2015

కేంద్ర జ్యోక్యం తగదు:ఏచూరి

ఢిల్లీ పోలీసులు కేరళ హౌస్‌పై దాడి చేయడం ద్వారా నిబంధనలను అతిక్రమించారని సిపిఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కేంద్రం అనేక నైతిక సూత్రాలను వల్లిస్తుంది కాని అమలు చేయదని విమర్శించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో నడుస్తున్న అతిథి గృహంలోకి అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించడం, అక్కడి వంటకాలను తనిఖీ చేయడం తీవ్రమైన విషయమని ఆయన చెప్పారు. 

ఇదేనా బాబుగారి సమర్థత...

 ఎన్నికల ముందు చంద్రబాబు సమర్థుడని, అనుభవ జ్ఞుడని, తెలివైన వాడని తెలుగు దేశం పార్టీ, దాని మీడియా ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించింది. ఆయన అధికారంలోకొచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ కాలంలో ఆయన సమర్థత, అనుభవం దేనికి ఉపయోగించారు? ఎవరికి మేలు జరి గింది? ఎవరికి కీడు జరిగింది? ఆలోచించాల్సిన సమయం వచ్చింది. లేకుంటే ఆయన సమర్థతకు ప్రజలు మరింత మూల్యం చెల్లించుకో వాల్సిన పరిస్థితి రాబోతోంది.

మార్కెట్లలో ఫెడ్‌ భయాలు..

ముంబయి : అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుందన్న మరోమారు ఊహాగానాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒత్తిడికి గురి అయ్యాయి. సోమవారం తొలి గంటలో లాభాల్లో సాగిన మార్కెట్లు అనంతరం మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో నష్టాల వైపు సాగాయి. మంగళవారం నుంచి ఫెడ్‌ సమావేశాలు జరుగనున్నాయని, ఇందులో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని వచ్చిన వార్తల నేపధ్యంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 109 పాయింట్లు కోల్పోయి 27,362కు దిగజారింది. 

మోడీ ధోరణి మారాలి:VSR

దళితులపై నానాటికీ పెరుగుతున్న దాడులను అరికట్టడంలో మోడీ సర్కార్‌ విఫలమైందని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌(డిఎస్‌ఎంఎం) జాతీయ నేత వి.శ్రీనివాసరావు విమర్శించారు. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని సున్‌పెడా గ్రామంలో దళిత కుటుంబం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారి ఇంటిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ఘటనలో చనిపోయిన చిన్నారి దివ్య, వైభవ్‌లకు డిఎస్‌ఎంఎం నివాళులర్పించింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కేరళ భవన్‌ నుంచి జంతర్‌ మంతర్‌ వరకు దివ్య, వైభవ్‌ చిత్రపటాలను చేబూని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

బీఫ్‌ తింటే తప్పేంటి..రాష్ట్రపతికి లేఖ

చెన్నై : బీఫ్‌ తిన్నారని లేదా ఇంట్లో దాచుకున్నారనే అనుమానాలతో దేశంలో జరుగుతున్న హత్యలు, దాడులు పెద్దలనే కాదు, పిల్లలను సైతం కదిలిస్తున్నాయి. ఎ.డి. ఆరుష్‌ అనే ఆరేళ్ల 'రేపటి పౌరుడు' రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఒక లేఖ రాశారు. చెన్నైకి చెందిన ఈ పిల్లవాడు ప్రముఖ సిపిఎం నేత యు. వాసుకి మనవడు కావడం విశేషం.

UGC ని ముట్టడించిన SFI

దేశంలో జాతీయ అర్హత పరీక్ష(నెట్‌) యేతర ఫెలోషిప్‌ను రద్దుచేస్తూ యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజిసి) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భారత విద్యార్ధి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) సోమవారం ఢిల్లీలో యుజిసి ముట్టడి కార్యక్రమం తలపెట్టింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు పాల్గొని, యూజిసి లోపలకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఉద్రిక్తతకు దారి తీసింది. యుజిసి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వేలాది మంది విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. 

అబద్ధాలు ఆపి పనిచేయండి:రాహుల్

దేశంలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నా ప్రధాని నరేంద్రమోడీ స్పందిం చడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు.''కందిపప్పు రొట్టె తినకండి, దేవుడిని ప్రార్థించండి'' అంటూ మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అంటారని, కానీ వారు మాత్రం విమానా ల్లో అమెరికా, ఇంగ్లాండ్‌ దేశాలకు వెళ్లి పప్పు తిని వస్తారని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. 

తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు?

అసెంబ్లీ శీతాకాల సమావేశాల కోసం రాజధాని ప్రాంతం తుళ్లూరులో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలతోపాటు, శాసనమండలి సమావేశాలూ తుళ్లూరులోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో బీర్ పార్లర్స్ ..!

ఇక మీట నొక్కితే చాలు... చల్లని బీరు గ్లాసుల్లోకి చిటికలో చేరిపోతుంది. కొత్తగా ఈ బీర్‌ పార్లర్లను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయిరచిరది. మురదుగా మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఈ పార్లర్లను అనుమతి ంచాలనుకుంటున్నారు. కొత్తగా ప్రకటిరచ నున్న బార్‌ పాలసీలో వీటిని ప్రతిపాదిర చారు. త్వరలోనే కొత్త అరశాలతో నూతన బార్‌ పాలసీని ఆమోదిరచాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు 2016-17లో అదనపు ఆదాయం వచ్చే విధంగా కొత్త బార్‌ పాలసీలో ప్రతిపాదనలు చేయాలని యోచిస్తోరది.

భూములు లాక్కుంటే ఊరుకోం..

 పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కు ంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సర్వే చేసిన గ్రామాల్లో సోమవారం సిపిఎం బృందం పర్యటించింది. అధైర్య పడవలసిన అవసరంలేదని, రైతులకు సిపిఎం అండగా నిలుస్తు ందని భరోసా ఇచ్చారు. అనంతరం వైవి మాట్లాడు తూ, రాష్ట్రంలో జిల్లాకు లక్ష చొప్పున 13 లక్షల ఎకరాల భూమిని భూ బ్యాంకు పేరుతో ప్రభు త్వం లాక్కుంటోంద న్నారు.

Pages

Subscribe to RSS - 2015