2016

గుజరాత్‌ నమూనాపై జాతీయ సదస్సులో విమర్శలు..

అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌ విధానాల ఫలితంగానే గుజరాత్‌ నమూనా రూపుదిద్దుకుందని భూమి అధికార్‌ ఆందోళన్‌ పేర్కొంది. గత మూడు రోజులుగా ఇక్కడ సాగుతున్న భూమి అధికార్‌ ఆందోళన్‌ జాతీయ సదస్సులో భాగంగా గుజరాత్‌ అభివృద్ధి నమూనాను బట్టబయలు చేసేందుకు ప్రత్యేక సమావేశం జరిగింది. గత 17 ఏండ్లుగా రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో అమలు జరుగుతున్న అభివృద్ధి విధానాల చీకటి పార్శ్వాలను ఈ సమావేశం ప్రముఖంగా ప్రస్తావించింది. రైతుల, కార్మికుల, ఆదివాసీల, దళితుల హక్కులను కాలరాస్తూ ఈ గుజరాత్‌ నమూనా ఆవిర్భవించిందని సమావేశంలో వక్తలు స్పష్టంచేశారు.

ఎంపీలకు రెట్టింపు వేతనాలు..!

కేంద్ర మంత్రుల బృందం సిఫారసులకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే ఎంపీల జీతాలు 100 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.50 వేలు వేతనంగా ఇస్తున్న మొత్తాన్ని రూ.లక్షకు పెంచాలని మం త్రుల బృందం తమ ప్రతిపాదనలను క్యాబినెట్‌కు నివేదిం చింది. వేతనాలపై గతంలో నియమించిన ఎంపీల కమిటీ సిఫారసులకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. ఇక ప్రధాని మోడీ కూడా అంగీకరిస్తే ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందే అవకాశ మున్నది.

బీజేపీ పాలనలో దళితులపై దాడులు..

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత దళితులపై దాడులు తీవ్రమయ్యాయని బీఎస్పీ అధినేత్రి, ఎంపీ మయావతి ఆరోపించారు. గుజరాత్‌లోని యునా పట్టణంలో దళిత యువకులపై జరిగిన పాశవిక దాడి ఘటనను ఆమె రాజ్యసభలో సోమవారం లేవనెత్తారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి, మయావతికి స్వల్ప వాగ్వాదం జరిగింది. రాజ్య సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన తరువాత చైర్మన్‌ అనుమతితో ఈ అంశంపై మాయవతి మాట్లాడారు. 

పెల్లెట్‌ గన్స్‌ వాడకం ఆపండి : సీపీఐ

కాశ్మీర్‌లో నెలకొన్న అశాంతిపై పీడీపీ-బీజేపీ కూటమి మౌనం సహించరానిదని సీపీఐ విమర్శించింది. రాష్ట్రంలో మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి తక్షణం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ జాతీయ సమితి ఒక తీర్మానంలో డిమాండ్‌ చేసింది.కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు దెబ్బతినిపోవడానికి కారణం పీడీపీ-బీజేపీ కూటమేనని సీపీఐ ఆరోపించింది.పెల్లెట్‌ గన్స్‌ వాడకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

కాశ్మీర్‌ ఘటనపై అఖిలపక్షం వేయాలి:ఏచూరి

కాశ్మీర్‌ అంశంపై చర్చ జరపాలని నోటీసులు ఇచ్చిన ఏచూరి తొలుత మాట్లాడుతూ... కాశ్మీర్‌ ప్రజలకు ప్రస్తుతం డాక్టర్లు అత్యవసరం కానీ రక్షణ దళాలు కాదని అన్నారు. అధిక రక్షణ దళాలను ఉపయోగించడం వల్ల పరిస్థితిని ఏమైనా అదుపులోకి తీసుకొచ్చామా అని ప్రశ్నించారు. పాకిస్తాన్‌ ఏమైనా కుట్రలు పన్నితే.. దాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టండి. అంతే తప్ప ఈ పేరుతో అమాయక కాశ్మీరీలను భయబ్రాంతులకు గురిచేయవద్దని కోరారు. కాశ్మీర్‌ అంశంపై అఖిల పక్షం వేయాలని డిమాండు చేశారు. 

ఎత్తుగడలతో ఏపీ కాంగ్రెస్ బిజీ

ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, కేవీపీ తదితర రాష్ట్ర నేతలు రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై చర్చించారు... బిల్లుకు ఇతర పార్టీల మద్దతు కూటగట్టడంపై సమాలోచనలు జరిపారు. పార్లమెంట్ లో కేవీపీ ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లు, దాని పై అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు.

స్విస్ కే ఏపి సర్కార్ మొగ్గు..

స్విస్ ఛాలెంజ్ విధానంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. స్విస్ ఛాలెంజ్ బిడ్డింగ్‌లకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్విస్ ఛాలెంజ్ పద్థతిలో రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. 

గురుకులాల ఘోష పట్టని సర్కారు

నాటి ముఖ్యమంత్రి యన్‌టి రామారావు, ఎస్‌ఆర్‌ శంకరన్‌ల ఆధ్వర్యంలో 1983లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశారు. అవి సాధారణ హాస్టళ్ళ కంటే మెరుగైన విద్య, క్రమశిక్షణ వంటి విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తూ నడుస్తున్నాయి. 1987లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను కలిపి ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐ సొసైటీ పేరుతో రాష్ట్ర సంస్థగా ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలపాటు విద్యావేత్తల ఆధ్వర్యంలో ఇవి సజీవంగా నడిచాయి. ఆ తరువాత ఈ సంస్థ స్థాయి పెంచి ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులను కార్యదర్శులుగా నియమించారు.

GST కాంగ్రెస్‌, బిజెపి వ్యవహారం కాదు

జిఎస్టీ బిల్లు కాంగ్రెస్‌, బిజెపి వ్యవహారం కాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ పక్షనేత సీతారామ్‌ ఏచూరి పేర్కొన్నారు. ఇది అన్ని పక్షాలకు, దేశ ప్రజలకు సంబంధించిన అంశమని అఖిల పక్ష సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గత రెండేళ్లగా సిపిఎం తరపున అఖిల పక్షం వేయాలని కోరుతున్నామన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు.

స్విస్‌ ఛాలెంజ్‌ బహిరంగం

నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సింగపూర్‌ కన్సార్టియం దాఖలు చేసిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనను బహిరంగ పరిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి స్విస్‌ ఛాలెంజ్‌పై ఉత్తర్వులు కూడా జారీ చేశారు.ఈ ఛాలెంజ్‌ ప్రతిపాదనను బాహాటంగా ప్రకటించి, ఇతర సంస్థల నుంచి కౌంటర్‌ ఛాలెంజ్‌ కోరాల్సి ఉంటుంది. వీలైంత త్వరగా ఛాలెంజ్‌ను బహిరంగపరచాలని నిర్ణయించారు. ముఖ్య మంత్రితో కూడా చర్చించామని, సోమవారం దీన్ని ప్రకటించే అవకాశాలున్నాయని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

Pages

Subscribe to RSS - 2016