ప్రధాని వ్యాఖ్యలపై గరం..గరం

ప్రధానమంత్రి పూర్తిస్థాయిలో సన్నద్ధమవకుండా నోట్లను రద్దు చేశారన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను పీఎం నరేంద్రమోడీ తిప్పికొట్టారు. నోట్ల రద్దుపై సిద్ధమయ్యేందుకు తగిన సమయం దొరకలేదనే బాధలో ప్రతిపక్షాలు ఉన్నాయిని ఆరోపించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ఉభయసభల్లో గందరగోళం సృష్టించాయి. పీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాలు నల్లధనం కలిగి ఉన్నాయనే విధంగా ప్రధాని వ్యాఖ్యానించారని, ఇది అన్ని పక్షాలను అవమానించడమే నని అభ్యంతరం తెలిపాయి.