకు నష్టాలపాలైన రైతుల్లో ఈ ఏడాది సకాలంలో నైరుతీ రుతుపవనాల రాక వలన తొలకరి ఆశలు చిగురించాయి. కాగా జూన్‌ మొదటి మూడు వారాల్లో మురిపించిన వర్షాలు అనంతరం మొరాయించి అన్నదాతల ఆనందాన్ని ఆవిరి చేశాయి. ఇరవై రోజులకు పైగా చినుకు కరువై వర్షాకాలంలో ఎండాకాలంలా తయారైంది. అసాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు ఎగబాకడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖరీఫ్‌ సాగు పడకేసింది. వానల కోసం రైతన్నలు మబ్బుల వంక ఎదురు చూస్తున్న విపత్కర పరిస్థితి.

పుష్కర ఘటన బాధాకరం:రాఘవులు

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 26 మంది చనిపోవడం దురదృష్టకర సంఘటన అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అని తెలిపారు. యాత్రికుల సంఖ్యను అంచాన వేసి వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం పుష్కర స్నానం పూర్తయిన అనంతరం అధికారులు చేతులెత్తేయండతో ఈ ప్రమాదం జరిగిందని రాఘవులు అభిప్రాయపడ్డారు.

ఆంధ్రాకు అణు ప్రమాదం..

అణు కేంద్రాలు సీసాలో బంధించిన పెను భూతాలని, ఎప్పుడు ప్రమాదమొస్తుందో తెలియదని, ప్రమాదం సంభవిస్తే ఎవరూ రక్షించలేరని భారత ఆర్థిక, ఇంధన వనరుల శాఖ విశ్రాంత కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ అన్నారు. కొవ్వాడ అణుపార్కు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్వాన శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో కొవ్వాడ అణుపార్కుపై అణు నిపుణులతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన సోమవారం చర్చా వేదిక జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శర్మ మాట్లాడుతూ, అణు వ్యర్థాలు అత్యంత విషతుల్యమని, ప్రమాదకరమని, సాంకేతికంగా వాటికి పరిష్కారం లేదని తెలిపారు.

రాష్ట్రంలో రాహుల్ పర్యటన

 ఆత్మహత్యలకు పాల్పడ్డ అనంతపురం రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అడ్డుకోవటానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుహెచ్చరించారు. హైదరాబాద్‌లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు తగిన శాస్తితప్పదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా తమ జాగీరుకాదన్న నిజాన్ని గ్రహించి జాగ్రత్తగా మసులుకోకపోతే పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి, ఆయన సొదరుడు ప్రభాకర్‌రెడ్డితీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుందని విహెచ్ హెచ్చరించారు. పార్టీ చంద్రబాబు టిడిపి ప్రజాప్రతినిధులను అదుపుచేయాలని ఆయన సలహా ఇచ్చారు.

తొక్కిసలాట దురదృష్టకరం:సీఎం

పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పరంగా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు.పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పుష్కర ఘాట్‌ల వద్ద అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఈ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి బయలుదేరి వెళ్లారు.

1975 ఎమర్జన్సీ సరైనదే..

దేశంలో 1975లో అత్యవసర పరిస్థితి విధించినందుకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. ఆ నిర్ణయం సరైనదేనని ప్రజలు గ్రహించారని, ఇందిరాగాంధీకి ఓటు వేసి తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. సోమవారం ఆయన ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఎందుకు మేం క్షమాపణ చెప్పాలి? అత్యవసర పరిస్థితిపై ఎందుకు చరించాలి? కొన్ని సంఘటనలు జరిగాయి. ఆతర్వాత దేశ ప్రజలు మళ్ళీ ఇందిరాగాంధీని ప్రధానిగా ఎన్నుకున్నారు. అందువల్ల మేం క్షమాపణ చెప్పాలంటే, అప్పుడు భారత ప్రజలు కూడా క్షమాపణ చెప్పాల్సి వుంటుంది.

బొగ్గు స్కాంలో బుక్కయారు

దేశంలో సంచనలం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదుచేయాల్సిందిగా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిపై అభియోగాలు ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ విచారణలో బొగ్గుశాఖ కార్యదర్శి హెచ్ సీ గుప్తా జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసును కూడా చేర్చాలని స్పష్టం చేసింది. గతంలోనే మధుకోడాకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

Pages

Subscribe to RSS - July