అభ్యుదయ భావజాలంతో దేశభక్తిని చాటుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర నుంచి ఎగసి పడ్డ కవి కెరటం గరిమెళ్ల.. 1892 జులై 15న నాటి కళింగాంధ్ర (నేడు ఉత్తరాంధ్ర) ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం ప్రియాగ్రహారంలో సూరమ్మ, వెంకట నరసయ్యకు జన్మించారు. ప్రజాకవి, జాతీయ కవి సార్వభౌమ బిరుదాకింతుడైన గరిమెళ్ల కలం గళమై బ్రిటిష్ సామ్రాజ్యపు గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. పాత్రికేయ వృత్తిని దేశ హితం కోసం, పరపీడన నుంచి జాతి విముక్తి కోసం అనేక రచనలు సాగించారు.