July

ఆధ్యాత్మికత-అసలు, నకిలీ

 ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటే హడావిడి. పుష్కరాలకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటిలో ఏవీ శాశ్వత నిర్మాణాలు కావు. కేవలం 12 రోజులకు తప్ప తరువాత పనికిరానివి. అసలు అప్పటిదాకా కూడా అవి ఉంటాయా అన్నది కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అలవిమాలిన అవినీతి, యథావిధిగా బాధ్యతారాహిత్యం సరే. అవి మన సనాతన సంప్రదాయాలలో భాగంగా ఎప్పుడో మారిపోయాయి కాబట్టి విశేషంగా చెప్పుకోవలసిన అవసరం లేకుండవచ్చు. ఇక రెండు ప్రభుత్వాలూ చేస్తున్న ప్రచారం చూస్తుంటే ప్రభుత్వాలే అజ్ఞానాన్ని పెంపొందించి మూఢనమ్మకాలను పెంచడానికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయా అనిపిస్తుంది.

బాబును నిందించడం తగదు:కమలానంద

రాజమండ్రి దుర్ఘటనను ప్రభుత్వ వైఫ్యలంగా చూపి రాజకీయ కోణంలో విమర్శలు చేయడం తగదని హిందు ధర్మ ప్రచారకులు కమలానందభారతి అన్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం సముచితం కాదని,ప్రతిపక్షాన్ని, ఇతర ప్రజాసంఘానులను ఉద్ధేషించి ఆయన అన్నారు. పుష్కరాల్లో మృతి చెందిన వారు పుణ్యలోకాలకు వెళ్లినట్టుగా భావించాలన్నారు. తెలంగాణలో పుష్కరాలకు నీరు తక్కువగా ఉందని, అందుకోసం మహారాష్ట్ర నుంచి నీటి విడుదలకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని కమలానంద భారతి సూచించారు.

ప్రభుత్వ హత్యలే..

ఇవి తొక్కిసలాట మరణాలు కావు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలు. గోదావరి పుష్కరాలు జరుపుతున్నాం రండి, రండి అని వేలాది మంది ప్రజలను రప్పించి నిర్లక్ష్యంతో సర్కారు చేసిన హత్యలివి. గొప్ప పరిపాలనా దక్షునిగా తనకు తానే కితాబులిచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో జరిగిన హత్యలివి. 
రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత పడ్డారన్న వార్త విన్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి బాధ్యులెవరు అని. మూడు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.

1107 జిఒ రద్దు చేయాలి:మధు

రైతుల భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పూనుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ కాల్పుల ఘటనకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి, మత్స్యకారుల ఐక్యవేదిక ఆధ్వర్యాన సోంపే టలో మంగళవారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న విమానా శ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచుగా తిరుగుతున్న సింగపూర్‌ అంతర్జాతీయ విమానా శ్రయం కూడా 1200 ఎకరాల్లోనే నిర్మించారని గుర్తుచేశారు.

వామ‌ప‌క్షాల పార్టీ‌ల దీక్ష ప్రారంభం

హైదరాబాద్: గ‌త ప‌ది రోజులుగా స‌మ్మె చేస్తు‌న్న మున్సి‌ప‌ల్ కార్మి‌కుల‌ను ప‌ట్టించుకొకుండా ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని దానికి నిర‌స‌న‌గా ప్రభుత్వ తీరును ఖండిస్తూ కార్మి‌కులు,వామ‌ప‌క్షాల పార్టీ‌లు నేటి నుంచి ఇందిరాపార్క్ వ‌ద్ద నిర‌హార‌దీక్షకు దిగాయి. ఈ దీక్ష‌లు సిపియం పోలిట్ బ్యూ‌రో స‌భ్యు‌లు బి.వి.రాఘ‌వులు ప్రారంభించారు. అనంత‌రం బి.వి.రాఘ‌వులు మాట్లా‌డుతూ మున్సి‌ప‌ల్ కార్మి‌కుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే పరిష్క‌రించాల‌ని లేకుంటే స‌మ్మె ఇంకా తీవ్ర రూపం దాలుచుతుందదాన్నా‌రు.

నేతలకే మద్యం ఆదాయం

 మద్యం దుకాణాలకు వేలం పాడిన వారంతా ఇప్పుడు తలలు పట్టుకురటున్నారు. లాభాలు బాగా ఉరటాయని ఈ వ్యాపారంలోకి వచ్చిన వారు తమ ఆదాయంలో సగ భాగాన్ని అప్పనంగా పరులకు ఇవ్వాల్సి రావడంపై వారంతా ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల నురచి భారీగా వసూళ్లు చేసే నేతల సంఖ్య పెరిగిపోతోరదట. పది నురచి గరిష్టంగా 50 శాతం వరకు వారికి చెల్లిరచుకోవాల్సి వస్తోరదని వ్యాపారులు అరటున్నారు. మద్యం దుకాణాలపై వేలం ముగిసిన వెరటనే అనేక మంది సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి వ్యాపారులతో సమావేశాలు నిర్వహిరచారు. ఆ ప్రారతంలో దుకాణాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి తమకూ వాటా కావాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోరది.

ఉధృతంగా మున్సిపల్‌ సమ్మె

 ఐదో రోజూ పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగింది. వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగాయి. వీరి ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. సమ్మెలో భాగంగా మంగళవారం విజయవాడలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎపి మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(జెఎసి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వచ్చిన కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌ రహదారిపై కార్మికులు మోకాళ్లపై నిలబడి రాస్తారోకో నిర్వహించారు.

నాగార్జున వర్శిటీలో ఆత్మ‌హ‌త్య

గుంటూరు జిల్లా‌లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్కే(బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ఫస్టియర్ చదువుతున్న రుషితేశ్విని అనే విద్యార్థిని ఉరేసుకుంది. మృతురాలిది వరంగల్ జిల్లా అని తెలుస్తోంది. ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

బాబు కాశీకి వెళ్లి ప్రక్షాళన చేసుకోవాలి:జగన్‌

గోదావరి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా తొలి రోజు మంగళవారం ఉదయం రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్ రెడ్డి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్టాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీవీఐపీ ఘాట్‌కు వెళ్లకుండా పబ్లిసిటీ కోసం సాధారణ భక్తుల ఘాట్‌కు వెళ్లారని విమర్శించారు. ఆయన రాక కారణంగా రెండున్నర గంటల పాటు భక్తులను ఆపడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

భక్తులు సంయమనంతోవుండాలి:పవన్

రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ అన్నారు. తాను పరామర్శకు రావాల్సి ఉన్నప్పటికీ, తాను వస్తే మళ్లీ తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నందున రావటం లేదని పవన్ వివరణ ఇచ్చారు. తాను లేకపోయినా, తన అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్యం బాధిత కుటుంబాలకు తగిన పరిహారాన్ని ప్రకటించాలని కోరారు. పుష్కరాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. భక్తులు కూడా సంయమనంతో పుష్కరాల్లో పాల్గొనాలని సూచించారు.

Pages

Subscribe to RSS - July