మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమ్మె గురువారానికి ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రోజు రోజుకూ పోరాటం ఉధృత రూపం దాలుస్తోంది. అయితే సమ్మె డిమాండ్లు పరిష్కరించి, సమ్మెను నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖా మంత్రి డాక్టర్ నారాయణకు 'రాజమండ్రి పుష్కరాలు' లేదంటే జపాన్, సింగపూర్ల పర్యటనలకే కాలం సరిపోతుంది తప్ప, వేలాది దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందిన మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఆకలి కేకలు పట్టించుకునే తీరికలో లేరు. నగరాలు, పట్టణాలన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి.