ఆర్టికల్స్

ఈనాటికీ తరగని మార్క్స్ ప్రాధాన్యత

2007లో లండన్‌లో యూదుల పుస్తక వారోత్సవం జరుగుతున్నది. అప్పటికి కారల్‌ మార్క్స్‌ వర్థంతి (మార్చి14) మరి రెండు వారాలుంది. పుస్తక వారోత్సవం జరుగుతున్నది కూడా లండన్‌లో మార్క్స్‌తో బాగా ముడివడిన బ్రిటిష్‌ మ్యూజియం లైబ్రరీలోని వలయాకారపు పఠన మందిరం సమీపంలో. జాక్స్‌ అట్టాలీ, నేనూ ఆయనకు జోహార్లర్పించేందుకు అక్కడకు చేరాం. మేమిద్దరం చాలా భిన్నమైన తరహాలకు చెందిన సోషలిస్టులం. అయితే మీరు ఆ తేదీని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది ఒకటికి రెండు రెట్లు ఊహించని విషయంగా కనిపిస్తుంది. 1883లో మార్క్స్‌ విఫలజీవిగా మరణించాడని ఎవరూ చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన రచనలు అప్పటికే జర్మనీపై, మరీ ముఖ్యంగా రష్యాలోని మేధావులపై ప్రభావం చూపడం ప్రారంభ మైంది. ఆయన...

పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమే

ఇటీవల స్మార్ట్‌ సిటీల గురించి పదేపదే వార్తలొస్తు న్నాయి. 2014లో ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణం చేసిన తర్వాత భారతదేశంలో స్మార్ట్‌సిటీలు నిర్మిస్తామని ప్రకటించారు. దేశంలో 100 నగరాలు నిర్మిస్తామని, కనీసంగా ప్రతి రాష్ట్రంలోనూ ఒక నగరమైనా నిర్మిస్తామని ప్రకటించారు. గరిష్టంగా గుజరాత్‌, కేరళ, కర్ణాటకలో ఒక్కో రాష్ట్రంలోనూ ఏడు సిటీల చొప్పున, కనిష్టంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే ఒక్క నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో సరాసరిన 4 నుంచి 5 వరకూ నగరాలను నిర్మించనున్నట్టు ప్రకటనలు గుప్పించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నగరాలు నిర్మిస్తారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేసి జిల్లాకో స్మార్ట్‌ సిటీ నిర్మిస్తామని ప్రచారం...

అధికార మాఫియా

 అసలే ఇసుక మాఫియా, దానికి అధికార పార్టీ అండ చేరితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వంలో భాగమైన శాసనసభ్యుడు అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి తానే స్వయంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి ఆనక అడ్డొచ్చిన తహసీల్దార్‌పై మహిళ అని కూడా చూడకుండా మందీమార్బలంతో విచక్షణారహితంగా దాడి చేయడం ఘోరం. అక్రమ ఇసుక దందాను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి చితక బాదడం దారుణం. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్‌ ప్రభుత్వ యంత్రాంగ మనోనిబ్బరంపై వేసిన వేటు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని...

టిడిపి ప్రభుత్వ ఏడాది పాలన నిర్వాకం

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆందోళనలు చెయ్యకూడదట. వీధుల్లోకి రాకూడదట. ఏం చేసినా కుక్కినపేనులా పడుండాలట. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మహానాడులో తీర్మానాన్నే ఆమోదించింది. అంగన్‌వాడీ, ఐకెపి ఉద్యోగులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అతీగతీ లేదు.
          సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు జూన్‌ 29, 30 తేదీలలో విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితి, సంక్షేమ పథకాలు, వాగ్దానాల అమలు, కార్మికుల, ఉద్యోగుల స్థితిగతులు, వాటిపట్ల ప్రభుత్వ తీరును సమావేశం సమీక్షించింది. దాని పూర్తి పాఠం.....
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బడ్జెట్‌ లోటు రూ.22...

ఉర్దూ పట్ల నిర్లక్ష్యం తగదు

భారతదేశం గుర్తించిన రెండవ అధికార భాష అయిన ఉర్దూను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఇంగ్లీషు తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష ఉర్దూ. కావున ఉర్దూనే మరింత అభివృద్ధి చేయాలి. అయితే ఉర్దూ భాష ఎక్కువగా ముస్లింలకే అనే ముద్రపడింది. కానీ ఉర్దూ అంతర్జాతీయ భాష. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం జపనీస్‌ భాషను కోర్సుగా పెట్టి నేర్పించాలని ప్రయత్నిస్తున్నది. కానీ ఇప్పటికే వాడుకలో ఉన్న ఉర్దూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. గతంలో ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉండేది. కానీ నేడు ముస్లిం సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఉర్దూ పాఠశాలలు అధికంగా ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు...

