2016

కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకం..

శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న సదస్సుకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాశ్ కరత్ హాజరయ్యారు .భారత్ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒకే చోట ఆరు రియాక్టర్లు పెట్టటం అనేది పెను ప్రమాదకరమని తెలిపారు.ఒకే ప్రదేశంలో ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేస్తే.. ఒక్క కొవ్వాడ ప్రాంతానికే కాదు..ఉత్తరాంధ్రలో వున్నటువంటి మూడు జిల్లాలకు తీవ్రమైన పెను ప్రమాదం పొంచి వుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గతంలో మన్ మోహన్ సింగ్ ప్రభుత్వ ఉన్నప్పటి నుండీ సీపీఎం పార్టీ పోరాడుతోందన్నారు.

ప్రభుత్వ విధానాలవల్ల ధరల పెరుగుదల

రోజురోజుకూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలోనూ, నిరుద్యోగాన్ని అరికట్టడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం నాయకులు వేమారెడ్డి అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం దేవాపురంలో అధిక ధరలకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. వేమారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు తగ్గినా ఇక్కడ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా నిరనన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ పేద ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం కల్పించడంలేదని అన్నారు.

రహస్య పత్రాల్ని బయటపెట్టిన కేంద్రం..

1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు అధికారికంగా ప్రకటించినా భారతీయులు అందరికి ఆయన మృతిపై ఆనుమానాలు మిగిలే ఉన్నాయి. తాజాగా కేంద్రం బయటపెట్టిన ఓ రహస్య పత్రంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 1999లో నేతాజీ మృతిపై వాస్తవాలను వెలుగులోకి తేచ్చేందుకు అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం జస్టిస్‌ మనోజ్‌ ముఖర్జీ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది.  2వేల సంవత్సరంలో నరేంద్రనాథ్‌ సింద్‌కర్‌ అనే జర్నలిస్టు ఈ కమిషన్‌కు ఓ అఫిడవిట్‌ సమర్పించారు. 1968లో నేతాజీ బతికే ఉన్నట్లు తన అఫిడవిట్‌లో సింద్‌కర్‌ పేర్కొన్నారు.

నీట్ ను రద్దు చేయాలని సుప్రీంలో పిటీషన్

కేంద్రం జారీ చేసిన నీట్ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయ్యింది. ప్రయివేట్ వైద్య కళాశాల యాజమాన్యాలు సంకల్ప్ స్వచ్ఛంధ సంస్థ, సామాజిక వేత్త ఆనంద్ రే పిటీషన్ దాఖలు చేశారు. కాగా పిటీషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ లతో కూడిన బెంచ్ కు నీటి ఆర్డినెన్స్ రద్దు పిటీషన్ సుప్రీం బదాలాయింపు చేసింది.

తీస్తా సెతల్వాద్‌ పిటిషన్‌ ఆగస్టు 17కు

నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తన స్వచ్చంద సంస్థతో పాటు తన వ్యక్తిగత ఖాతాలను ప్రభుత్వం నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ తీస్తా సెతల్వాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది. మరోవైపు ఫోర్డ్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన ఖాతాలతో పాటు, వ్యక్తిగత ఖాతాలు, వీటికి సంబంధం లేని ఇతర ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని తీస్తా సెతల్వాద్‌ ఇప్పటికే సుప్రీంకోర్టుకు నివేదించారు.

ఆర్‌బీఐ గవర్నరుగా అరవింద్‌ పనగారియా..

ఆర్‌బీఐ గవర్నరుగా రఘురాం రాజన్‌ పదవీకాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. రెండోవిడత ఈ పదవిలో కొనసాగబోనని, గత నెలలో రాజన్‌ ప్రకటించినప్పటి నుంచీ, ఆయన వారసత్వం ఎవరికి దక్కుతుందనే విషయమై పలు వూహాగానాలు వస్తున్నాయి. మరో రెండురోజుల్లోనే ఆర్‌బీఐ తదుపరి గవర్నర్‌ ఎవరో తేలుతుందని, పనగారియాకు అధిక అవకాశాలున్నట్లు తాజాగా ప్రచారం సాగుతోంది. ఈనెల 18లోగా ఆర్‌బీఐ గవర్నరు పదవిపై నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల సమయంలో మాయావతికి షాక్‌

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి మరో షాక్‌ తగిలింది. బీఎస్పీ నుంచి మరో కీలక వ్యక్తి పార్టీకి దూరమయ్యారు.దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన బీఎస్పీ జాతీయ కార్యదర్శి పరందేవ్‌ యాదవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. గత నెల రోజుల వ్యవధిలో నలుగురు ముఖ్య నేతలు పార్టీని వీడటం గమనార్హం.

సోనియా, ఒమర్‌తో రాజ్‌నాథ్‌ మంతనాలు

జమ్ముకశ్మీర్‌ సంక్షోభంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో మాట్లాడారు.జమ్ముకశ్మీర్‌ సంక్షోభంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో మాట్లాడారు.కశ్మీర్‌ అల్లర్లలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. ఉగ్రవాది బుర్హాన్‌ వనీ పోలీస్‌ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Pages

Subscribe to RSS - 2016