ఆర్టికల్స్
చాప కింద నీరులా నియంతృత్వం..
Thu, 2015-06-25 12:01
పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్ఎస్ఎస్. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.
ఈ రోజు జూన్ 25. 19 నెలలపాటు కొనసాగిన అంతర్గత అత్యవసర పరిస్థితి విధించబడి నేటికి 40...
విప్లవ రాజకీయాల్లో అలుపెరుగని యోధుడు..
Mon, 2015-06-22 13:28
విప్లవ రాజకీయాల్లో అలుపెరుగని యోధుడు..
పార్టీ నిర్మాణ వ్యవహారాలు, పత్రిక కోసం రాజకీయ రచనల బాధ్యత ఉండటం వల్ల రోజూ రాత్రి 10 గంటలకు గాని ఇంటికి బయలుదేరేవారు కాదు. అప్పటి వరకూ నేనూ ఉండేవాణ్ణి. ఎన్నో విషయాలు బోధించేవారు. ఆయన జ్ఞాపకాలు చెప్పి ఉత్సాహపరిచేవారు. సమయం, సందర్భాన్ని బట్టి రచన ఉండాలనేవారు. వ్యర్థ పదాలు, పరుషమైన పదజాలం వాడకూడదనేవారు. పాఠకుడికి పరుష పదాలు చివుక్కుమనిపిస్తాయని చెప్పేవారు. ఆయా ఉద్యమ ఘట్టాలలో ఎన్నో రచనలు చేశారు. సంపాదకీయాలు రాశారు. శక్తివంతమైన విమర్శకే తప్ప పరుష పదజాలం వాడేవారు కాదు. రచనా వ్యాసంగంలో ఎంతో చేయి తిరిగిన మేటి అయితేనే అది సాధ్యమవుతుంది. యం.హెచ్. ఈ రెండు అక్షరాలు ఎంతో విలువైనవిగా...
బడి నవ్వుతోంది..!
Thu, 2015-06-18 12:20
కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ జీవో నెం.1(94) ప్రకారం యాజమాన్య కమిటీలు నియమించాలి. అధిక ఫీజుల తగ్గింపు, విద్యా ప్రమాణాల పెంపుదల, కనీస సౌకర్యాలు ఏర్పాటు విషయం ఆ కమిటీల్లో చర్చించి నిర్ణయాలు చేయాలి. ప్రజా ప్రతినిధులు తలో ఒక ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్ స్కూల్గా చేయటానికి దత్తత తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలనూ, ఐటిఐలనూ నేటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాలలో గురుకుల పాఠశాలలు ప్రారంభించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలను ఒక కిలోమీటరు పరిధిలో ఏ స్కూలుఉందో దానిలో చేర్పించుకోవాలి. ఏదో ఒక బడిలో చేర్చాలి. కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో పేద విద్యార్థుల కోసం...
స్వంతవారు చేదయ్యారా!
Mon, 2015-06-01 08:40
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం విదేశీ కార్పొరేట్ల చేతిమీదగానే జరుగుతోందని వినిపిస్తున్న విమర్శలకు ప్రభుత్వ చర్యలు బలం చేకూరుస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్లాట్ల లేఅవుట్ రూపకల్పనను పరాయి కన్సల్టెంట్లకు అప్పగించేందుకు సిఆర్డిఎ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ) అత్యుత్సాహం కనబరచడం ప్రభుత్వ వైఖరిలో భాగమే. ఇందుకోసం బహిరంగ టెండర్లు పిల్చినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రులవారి చూపంతా విదేశీ ప్లానింగ్ కంపెనీల మీదే ఉంది. సింగపూర్, జపాన్ వారు మినహా భారతీ యులు అందునా ఆంధ్రులు పనికి రాకుండా పోయారు బాబుగారికి. రాజధాని నిర్మాణానికి సంబంధించి గత కొంత కాలంగా జరుగుతున్న ఘటనలన్నీ వీటినే రుజువు చేస్తున్నాయి.
టెండర్లు...
ఉడతకేల ఊర్లో పెత్తనం..
Wed, 2015-02-11 17:28
వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారులను విమర్శిస్తూ కాశీకి బయలుదేరినట్లుగా ఈనెల 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెను విమర్శిస్తూ పారిశ్రామిక, వ్యాపారవేత్తల సంఘాలు దేశభక్తి తమకే ఉన్నట్లు నీతి వాక్యాలు బోధిస్తున్నాయి. పాలకుల పంచన చేరిన బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలు (కార్పొరేట్లు) దేశ ఆర్థిక వ్యవస్థకు సమ్మె వల్ల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంటున్నారు. దేశభక్తుల ఇంటికి, తమకు తడికే అడ్డం అన్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. భారత్కు వ్యాపార నిర్వహణకు అనుకూలంగా ఉన్న దేశం అనే మంచి పేరు పోతుందని ఆవేదన వ్యక్త పరిచారు. ఇంతటితో ఆగకుండా దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. ఉపాధి కల్పనకు కార్మిక చట్టాల సంస్కరణలు కీలకమైనవని...
వారి పోరాట బలం..త్యాగఫలం
Thu, 2015-01-08 13:15
అర్ధఫాసిస్టుల మారణకాండకు, భూస్వాముల హింసాకాండకు చిరునామాగా మారిన బెంగాల్లో బిగిసిన పిడికిళ్లు వారివి! వినిపించిన విప్లవ నినాదాలు వారివే! పీడిత, తాడిత ప్రజానీకపు విముక్తే లక్ష్యంగా ఎర్రజెండా ఎత్తిన ధీశాలులు వారు! దోపిడితో , పీడనతో విసిగిపోయి, బతుకులింతే అంటూ నిరాశ, నిస్పృహలో మునిగిపోయిన నిరుపేద ప్రజానీకపు గుండెల్లో ధైర్యాన్ని నింపి, పోరుబాట నడిపిన మార్గదర్శులు వారు! వారే ముజఫర్ అహ్మద్, జ్యోతిబసు, ప్రమోద్దాస్ గుప్తాలు! ఒకరు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నిర్మిస్తే, మరొకరు అద్బుతమైన పాలనదక్షతతో పేదల ఆకాంక్షలకు పట్టం గట్టి మార్క్మిస్టు మేరునగధీరుడిగా వినుతికెక్కారు. ఇంకొకరు విప్లవానికి వేగుచుక్కగా,కమ్యూనిజానికి నిలువెత్తు రూపంగా...