ఆర్టికల్స్
గ్రామీణ భారతపు ఘోర పరిస్థితి
Tue, 2015-07-14 12:49
భారత ప్రభుత్వం 'సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఇసిసి) -2011'ను జులై 3వ తేదీన విడుదలచేసింది. గ్రామీణ భారత దేశంలోని ప్రజల ఆర్థిక స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఈ సర్వేలోని వివరాలు తేటతెల్లం చేశాయి. ఈ సర్వేలోని సమాచారంపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనటంలో సందేహం లేదు. ఈ గణన వెల్లడించిన అనేక వాస్తవాలలో ఒకే ఒక దాని విశ్లేషణకు నేను పరిమిత మౌతాను. అదేమంటే గ్రామీణ భారతదేశంలోని మొత్తం కుటుంబాలలో రోజు కూలీ(కాజువల్ లేబర్)పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎంత నిష్పత్తిలో ఉన్నాయనేది.
యావత్తు గ్రామీణ భారతదేశంలో సర్వే చేసిన 17.91 కోట్ల కుటుంబాలలో 9.16 కోట్ల కుటుంబాలు లేక 51.14 శాతం కుటుంబాలు రోజు...
డిమాండ్లపై కెవిపిఎస్ ఉద్యమం
Tue, 2015-07-14 12:42
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపర్చడం వల్ల దళితులు ఉద్యోగాలు పొంది కొంతవరకైనా అభివృద్ధి అవుతున్నారు. దీన్ని కూడా అగ్రకుల దురహంకారులు ఓర్వలేక పోతున్నారు. ఇంకెన్నాళ్లు రిజర్వేషన్లు, తీసేయమని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుందని అంటున్నారు. ప్రైవేట్రంగంలో రిజర్వేషన్లు అమలుచేయబోమని పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు ముక్తకంఠంలో చెబుతున్నాయి. కానీ పాలకులు ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కల్గిస్తోంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు కావస్తోంది. ఒక ప్రక్క నాగరికత ఎంత గా అభివృద్ధి...
కరువు చర్యలేవీ?
Tue, 2015-07-14 12:36
ఆదిలోనే హంసపాదులా ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాభావం తీవ్రరూపం దాల్చడం ఆందోళనకరం. నిరుటి కరువు, తుపాను ప్రకృతి బీభత్సాలకు నష్టాలపాలైన రైతుల్లో ఈ ఏడాది సకాలంలో నైరుతీ రుతుపవనాల రాక వలన తొలకరి ఆశలు చిగురించాయి. కాగా జూన్ మొదటి మూడు వారాల్లో మురిపించిన వర్షాలు అనంతరం మొరాయించి అన్నదాతల ఆనందాన్ని ఆవిరి చేశాయి. ఇరవై రోజులకు పైగా చినుకు కరువై వర్షాకాలంలో ఎండాకాలంలా తయారైంది. అసాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు ఎగబాకడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖరీఫ్ సాగు పడకేసింది. వానల కోసం రైతన్నలు మబ్బుల వంక ఎదురు చూస్తున్న విపత్కర పరిస్థితి. పదమూడు జిల్లాల నవ్యాంధ్రలో ఆరు జిల్లాలు అనావృష్టితో అల్లాడుతున్నాయి. సీజను ఆరంభంలో కురిసిన వర్షాల వల్ల...
ఆర్థిక అసమానతలు
Tue, 2015-07-14 11:20
ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనికుల సంపద 50 శాతం ప్రపంచ జనాభాకు సరిసమానమని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇదిలాఉండగా యుకె ఓవర్సీస్ డిపార్ట్మెంటు ఆధారంగా ప్రపంచబ్యాంకు చెప్పిన 120 కోట్ల జనాభా కన్నా మరింత ఎక్కువమంది రోజుకు 1.25 డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతూ దారిద్య్రావస్థలో ఉన్నారు.
ఐఎమ్ఎఫ్ తన నివేదికలో ''ప్రపంచ ఆర్థికమాంద్యం 2009 తరువాత, ప్రస్తుత వార్షిక సంవత్స రంలో ఆర్థిక వృద్ధిరేటు అతి తక్కువగా నమోదవుతుంది'' అని పేర్కొంది. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ఊహించిన 3.5 శాతం వృద్ధిరేటుకన్నా 3.3 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అభిప్రాయపడింది. ఒకవైపు చైనా స్టాక్మార్కెట్ అలజడులు, గ్రీసు రుణభారాలు ఈ సంవత్సరపు...
