December

భూసేకరణకు వ్యతిరేకంగా సదస్సు..

భూసేకరణ పేరుతో బలవంతంగా రైతులనుంచి భూమి సేకరించడాన్ని సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తీవ్రంగా వ్యతిరేకించారు.సిపిఎం రాష్ట్ర ప్లీనం సందర్బంగా రాజమండ్రిలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు .. అభివృద్ధి ముసుగులో భోగాపురం ఎయిర్‌పోర్టు, బందరు పోర్టు, సోలార్‌ పార్కుల పేరుతో ఏపీ సర్కారు భూమిని లాక్కుంటోందని ఆరోపించారు..

కాంగ్రెస్‌కు బాసటగా నితీష్..

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌కుబీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బాసటగా నిలబడ్డారు. రాజకీయాల్లో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు వుండరాదని అన్నారు. ప్రతిపక్షాలను ఇలా వేధింపులకు గురిచేయరాదని సూచించారు. పార్లమెంట్‌ వెలుపల గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమపై కక్ష తీర్చుకోవడం కోసమే కేంద్రం ఈడీ అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ కాంగ్రెస్‌ చేసిన విమర్శలపై స్పందించమని కోరగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేపై ఆందోళన..

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. మండల పదరిధిలోని గూడెపువలస వచ్చిన అధికారులను గ్రామ స్తులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు రెచ్చిపోయారు. రైతులను, మహిళలను, వారికి అండగా ఉన్న సిపిఎం నాయకులతో కలిపి 50 మందిని అరెస్టు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం హైకోర్టులో ఎయిర్‌పోర్టుపై న్యాయవిచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు సర్వేలు చర్చనీయాంశంగా మారాయి. కోర్టు తీర్పు వచ్చే వరకూ అగాలని రైతులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. అడ్డుకుంటే అరెస్టులు చేసైనా సర్వే చేస్తామని అధికారులు హెచ్చరించారు.

కల్తీ మద్యం బాధితులను పరామర్శ ..

విజయవాడలో కల్తీ మద్యం మరణాలపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. మెజిస్టీరియల్‌ విచారణ వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ మద్యం విధానంపై కమిషన్‌ నియమించాలని సూచించారు. విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో మద్యం సేవించి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, విజయవాడ నగర కార్యదర్శి డి.కాశీనాథ్‌తో కలిసి మధు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యాన్ని ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించటం శోచనీయమన్నారు.

సిఐటియు కార్యాలయం పోరాటాల కేంద్రం

పల్నాడులో నిర్వహించే ప్రజా పోరాటాలకు పిడుగురాళ్లలోని సిఐటియు కార్యాలయం కేంద్ర బిందువుగా మారనుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ పేర్కొన్నారు. పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తి నగర్‌లో ఏర్పాటు చేసిన సిఐటియు కార్యాలయం (కన్నెగంటి హనుమంత్‌ భవనం)ను ఆయన బుధవారం ప్రారంభించారు. ముందుగా కార్యాలయ శిలాఫలకాన్ని గఫూర్‌ ఆవిష్కరించగా ప్రధాన గదిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు ప్రారంభించారు. యూనియన్‌ పతాకాన్ని రైతు సంఘం జిల్లా నాయకులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు కార్యాలయం నుంచి ఐలాండ్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

పార్లమెంట్లో హెరాల్డ్ కేసు రగడ

బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పెట్టిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు కోర్టుకు హాజరవ్వాల్సిందేనంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేయటంతో ఈ కేసుపై రాజకీయ దుమారం చెలరేగింది. తమ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ మంగళవారం పార్లమెంటును స్తంభింపజేసింది. అవి నిరాధార ఆరోపణలని తిరస్కరించిన ప్రభుత్వం.. సోనియా, రాహుల్‌లు విచారణను ఎదుర్కోవాలని సూచించింది. కేసు విషయంలో కాంగ్రెస్ చాలా జవాబులు చెప్పాల్సి ఉందంటూ..

437.35కోట్ల చందాలతో బీజేపీ..

దేశంలో వివిధ రాజ కీయ పార్టీలకు అందుతున్న చందాలలో 2014-15 ఆర్థిక సంవ త్సరంలో భారీ వృద్ధి నమోదైంది.వివిధ రాజకీయ పార్టీలు తమకు రూ. 20 వేలకు మించి అందిన విరాళాల వివరాలను ఎన్నికల కమి షన్‌కు సమర్పించిన జాబితాల ఆధా రంగా ఏడీఆర్‌ నివేదిక తయారైంది. అంటే ఇవి బహిరంగంగా ప్రకటించిన విరాళాల వివరాలు మాత్రమే. ప్రకటిం చనివి ఇంతకు పలు రెట్లు అధికంగా ఉంటాయనేది తెలిసిందే. ప్రకటించిన మేరకే చూసినా, రూ. 437.35 కోట్ల చందాలతో బీజేపీ అన్నింటికన్నా ముందున్నదని సంస్థ తెలిపిన వివరాల్లో ఉంది.

రాజధానినుండిఢిల్లీకిమట్టి,నీరు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు ప్రత్యేక హోదా కమిటీ సభ్యులు. ఉద్దండరాయపాలెం నుంచి మట్టి,నీరు తీసుకువచ్చి ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద కలిపారు. కేంద్రం మాటలతో కాలయాపన చేస్తోందని వెంటనే ఏపీకి విభజన హామీలను అమలు చేయాలని సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  డిమాండ్ చేశారు. 

గ్రామాలు ఖాళీచేయండి:బాబు

పోలవరం నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయకుండా మొండికేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. డిసెంబర్‌ నెలాఖరుకు చేగొండపల్లి, జనవరి నెలాఖరుకు పైడిపాక, రామయ్యపేట గ్రామాలను ఖాళీ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నిర్వాసితులు ఊళ్లు వదిలిపెట్టకపోతే వారికి అందాల్సిన పరిహారం దక్కకుండా పోతుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు కూడా అందవని స్పష్టంచేశారు. 

Pages

Subscribe to RSS - December