బీఫ్‌ తింటే తప్పేంటి..రాష్ట్రపతికి లేఖ

చెన్నై : బీఫ్‌ తిన్నారని లేదా ఇంట్లో దాచుకున్నారనే అనుమానాలతో దేశంలో జరుగుతున్న హత్యలు, దాడులు పెద్దలనే కాదు, పిల్లలను సైతం కదిలిస్తున్నాయి. ఎ.డి. ఆరుష్‌ అనే ఆరేళ్ల 'రేపటి పౌరుడు' రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఒక లేఖ రాశారు. చెన్నైకి చెందిన ఈ పిల్లవాడు ప్రముఖ సిపిఎం నేత యు. వాసుకి మనవడు కావడం విశేషం.