సమ్మె నివారించాలి

వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్లబోతున్నారు. ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా మున్సిపల్‌ కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను నివారించే మార్గం చూడాలి. అసలే వర్షాకాలం. మామూలుగానే దోమల ద్వారా, గాలి ద్వారా రోగాలు వ్యాపించే కాలం. దీనికి తోడు సమ్మె వలన అంటువ్యాధులు విజృంభిస్తే ఆ పాపం ప్రభుత్వానిదే అవుతుంది. మున్సిపల్‌ కార్మికులు ఒక రోజు విధులను బహిష్కరిస్తేనే రాష్ట్రం చెత్త కుప్పగా మారుతోంది. అటువంటిది నిరవధిక సమ్మెకు వెళ్లాలని ప్రధాన కార్మిక సంఘాలన్నీ నిర్ణయించినందున సమ్మె ఉధృతంగా సాగుతుందనడంలో సందేహం లేదు.

             చేతులు కాలాక ఆకులు...

చారిత్రాత్మక తీర్పు

జులై5న నిర్వహించిన రిఫరెండమ్‌లో గ్రీకు ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ప్రపంచ అభ్యుదయగాముక ప్రజల్లోనూ, శ్రామిక వర్గంలోనూ ఈ తీర్పు ఎంతటి ఉద్వేగం కలిగించిందో ఏథెన్స్‌తో సహా లండన్‌, మాడ్రిడ్‌ వంటి నగరాల్లో వ్యక్తమైన హర్షాతిరేకాలే తెలియజేస్తున్నాయి. తమ జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసే ఇయు రుణదాతల షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని గ్రీకు ప్రజలు ఈ రిఫరెండం ద్వారా మరోసారి తిరుగులేని తీర్పునిచ్చారు. గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో పొదుపు చర్యలకు వ్యతిరేకంగా పలు హామీలు ఇచ్చిన సిప్రాస్‌ నేతృత్వంలోని సిరిజా పార్టీకి వారు విజయం చేకూర్చి పెట్టారు. బెయిలవుట్‌ ఒప్పందం పేరుతో ఇయు విధించిన హానికర షరతులకు 61.3 శాతం ఓటర్లు 'నో' చెప్పడం...

మసకబారుతున్న మోడీ ''ప్రభ''

2013, 2014 సంవత్సరాల్లో 'హర, హర మోడీ' నినాదాలు దేశంలో మిన్నంటాయి. బిజెపిపై మోజుకంటే కాంగ్రెస్‌కు పట్టిన బూజు చూసి జనం (31 శాతమే) బిజెపికి ఓటేశారు. 'జనం' అంటే ఏ జనం అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అంబానీలు, అదానీల గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. సంవత్సరంలో మోడీ తిరిగిన 18 దేశాలకూ దేశంలోని పెట్టుబడిదారులను వెంటేసుకుని వెళ్ళారు. ఆస్ట్రేలియా, మంగోలియాకు అదానీని ప్రత్యేకంగా తీసుకెళ్ళారు. అందుకే అనుకుంటా ఆ బృందంలోని సభ్యుల వివరాలు ఇవ్వమని ఆర్‌టిఐ కింద అడిగినా ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఏమైనా, ఈ పెట్టుబడిదారుల 'బృందం' ఎన్నికల ముందూ బలపరిచారు. ఇప్పుడూ బలపరుస్తున్నారు. కానీ, వీళ్ళ ప్రతినిధి హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్‌ కేతన్‌ పరేఖ్‌ ''మోడీ ప్రభుత్వం...

ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?

 బిజెపి భీష్మాచార్యులు లాల్‌కృష్ణ అద్వానీ ''మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయని'' తన భయాన్ని పైకి వ్యక్తీకరించి, కొందరి మనసులనున్న, బయటకు రాని భయాన్ని ఆవిష్కరించారు. ''ఇప్పుడు మనం ప్రజాస్వా మ్యంలోనే ఉన్నామా?'' అసలు ప్రజాస్వామ్యమంటే ఏమిటీ? అనే ఇంకో ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ''అద్వానీ ఆ మాట ఎందుకన్నారు? రాబోయే చీకటి రోజుల చిహ్నాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఎలా అంచనా వేయగలిగారు? అన్నిటికీ సమాధానాలు అవసరమే!
ఒకటి మాత్రం నిజం. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైళ్లు నోళ్లు తెరుచుకున్నాయి. ఎందరినో జైళ్లలో వేశారు. ఇప్పుడు దేశమే జైలుగా ఉంది. కనిపించని జైలు గోడల మధ్య భయంతో, భక్తితో బతుకుతున్నాం. ఎమర్జెన్సీ కంటే ఇది చాలా భయంకరమైంది. 'ఎమర్జెన్సీ' అంటే...

