July

భగవద్గీత మత గ్రంథం కాదు..

‘‘గీత ఒక మత గ్రంథం కాదు. వివేకం, శాస్త్రం (సైన్స్‌), ఎన్నో సమస్యలకు పరిష్కారం. ఇదే జీవనం. అందుకే గీతను పాఠశాలల్లో నైతిక విద్యగా బోధిస్తాం. యోగాను కూడా హిందూ ధర్మం అన్నారు. కానీ, జూన్‌ 21న 192 దేశాలు యోగా నిర్వహిస్తే.. అందులో 47 ముస్లిం దేశాలే. హర్యానా ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తోందని విమర్శిస్తున్నారు. మన సంస్కృతిని మనం నేర్చుకోవటం కాషాయీకరణ ఎలా అవుతుంది.?’’ అని హర్యానా విద్యా మంత్రి రాంవిలాస్‌ శర్మ ప్రశ్నించారు.

ఏపీ,ఒడిశాలకు తుఫాను సాయం

ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన తుఫాను సాయం పెంపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట ప్రకటించిన రూ.1496.71 కోట్ల నుంచి రూ.2331.71కు పరిహారాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తంలో రూ. 1843.94 కోట్లను ప్రపంచ బ్యాంకు రుణం రూపంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, మిగిలిన రూ.487.77 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

హైకోర్టును విభజించండి

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది గడిచినా ఇంకా ఉమ్మడి హైకోర్టులోనే న్యాయవ్యవస్థ కొనసాగడంలో అర్థం లేదని, తక్షణమే హైకోర్టును విభజించాలని తెరాస ఎంపీలు గవర్నర్ నరసింహన్‌కు గురువారం విజ్ఞప్తి చేశారు. ఎంపీలు జితేందర్ రెడ్డి, కె.కేశవరావు, కవిత, వినోద్, కె.విశే్వశ్వర రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. హైకోర్టు విభజనపై కేంద్రం స్పష్టమైన చర్యలు తీసుకోకుంటే పార్లమెంటులో తాము ఆందోళన చేస్తామని ఎంపీలు ప్రకటించారు.

కుల గణాంకాలని వెల్లడించాలి

ఇటీవలి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక కుల గణంకాలను పూర్తి స్థాయిలో వెల్లడించాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. కుల గణాంకాల్ని విడుదల చేయకుండా అట్టిపెట్టడాన్ని సిపిఐ కేంద్ర కార్యదర్శి వర్గం తప్పు పట్టింది. ప్రభుత్వానికి చిత్త ఉంటే సర్వే వివరాలను పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యన్ని కప్పిపుచ్చుకునేందుకే కుల గణాంకాలను విడుదల చేయలేదని విమర్శించింది. 

మన ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రజాస్వామ్యీకరించాలి

 ''స్వామ్యం అంటే పరిపాలన. మన ప్రాచీన రాజనీతి శాస్త్ర గ్రంథాలలో ఈ కారణం చేత రాజుకు ''స్వామి'' అనే పేరు పెట్టబడింది. పరిపాలనలో అధికారాన్ని వహించే మంత్రులను, వివిధ శాఖల అధ్యక్షులను, ఉన్నత ఉద్యోగి వర్గాన్ని అతడు నియమించేవాడు. వారు అతనికి లోబడి తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తూండేవారు. అందుచేత ''స్వామ్యం'' అతనిదిగా ఉండేది. అతనిపై అధికారాన్ని వహించే వారెవరూ ఉండేవారు కారు. ఈ కారణంగా రాజు నిరంకుశుడయ్యాడు. ప్రజలను పీడించుకుతిన్నాడు. అంత్ణపుర కలహాలతో, యుద్ధాలతో, విలాసాలతో ప్రజా సంక్షేమాన్ని మరచి పాలించాడు.

