ఎంపీలకు రెట్టింపు వేతనాలు..!

కేంద్ర మంత్రుల బృందం సిఫారసులకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే ఎంపీల జీతాలు 100 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.50 వేలు వేతనంగా ఇస్తున్న మొత్తాన్ని రూ.లక్షకు పెంచాలని మం త్రుల బృందం తమ ప్రతిపాదనలను క్యాబినెట్‌కు నివేదిం చింది. వేతనాలపై గతంలో నియమించిన ఎంపీల కమిటీ సిఫారసులకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. ఇక ప్రధాని మోడీ కూడా అంగీకరిస్తే ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందే అవకాశ మున్నది.