ఏపీ,ఒడిశాలకు తుఫాను సాయం

ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన తుఫాను సాయం పెంపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట ప్రకటించిన రూ.1496.71 కోట్ల నుంచి రూ.2331.71కు పరిహారాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తంలో రూ. 1843.94 కోట్లను ప్రపంచ బ్యాంకు రుణం రూపంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, మిగిలిన రూ.487.77 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.