దీర్ఘకాలం నుంచి అమల్లో ఉన్న భూ సేకరణ చట్టం-1894 స్థానంలో సక్రమ నష్టపరిహారానికి గల హక్కు, భూ సేకరణలో పారదర్శకత, పునరావాసం చట్టం-2013 (ఎల్ఎఆర్ఆర్ 2013)ను తెచ్చారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత, వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, గ్రామీణ పేదలు, సంబంధిత వ్యక్తులు అందరూ సవివరంగా చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం ఏకాభిప్రాయంతో ఈ చట్ట తెచ్చారు. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ రైతులు, భూమిపై ఆధారపడిన వారికి కొంతమేరకు రక్షణ కల్పించేలా, దేశ ఆహార భద్రతా ఆందోళనలను పరిష్కరించేలా ఎల్ఎఆర్ఆర్-2013 లో నిర్దిష్ట సూత్రాలు, నిబంధనలు పొందుపరిచారు.