2016

మన్మోహన్ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ధ్వజం

పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ‘వ్యవస్థీకృతమైన, చట్టబద్ధమైన దోపిడీ’గా పేర్కొన్న మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ విమర్శలు చేసింది. ‘మన్మోహన్‌ సింగ్‌ను అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరిగా పరిగణిస్తారు. కానీ యూపీఏ పదేళ్ల హయాంలో ఆయన ఏం చేశారు? కనీవినీ ఎరుగని వరుస కుంభకోణాలు, చూసి చూడని విధానాలతో ఎక్కువ నల్లధనం సృష్టి అప్పుడే జరిగింది. ఇది జాతి సంపదను వ్యవస్థీకృతంగా దోచుకోవడం కాదా అని’ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార్‌ ప్రముఖ్‌ జె.నందకుమార్‌ విమర్శించారు.

ప్రధాని వ్యాఖ్యలపై గరం..గరం

ప్రధానమంత్రి పూర్తిస్థాయిలో సన్నద్ధమవకుండా నోట్లను రద్దు చేశారన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను పీఎం నరేంద్రమోడీ తిప్పికొట్టారు. నోట్ల రద్దుపై సిద్ధమయ్యేందుకు తగిన సమయం దొరకలేదనే బాధలో ప్రతిపక్షాలు ఉన్నాయిని ఆరోపించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ఉభయసభల్లో గందరగోళం సృష్టించాయి. పీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాలు నల్లధనం కలిగి ఉన్నాయనే విధంగా ప్రధాని వ్యాఖ్యానించారని, ఇది అన్ని పక్షాలను అవమానించడమే నని అభ్యంతరం తెలిపాయి.

మైనార్టీలపై మానసిక యుద్ధం

ఎల్‌కె అద్వానీ 2002లో తన రథయాత్ర ద్వారా కాషాయ శక్తులను పునరేకీక రించి డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును విధ్వంసం చేయించ టం ద్వారా దేశ లౌకికవాదాన్ని అపహాస్యం చేశారు. దాని ఫలితాన్ని వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు అనుభవిస్తుండటం వేరే విషయం అయినప్పటికీ, బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నుంచి తప్పించుకోవడం ద్వారా ప్రజా స్వామ్యాన్ని పరిహాసం చేశారు. ఆ క్రమాన్ని గుజరాత్‌లో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లిన మోడీ పరివారం ఇప్పుడు ఉత్త ర ప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా అసలు ప్రజా స్వామ్యం మనుగడనే సహించలేమన్నట్టుగా వ్యవ హరిస్తుండటం అత్యంత విచారకర అంశం.

గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్ లో చేర్చాలి

నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్ లో చేర్చాలని, గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దుచేయాలని, స్ధానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా వి.మాడుగుల తహశీల్ధార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు 

రూ.కోట్లు తెచ్చినా జాడలేని అభివృద్ధి

భట్టిప్రోలుకు కోట్లాడి రూపాయాలు తెచ్చామని చెబుతున్నా అభివృద్ధి జాడ మాత్రం లేదని సిపిఎం పాదయాత్ర బృందం పేర్కొంది. ఆ పార్టీ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండల కేంద్రమైన భట్టిప్రోలుతోపాటు అద్దేపల్లి, అక్కివారిపాలెం, పెదపులివర్రు, గొరికపూడి, కోళ్లపాలెం, ఓలేరు గ్రామాల్లో సాగింది. శ్మశాన వాటికలు, నివేశనా స్థలాల సమస్యలు మరీ దుర్భరంగా ఉన్నాయని ఆయా గ్రామాల వారు పాదయాత్ర బృందం వద్ద వాపోయారు. భట్టిప్రోలు, అద్దేపల్లిలో మురుగునీటి పారుదలకు డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టినా ఫలితం లేదని, మురుగునీరి రోడ్లపైకి వచ్చి వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోయారు.

పెద్దందార్ల ఆక్రమణలో భూములు

శావల్యాపురం మండలంలోని కనమ ర్లపూడి, శావల్యాపురం, పోట్లూరు, ఇర్లపాడులో సిపిఎం పాదయాత్ర సాగింది. కనమర్లపూడి ఎస్‌సి కాలనీలో తాగునీరు, డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలను, శావల్యాపురంలో ఇళ్ల పట్టాలు, స్థలాలను స్థానికులు పాదయాత్ర బృందం దృష్టికి తెచ్చారు. శ్మశానా స్థలాల పక్క పొలాలవారు దారి మూసేశారని తెలిపారు. పోట్లూరు ఎస్‌సి కాలనీలో దగ్గర్లోని ఐదెకరాల ప్రభుత్వ పోరంబోకు భూములను పేదలకివ్వాలని, గ్రామంలో 300 మంది అగ్రీగోల్డ్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇర్లపాడులో దళితులకు సంబంధించిన ఐదెకరాలను పెత్తందార్లు ఆక్రమించారని, ఎదిరించిన వారిపై కేసులు పెడుతున్నారని అక్కడివారు వాపో యారు.

Pages

Subscribe to RSS - 2016