హెరాల్డ్‌కేసులోకోర్టుకు సోనియా

నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ రేపు పాటియాలా హౌజ్‌ కోర్టులో హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సోనియా గాంధీ ధృవీకరించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో వారు ఇంతవరకు బెయిలు బాండ్‌ నింపలేదు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.