వ్యసనం
Sun, 2015-07-12 10:43
వలదు వలదన్న వాటికే మనుషులు అలవాటు పడతారు. కాదు కాదన్న వాటి చెంతకే చేరుతారు. నిషేధిత పనుల మీదనే మనుషులకు ఆకర్షణ ఎక్కువ. సమాజం ఒప్పని పనులు చేయకూడదని తెలిసినా వాటి వైపే మొగ్గు చూపుతారు. తప్పని తెలిసినా వాటికి లొంగిపోతారు. అలవాటు అన్నది వదిలిపెట్టడానికి వీల్లేనంతగా పరిణమిస్తే వ్యసనమవుతుంది. ఆ వ్యసనానికి బానిసలయితే కోలు కోవడం కష్టం. అందువల్లనే మన పెద్దలు సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం క్షేమకరమని చెప్పారు. పురాణాలు, శాస్త్రాలు చెప్పిన ఈ ఏడు వ్యసనాల్లో జూదం, మాంసభక్షణం, మద్యపానం, వేశ్యాసంగమం, వేట, దొంగ తనం, పరస్త్రీలపై లౌల్యం ఉన్నాయి. ఇవే గాక ఇతరులు మరికొన్ని వ్యసనాల గురించి ప్రస్తావించారు. ఈర్ష్య, అసూయ, కోపం వంటి అవలక్షణాలతో తరచుగా కోపావేశాల్ని...
రమ్స్ఫెల్డ్కు జ్ఞానోదయం
Sun, 2015-07-12 10:39
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ నిర్దేశానుసారం ఇరాక్పై దాడి చేయటం ద్వారా చాలా పెద్ద పొరపాటు జరిగిందని అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రమ్సఫెల్డ్ కథనం. 2003లో ఇరాక్పై దాడికి ఈ రమ్స్ఫెల్డే నాయకత్వం వహించారు. ఇన్నాళ్ళ తరవాత బహిరంగంగా ఇరాక్లో అమెరికా చెప్పిన ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టింప జేయటానికి బుష్గారి నిర్డేశాను సారం యుద్ధం మొదలబెట్టటం పూర్తిగా తప్పని ఆయన ప్రకటిం చారు. ఇరాక్లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పాలనే పేరిట అక్కడి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను అధికారం నుంచి తొలగించి హత్య చేయటం అర్థం లేని, గందరగోళ చర్యని అన్నారు. లండన్ నుంచి వెలువడే 'ద టైమ్స్' పత్రికకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో 'నేనొక్కడినే కాదు, అమెరికా...
మన విద్యారంగం పయనమెటు?
Sun, 2015-07-12 10:35
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే కాదు, ఏదేశమేగినా ఎందు కాలిడినా మన రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. అభివృద్ధి గురించి ఆయన చెప్పే విషయాలు పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా చదువుతున్నాం. టీవీల్లో గంటల తరబడి వింటున్నాం. అభివృద్ధి అనగానే ఆయన చెప్పేది సింగపూర్, జపాన్ల గురించి. ఈ మధ్య చైనా గురించి కూడా చెబుతున్నారు. మన రాష్ట్రాన్ని సింగపూర్లాగా, జపాన్, చైనాల్లాగా అభివృద్ధి చెస్తాననే ముందు ఏ జాతి అయినా అభివృద్ధి చెందడానికి అతి ముఖ్యమైన, కీలకమైన రంగం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. విద్యాభివృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికీ, పేదరిక నిర్మూలనకూ అత్యంత కీలక విషయం. విద్యాభివృద్ధి జరక్కుండా ఏ దేశమూ, జాతీ అభివృద్ధి కాలేదు. సింగపూర్...
అడకత్తెరలో భారత జాతీయ బ్యాంకులు
Sat, 2015-07-11 17:28
ప్రపంచ ఆర్థిక సంకోభ ధాటి నుండి ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడం కోసం బాసెల్ 3 ప్రమాణాలు రూపకల్పన చేయబడ్డాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించిన కారణంగా భారత రిజర్వ్ బ్యాంక్ 1-4-2013 నుండి భారత దేశంలోని జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు బేసెల్ 3 ప్రమాణాలను అమలుచేయాలని అదేశించింది. ఈ ప్రమాణాల అమలుతో బ్యాం కుల పరిరక్షణ ఎలాగున్నా, అదనపు మూలధన సమీకరణలో జాతీయ బ్యాంకులు జీవన్మరణ పోరాటం జరుపుతూ, అంతిమంగా ప్రైవేటీ కరణ దిశగా అడుగులు వేయాల్సిన దుర్భర పరిస్థితులను నరేంద్రమోడీ నాయకత్వంలోని యన్డిఎ ప్రభుత్వం కల్పిస్తున్నది.
