2016

గుజరాత్‌లో పట్టు కోసం కేజ్రివాల్‌

గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంత రైతులను జులై 9న కలవనున్నారు.

రాజధాని భూములు ప్రైవేటు వర్సిటీలకు

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో 15 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా మూడు ప్రైవేటు యూనివర్సిటీలు ఉ‍న్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమిటీ యూనివర్సిటీలు తమ క్యాంపస్లను అమరావతిలో నెలకొల్పడానికి వీలుగా వాటికి భూములను కేటాయించారు.

కొవ్వాడ అణువిద్యుత్ కు వ్యతిరేకంగా

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మించనున్న అణు పార్కుతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లనుందని సిపి ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు తెలి పారు.  సైట్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణ యం చేయకుండా రైతుల నుంచి భూములు తీసుకునే అది ప్ర‌కారం ప్రభుత్వానికి లేదన్నారు. గుజరాత్‌లోని మితివిర్ధిలో నిర్మించాల్సిన అణుపార్కును కొవ్వాడకు తరలిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం జూన్‌ నాలుగున ప్రకటించిందని, మోడీ-ఒబామా ఒప్పందం జూన్‌ ఏడున జరిగిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా? లేదా? అనేది చెప్పడం లేదని తెలిపారు. టిడిపి తక్షణమే తన వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

రోహిత్‌ చట్టంపై జేఎన్‌యూలో సదస్సు

 ఈ నెల 15, 16 తేదీలలో క్యాంపస్‌లో విద్యార్థి సంఘం ఆధర్వంలో నిర్వహించబోయే సదస్సులో దేశవ్యాప్తంగా 35కు పైగా యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, కార్యకర్తలు దీనికి హాజరవబోతున్నారు. జేఎన్‌యూ విద్యార్థి నేతలు 'రోహిత్‌ చట్టం' కోసం దేశవ్యాప్త సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆఫ్రికా దేశాల పర్యటనకు ప్రధాని..

 ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడమే ధ్యేయంగా ఐదురోజుల ఆఫ్రికా పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణం కానున్నారు. జులై 7 నుంచి 11వరకు మొజాంబిక్‌, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాలలో పర్యటిస్తారు.

రవాణా రంగాన్ని ప్రయివేటుపరం..

రోడ్డు రవాణా, భద్రత ముసాయిదా బిల్లు (2015) లక్ష్యం మోటార్‌ రవాణా రంగాన్ని మొత్తంగా ప్రయివేటుపరం చేయడమేనని కేంద్ర కార్మిక సంఘాలు ఆరోపించాయి. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును వ్రవేశపెట్టాలని కొందరు ఎంపీలు లేఖ రాయడం ఆశ్చర్యకరమని సీఐటీయూ, అఖిల భారత రోడ్డు రవాణా కార్మిక సమాఖ్య (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌)లు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

బిజెపి రెండేళ్ల పాలనలో సాధించింది శూన్యం

గత ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన బిజెపి.. తన రెండేళ్ల పాలనలో వైఫల్యాలు తప్ప సాధించిందేమీ లేదని, ప్రజలపై మరిన్ని భారాలు మోపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లలో దేశ ఎగుమతులు 15 శాతం తగ్గి దిగుమతులు పెరిగాయన్నారు. బుడగ మాదిరి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని సాక్ష్యాత్తు ఐక్యరాజ్య సమితే తన నివేదికలో పేర్కొందన్నారు.

Pages

Subscribe to RSS - 2016