ఎన్నికల ముందు చంద్రబాబు సమర్థుడని, అనుభవ జ్ఞుడని, తెలివైన వాడని తెలుగు దేశం పార్టీ, దాని మీడియా ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించింది. ఆయన అధికారంలోకొచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ కాలంలో ఆయన సమర్థత, అనుభవం దేనికి ఉపయోగించారు? ఎవరికి మేలు జరి గింది? ఎవరికి కీడు జరిగింది? ఆలోచించాల్సిన సమయం వచ్చింది. లేకుంటే ఆయన సమర్థతకు ప్రజలు మరింత మూల్యం చెల్లించుకో వాల్సిన పరిస్థితి రాబోతోంది.