పెద్దందార్ల ఆక్రమణలో భూములు

శావల్యాపురం మండలంలోని కనమ ర్లపూడి, శావల్యాపురం, పోట్లూరు, ఇర్లపాడులో సిపిఎం పాదయాత్ర సాగింది. కనమర్లపూడి ఎస్‌సి కాలనీలో తాగునీరు, డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలను, శావల్యాపురంలో ఇళ్ల పట్టాలు, స్థలాలను స్థానికులు పాదయాత్ర బృందం దృష్టికి తెచ్చారు. శ్మశానా స్థలాల పక్క పొలాలవారు దారి మూసేశారని తెలిపారు. పోట్లూరు ఎస్‌సి కాలనీలో దగ్గర్లోని ఐదెకరాల ప్రభుత్వ పోరంబోకు భూములను పేదలకివ్వాలని, గ్రామంలో 300 మంది అగ్రీగోల్డ్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇర్లపాడులో దళితులకు సంబంధించిన ఐదెకరాలను పెత్తందార్లు ఆక్రమించారని, ఎదిరించిన వారిపై కేసులు పెడుతున్నారని అక్కడివారు వాపో యారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు సైతం అర్హులకు ఇవ్వడం లేదని బృందానికి తెలిపారు.