2016

ఏచూరికి 'రామచంద్రన్‌' అవార్డు

 ప్రజాసేవలో విశేష కృషికి గాను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని 'ఎన్‌. రామచంద్రన్‌ స్మారక అవార్డు'తో సత్కరించారు. కేరళకు చెందిన ప్రఖ్యాత పాత్రికేయుడు ఎన్‌. రామచంద్రన్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎన్‌. రామచంద్రన్‌ పౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.

వీసా పాలసీ సరళీకరణ..

దేశంలోకి పెద్దఎత్తున పెట్టుబడులతో పాటు విదేశీ టూరిస్టులను ఆకట్టుకునేందుకు మోడీ సర్కార్‌ వీసా పాలసీని సరళీకరించాలని నిర్ణయించింది. పలు వీసా విభాగాలను ఏకీకృతం చేసేందుకు సంసిద్ధమైంది. బిజినెస్‌, టూరిస్టు, మెడికల్‌ వీసాను ఒక్కటిగా విలీనం చేసే ప్రతిపాదనకు హోంమంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 

25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం:విజయన్

సంప్రదాయక విధానానికి స్వస్తి చెప్పి, రాష్ట్రంలో కొత్త తరహా పాలనలో కేరళను అభివృద్ధి దిశలో నడిపేందుకు, అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఆ రాష్ట్ర ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రానున్న ఐదేండ్లలో ఐటీ, బయోటెక్నాలజీ, పర్యాటక రంగాల్లో కొత్తగా పది లక్షల ఉద్యోగాలను, వ్యవసాయ రంగంలో మరో 15 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు ప్రణాళికా రచన చేస్తున్నట్టు పినరయి విజయన్‌ ప్రభుత్వం పేర్కొంది. 

టీడీపీ నాయకులు ఇప్పుడేమయ్యారు ?

పరిశ్రమ యాజమాన్యం తరఫున ర్యాలీలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్మికులకు అన్యాయం జరిగినా పట్టించుకోకుండా ఏమయ్యారని సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిగి మండలంలోని ఎస్‌ఏ రావతార్ పరిశ్రమ యాజమాన్యం చట్టాలు, రాజ్యాంగాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాలకార్మిక చట్టానికి విరుద్ధంగా 10 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా పని కల్పిస్తోందని మండిపడ్డారు.

సియోల్‌ ప్లీనరీ..ఫలించని భారత్‌ యత్నాలు

అంతర్జాతీయ అణ్వ్తస్తాలు వ్యాప్తి చెందకుండా నిరోధించాలంటే ఎన్‌పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం) ని పూర్తి స్థాయిలో, సమర్ధవంతంగా అమలు చేయడమే కీలకమని సియోల్‌ ప్లీనరీ సమావేశాలు ప్రకటించాయి. గత రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అంటే భారత్‌కు అణు సరఫరా దేశాల గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం ఇచ్చే విషయంలో ఎలాంటి మినహాయింపులు వుండబోవని దీంతో స్పష్టమైంది

పన్సారే కేసులో స్టే పొడిగింపు..

హేతువాది గోవింద్‌ పన్సారే హత్య కేసులో అరెస్టు అయిన హిందూ గ్రూపు కార్యకర్త సమీర్‌ గైక్వాడ్‌పై అభియోగాల నమోదుపై విధించిన స్టేను బొంబాయి హైకోర్టు పొడిగించింది. బ్రిటన్‌ నుంచి ఫోరెన్సిక్‌ నివేదిక కోసం ప్రాసిక్యూషన్‌ వేచిచూస్తుండటంతో కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఢిల్లీకి ప్రత్యేక హోదాపై రెఫరెండం:కేజ్రీ

 ఈయూ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ రిఫరెండంలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడిన నేపథ్యంలో కేజ్రీవాల్‌... ఢిల్లీకి ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించారు. ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదాపై ప్రజల మనోభిష్టాన్ని తెలుసుకునేందుకు అలాంటి రెఫరెండంను దేశ రాజధానిలో నిర్వహించాలని కేజ్రీ భావిస్తున్నారు. 

రూ.14 కోట్ల బకాయిలు చెల్లించండి..

అనంతపురం జిల్లా పాల ఉత్పత్తిదారులకు ఏపి పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చెల్లించాల్సిన సుమారు రూ.14 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్‌ చేశారు. సేకరణ ధర తగ్గింపును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. వరుస కరవులతో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా లో ఆత్మహత్యలు, వలసలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని మధు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత, పాడి పరిశ్రమ ప్రధాన జీవనా ధారంగా ఉందన్నారు.

కేంద్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె

వచ్చే నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రైల్వే కార్మికులు, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెలో పాల్గొంటారని నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పేర్కొన్నారు

Pages

Subscribe to RSS - 2016