ప్రజాతీర్పు వమ్ము

 గ్రీసులో చోటుచేసుకున్న తాజా పరిణామాలు వంచనాశిల్ప కళను పరాకాష్టకు తీసుకుపోయాయి. ఏ ఆర్థిక సంస్కరణలు తమ జీవితాలను అతలాకుతలం చేస్తాయని అక్కడి ప్రజానీకం భావించిందో ఆ నరకకూపం వైపే తమ ప్రజలను నడిపించడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధపడిన తీరు దిగ్భ్రాంతికరం. ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా నో అంటూ గ్రీసు ప్రజానీకం ఇచ్చిన తీర్పును అక్కడి పాలకపక్షం తారుమారు చేస్తున్న తీరు దిగజారుడుతనానికి నిలువెత్తు నిదర్శనం. నిరుపేదల పొట్టలు కొట్టి కార్పొరేట్లకు పంచిపెట్టే విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకమంతా ఏకతాటిపై నిలిచిన తరువాత కూడా ఇంత లొంగుబాటు ప్రదర్శించడం దారుణం.

ప్రభుత్వ తీరు మారకుంటే సహించబోం..

కృష్ణాజిల్లా‌లోని మైలవరం మండలం వెల్వడంలో సీపీఎం బృందం పర్యటించింది. ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ... రాజధాని పేరుతో పేదల భూములు లాక్కొని పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు మారకుంటే సహించమని స్పష్టం చేశారు. దేవినేనిఉమ‌కు మంత్రి పదవి వచ్చాక పేదల్ని పట్టించుకోవట్లేదన్నారు. మా ప్రాణాలు పోయినా పేదలకు భూములు దక్కేలా చేస్తామని హెచ్చరించారు.

ఈనెల24న రాహుల్ పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 24న పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓడిసి నుండి కొండకమర్ల వరకు ఐదు గ్రామాల్లో పది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని ఏపిపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రఘువీరారెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు సి.రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్‌రావు, జెడి శీలం ఈరోజు ఉదయం రాహుల్ గాంధీతో సమావేశమై ఆయన అనంతపురం జిల్లా పర్యటన గురించి చర్చించారు. రాహుల్ గాంధీ అదేరోజు డబురవాలి పల్లిలో మహిళా డ్వాక్రా సంఘాలతో సమావేశమై మహిళల సమస్యలపై చర్చిస్తారన్నారు.

ఇరకాటంలో మోడీ ప్రభుత్వం

వివాదాస్పద భూ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు నీతి ఆయోగ్‌ పాలనా నిర్వాహక మండలి సమావేశాన్ని ఒక వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించుకున్నారు. ఈ విష యాన్ని ముందే గ్రహించిన తొమ్మిది మంది కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు బుధవారం నాటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటిం చారు. ఈ తొమ్మిది మంది కాంగ్రెస్‌ సిఎంలతో సహా 12 మంది ముఖ్యమంత్రులు ఈ సమావే శానికి గైర్హాజరయ్యారు. గైర్హాజరైన కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల్లో తమిళనాడు, బెంగాల్‌, ఒడిషా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వున్నారు.

వాణిజ్య కేంద్రంగా అమరావతి

ఆసియా వాణిజ్య కేంద్రంగా అమరావతి మారనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. జపాన్‌లో వ్యాపారవేత్తల బృందం, ప్రభుత్వ ప్రతినిధులూ వాణిజ్య కేంద్రాల రాజధానిగా అమరావతి రూపుదిద్దుకునే అవకాశ ముందని చెప్పినట్లు తెలిసింది. తమ రాజధాని కంటే అధునాతనమైన, ఉత్తమమైన రాజధానిని ఏర్పాటు చేసేందుకూ అవకాశాలున్నాయని జపాన్‌ ప్రతినిధులు తెలిపారని క్రిడా కమిషనర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ చెబుతున్నారు. మాస్టర్‌ ప్లానొచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలుపెట్టేందుకు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు జపాన్‌ సంస్థలు ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు.

Pages

Subscribe to RSS - July