బీజేపీ పాలనలో దళితులపై దాడులు..

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత దళితులపై దాడులు తీవ్రమయ్యాయని బీఎస్పీ అధినేత్రి, ఎంపీ మయావతి ఆరోపించారు. గుజరాత్‌లోని యునా పట్టణంలో దళిత యువకులపై జరిగిన పాశవిక దాడి ఘటనను ఆమె రాజ్యసభలో సోమవారం లేవనెత్తారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి, మయావతికి స్వల్ప వాగ్వాదం జరిగింది. రాజ్య సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన తరువాత చైర్మన్‌ అనుమతితో ఈ అంశంపై మాయవతి మాట్లాడారు.