వినాశనంలో విద్య..

 విద్య సరుకుగా మారటం, విద్య మతతత్వీకరణకు గురికావటం అనే రెండు మార్గాలలో విద్య నాశన మౌతోంది. పాలనా రంగంలో కొనసాగుతున్న కార్పొ రేట్‌- మతతత్వ మైత్రి ప్రతిరూపమే విద్యా రంగంలో సహజీవనం చేసు ్తన్న ఈ రెండు ధోరణులు.
                 విద్యా రంగంలోని ప్రధాన స్థానాలలో మిడిమిడి జ్ఞానమున్న విశ్వాసపాత్రులను ఎన్‌డిఎ ప్రభుత్వం నియమించటం ఆందోళన కలిగించే విషయం. దీనితో విద్యా వ్యవస్థ దెబ్బతింటున్నది. అయితే ఇదొక్కటే విద్యా వ్యవస్థకు ప్రమాదకారి కాదు. పెట్టుబడిదారీ ప్రపంచీకరణ తనతోపాటు విద్యారంగాన్ని నాశనంచేసే ప్రక్రియను మోసుకొచ్చింది. భారతదేశానికి సంబంధించినంత వరకు విద్యా రంగంలో మతతత్వ ఫాసిజం చొరబాటు ఒక ప్రధానమైన అదనపు అంశం. ఈ వినాశన...

బిజెపి అవినీతి 'వ్యాపం'

మధ్యప్రదేశ్‌లో బిజెపి ఏలుబడిలో వ్యవస్థీకృతమైన వ్యాపం కుంభకోణం భారతీయ కుంభకోణాల్లోకెల్ల అసాధారణం. దశాబ్దం పాటు అప్రతిహతంగా సాగిన భారీ అవినీతి పుట్ట పగిలి యావత్‌ దేశాన్ని విస్తుగొల్పుతోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఒక్కొక్కరు ఒక్కో విధంగా మరణించడం హరర్‌ సినిమాను తలపిస్తోంది. మాఫియా మూలాలు ఆక్టోపస్‌లా అన్ని దిక్కులకూ విస్తరించాయని దర్యాప్తు చేపట్టిన తర్వాతనే తెలిసొచ్చింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కిందకు రాని పలు ప్రభుత్వ పోస్టుల భర్తీ కోసం ఏర్పాటైన వృత్తి పరీక్షల మండలి (పిఇబి/వ్యాపం)లో చోటు చేసుకున్న అక్రమాలు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన అక్రమాలను తలదన్నేలా ఉన్నాయి. అక్రమార్కులు భారీ ఎత్తున ముడుపులు...

భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకున్న గ్రీసు ప్రజలు

ఐరోపాలో పతాక స్థాయికి చేరిన తగవులాట గ్రీస్‌కి, దాని రుణదాతలకూ మధ్య నడుస్తున్న రాజకీయ చదరంగంలో వేస్తున్న ఎత్తులు, పైఎత్తుల పర్యవసానం అని బయటివాళ్లకి అనిపిస్తుంది. నిజానికి ఐరోపా నాయకులు ఈ రుణ రణం మొక్క అసలు స్వభావాన్ని అంతిమంగా బయట పెడుతు న్నారు. దీని విశ్లేషణ అంత ఆనందదాయకంగా ఉండదు. ఇది డబ్బు, అర్థశాస్త్రం కంటే అధికారం, ప్రజాస్వామ్యాలతో ముడిపడిన అంశం.
త్రిమూర్తులైన యూరోపియన్‌ కమిషన్‌, యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐదేళ్ల క్రితం గ్రీస్‌మీద రుద్దిన అర్థశాస్త్రం ఘోరమైన ఫలితాలనిచ్చింది. గ్రీస్‌ స్థూల జాతీయోత్పత్తి 25 శాతం కుంగిపోయింది. మనం ఊహించగల ఏ మహామాంద్యం కూడా ఇంతటి వినాశకరంగా వుండదు. ఉదా హరణకు గ్రీక్‌ యువకులలో...

Pages