బేసెల్ ప్రమాణాల నేపథ్యం :
నయా ఉదారవాద...
ఈనాటికీ తరగని మార్క్స్ ప్రాధాన్యత
Sat, 2015-07-11 17:19
2007లో లండన్లో యూదుల పుస్తక వారోత్సవం జరుగుతున్నది. అప్పటికి కారల్ మార్క్స్ వర్థంతి (మార్చి14) మరి రెండు వారాలుంది. పుస్తక వారోత్సవం జరుగుతున్నది కూడా లండన్లో మార్క్స్తో బాగా ముడివడిన బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీలోని వలయాకారపు పఠన మందిరం సమీపంలో. జాక్స్ అట్టాలీ, నేనూ ఆయనకు జోహార్లర్పించేందుకు అక్కడకు చేరాం. మేమిద్దరం చాలా భిన్నమైన తరహాలకు చెందిన సోషలిస్టులం. అయితే మీరు ఆ తేదీని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది ఒకటికి రెండు రెట్లు ఊహించని విషయంగా కనిపిస్తుంది. 1883లో మార్క్స్ విఫలజీవిగా మరణించాడని ఎవరూ చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన రచనలు అప్పటికే జర్మనీపై, మరీ ముఖ్యంగా రష్యాలోని మేధావులపై ప్రభావం చూపడం ప్రారంభ మైంది. ఆయన...
పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమే
Sat, 2015-07-11 14:14
ఇటీవల స్మార్ట్ సిటీల గురించి పదేపదే వార్తలొస్తు న్నాయి. 2014లో ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణం చేసిన తర్వాత భారతదేశంలో స్మార్ట్సిటీలు నిర్మిస్తామని ప్రకటించారు. దేశంలో 100 నగరాలు నిర్మిస్తామని, కనీసంగా ప్రతి రాష్ట్రంలోనూ ఒక నగరమైనా నిర్మిస్తామని ప్రకటించారు. గరిష్టంగా గుజరాత్, కేరళ, కర్ణాటకలో ఒక్కో రాష్ట్రంలోనూ ఏడు సిటీల చొప్పున, కనిష్టంగా హిమాచల్ప్రదేశ్లో ఒకే ఒక్క నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో సరాసరిన 4 నుంచి 5 వరకూ నగరాలను నిర్మించనున్నట్టు ప్రకటనలు గుప్పించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఐదు నగరాలు నిర్మిస్తారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేసి జిల్లాకో స్మార్ట్ సిటీ నిర్మిస్తామని ప్రచారం...
అధికార మాఫియా
Sat, 2015-07-11 12:32
అసలే ఇసుక మాఫియా, దానికి అధికార పార్టీ అండ చేరితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వంలో భాగమైన శాసనసభ్యుడు అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి తానే స్వయంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి ఆనక అడ్డొచ్చిన తహసీల్దార్పై మహిళ అని కూడా చూడకుండా మందీమార్బలంతో విచక్షణారహితంగా దాడి చేయడం ఘోరం. అక్రమ ఇసుక దందాను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి చితక బాదడం దారుణం. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ప్రభుత్వ యంత్రాంగ మనోనిబ్బరంపై వేసిన వేటు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని...
టిడిపి ప్రభుత్వ ఏడాది పాలన నిర్వాకం
Fri, 2015-07-10 16:47
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆందోళనలు చెయ్యకూడదట. వీధుల్లోకి రాకూడదట. ఏం చేసినా కుక్కినపేనులా పడుండాలట. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మహానాడులో తీర్మానాన్నే ఆమోదించింది. అంగన్వాడీ, ఐకెపి ఉద్యోగులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అతీగతీ లేదు.
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు జూన్ 29, 30 తేదీలలో విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితి, సంక్షేమ పథకాలు, వాగ్దానాల అమలు, కార్మికుల, ఉద్యోగుల స్థితిగతులు, వాటిపట్ల ప్రభుత్వ తీరును సమావేశం సమీక్షించింది. దాని పూర్తి పాఠం.....
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బడ్జెట్ లోటు రూ.22...