July

రైల్వేస్టేషన్లు ప్రైవేట్ పరం

 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని 400 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ రంగం సాయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోవున్న ఎ వన్ క్యాటగిరీ, ఎ క్యాటగిరీ రైల్వే స్టేషన్లను ఎక్కడున్నది అక్కడే పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. రైల్వే స్టేషన్ భూమిని వాణిజ్యపరంగా అభివృద్ది చేసేందుకు కూడా అనుమతివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

కుల దురహంకార హత్యలపై సిపిఎం ఆందోళన

తమిళ నాడులో కుల దురహంకార హత్యలు నానాటికీ పెరుగుతుండటంపై సిపిఎం ఆందోళనను వ్యక్తం చేసింది. ఆత్మగౌరవంతో ఎవరైతే కులాలను ఎదిరించి వివాహాలు చేసుకురటారో వారికి విద్యా సంస్థల్లోను, ఉద్యోగాల్లోను రిజర్వేషన్లు కల్పించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. బుధవారం ముగిసిన పార్టీ రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశాలలో ఆమోదించిన తీర్మానాన్ని గురువారం ఈ విడుదల చేసింది. కులదురహంకార హత్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కుల సంబంధ సంఘటనలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, గత ఏడాది కాలంలోనే గౌరవ హత్యల పేరుతో 60 మందిని చంపేశారని అది పేర్కొంది.

గందరగోళంలో ఏపీ సర్కారు..

రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అయోమయం, గందరగోళానికి గురవుతోంది. ఏడాదిపాటు ఏమీ పట్టించుకోకుండా... పుణ్యకాలం ముగిసిన తర్వాత కూడా ఎటూ తేల్చుకోలేక తికమకపడుతోంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటైన సంస్థలను వాటి కార్యకలాపాలు, పని స్వభావాన్నిబట్టి 9, 10 షెడ్యూళ్లలో చేర్చారు. పదో షెడ్యూల్‌లో విద్యా, శిక్షణా సంబంధిత సంస్థలున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థ ఆ రాష్ట్రానికే చెందుతుందని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే... విభజన చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిపాటు ఈ సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలందించాల్సి ఉంటుంది.

సిపిఎం ఆధ్వర్యాన వ్యవసాయ సాగు

సిపిఎం ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు కోరంగి కంపెనీ భూముల్లో పోలెకుర్రు పంచాయతీకి చెందిన పేదలు గురువారం నుంచీ వ్యవసాయ సాగు ప్రారంభించారు. జూలై 13న కోరంగి కంపెనీ భూములను సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేదలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 200 మంది ప్రజలు ఈ భూముల్లో ప్రవేశించి గురువారం దుక్కిదున్నారు. సుమారు 25 ఎకరాల భూములను వీరు కష్టపడి సాగులోకి తెచ్చారు. 15 ఎకరాల భూముల్లో విత్తనాలు వెదజల్లారు. ఈ భూములను 30 ఏళ్లుగా భూస్వాములు అనుభవించారు.సుమారు 15 బస్తాల వరి విత్తనాలను నాటామని తెలిపారు. 

రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం

బేగంపేట ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక గజపతిరాజు పావులు కదుపుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు ప్రాంతంలో.. తెలంగాణ ప్రభుత్వం ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతుంటే.. ఏపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

ఇవాళ ఛలో విజయవాడ

వారం రోజులుగా సమ్మె చేస్తున్నాప్రభుత్వం పట్టించుకోకపోవడం పై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చారు.

పున:పరిశీలించండి!

భూ సేకరణ చట్ట సవరణపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నిర్వహించిన నీతి ఆయోగ్‌ భేటీకి అధికశాతం ముఖ్యమంత్రులు మొహం చాటేయడం, ఆ చట్టం పట్ల దేశంలో ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. చట్ట సవరణపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ సిఎంలు, కాంగ్రెస్‌, బిజెపియేతర సిఎంలతో పాటు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన పంజాబ్‌ అకాలీదళ్‌ సిఎం కూడా చట్ట సవరణను తోసిపుచ్చడం బిజెపికి మింగుడుపడని విషయం.

నేడు సిఎం కార్యాలయం ముట్టడి

మున్సిపల్‌ కార్మికుల విషయంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా నేడు విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల జెఎసి ప్రకటించింది. రాష్ట్రంలో ఏడురోజులుగా సమ్మె కొనసాగుతున్నా పర్మినెంటు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య చీలికతెచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జెఎసి నాయకులు ఉమామహేశ్వరరావు, రంగనాయకులు, దశరధరామరాజు, వెంకటరత్ననాయుడు, వై.వి.రమణ, వి.రవికుమార్‌, ఎస్‌.శంకరరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

భగవద్గీత మత గ్రంథం కాదు..

‘‘గీత ఒక మత గ్రంథం కాదు. వివేకం, శాస్త్రం (సైన్స్‌), ఎన్నో సమస్యలకు పరిష్కారం. ఇదే జీవనం. అందుకే గీతను పాఠశాలల్లో నైతిక విద్యగా బోధిస్తాం. యోగాను కూడా హిందూ ధర్మం అన్నారు. కానీ, జూన్‌ 21న 192 దేశాలు యోగా నిర్వహిస్తే.. అందులో 47 ముస్లిం దేశాలే. హర్యానా ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తోందని విమర్శిస్తున్నారు. మన సంస్కృతిని మనం నేర్చుకోవటం కాషాయీకరణ ఎలా అవుతుంది.?’’ అని హర్యానా విద్యా మంత్రి రాంవిలాస్‌ శర్మ ప్రశ్నించారు.

ఏపీ,ఒడిశాలకు తుఫాను సాయం

ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన తుఫాను సాయం పెంపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట ప్రకటించిన రూ.1496.71 కోట్ల నుంచి రూ.2331.71కు పరిహారాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తంలో రూ. 1843.94 కోట్లను ప్రపంచ బ్యాంకు రుణం రూపంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, మిగిలిన రూ.487.77 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

Pages

Subscribe to RSS - July