
దళితులపై నానాటికీ పెరుగుతున్న దాడులను అరికట్టడంలో మోడీ సర్కార్ విఫలమైందని దళిత్ శోషణ్ ముక్తి మంచ్(డిఎస్ఎంఎం) జాతీయ నేత వి.శ్రీనివాసరావు విమర్శించారు. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని సున్పెడా గ్రామంలో దళిత కుటుంబం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో చనిపోయిన చిన్నారి దివ్య, వైభవ్లకు డిఎస్ఎంఎం నివాళులర్పించింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కేరళ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకు దివ్య, వైభవ్ చిత్రపటాలను చేబూని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.