నేడు ప్రభుత్వదిష్టిబొమ్మల దగ్దం

అక్రమ అరెస్టులు, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జెఎసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. 18న ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జెఎసి పిలుపునిచ్చింది. 18, 19తేదిల్లో ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిల మద్దతు కోరుతూ సామూహిక రాయబారాలు నిర్వహించాలని, 20న కుటుంబ సభ్యులతో భిక్షాటన, 21న జిల్లా కలెక్టరేట్ల పికెటింగ్‌, 22న రాస్తారోకోలు, 23న పట్టణాల్లో నిరసన ర్యాలీలు, 24న మంత్రుల ఇళ్లను హోరావ్‌ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మున్సిపల్‌, ఉద్యోగులు, కార్మికులకు జెఎసి విజ్ఞప్తి చేసింది.