మున్సిపల్ కార్మికుల విషయంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా నేడు విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల జెఎసి ప్రకటించింది. రాష్ట్రంలో ఏడురోజులుగా సమ్మె కొనసాగుతున్నా పర్మినెంటు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మధ్య చీలికతెచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జెఎసి నాయకులు ఉమామహేశ్వరరావు, రంగనాయకులు, దశరధరామరాజు, వెంకటరత్ననాయుడు, వై.వి.రమణ, వి.రవికుమార్, ఎస్.శంకరరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.