2015

హోరాహోరిగా పార్లమెంట్ సమావేశాలు

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు తొలిరోజునుంచే వేడిపుట్టించనున్నాయి. ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీకి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఇతర కుంభకోణాల్లో ఇరుక్కున్న మరో ఇద్దరు బీజేపీ రాషా్ట్రల సీఎంలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రమణ్‌ సింగ్‌లు రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. పార్లమెంట్‌ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తమ వ్యూహానికి పదును పెడుతున్నాయి.

ఆధ్యాత్మికత-అసలు, నకిలీ

 ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటే హడావిడి. పుష్కరాలకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటిలో ఏవీ శాశ్వత నిర్మాణాలు కావు. కేవలం 12 రోజులకు తప్ప తరువాత పనికిరానివి. అసలు అప్పటిదాకా కూడా అవి ఉంటాయా అన్నది కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అలవిమాలిన అవినీతి, యథావిధిగా బాధ్యతారాహిత్యం సరే. అవి మన సనాతన సంప్రదాయాలలో భాగంగా ఎప్పుడో మారిపోయాయి కాబట్టి విశేషంగా చెప్పుకోవలసిన అవసరం లేకుండవచ్చు. ఇక రెండు ప్రభుత్వాలూ చేస్తున్న ప్రచారం చూస్తుంటే ప్రభుత్వాలే అజ్ఞానాన్ని పెంపొందించి మూఢనమ్మకాలను పెంచడానికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయా అనిపిస్తుంది.

బాబును నిందించడం తగదు:కమలానంద

రాజమండ్రి దుర్ఘటనను ప్రభుత్వ వైఫ్యలంగా చూపి రాజకీయ కోణంలో విమర్శలు చేయడం తగదని హిందు ధర్మ ప్రచారకులు కమలానందభారతి అన్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం సముచితం కాదని,ప్రతిపక్షాన్ని, ఇతర ప్రజాసంఘానులను ఉద్ధేషించి ఆయన అన్నారు. పుష్కరాల్లో మృతి చెందిన వారు పుణ్యలోకాలకు వెళ్లినట్టుగా భావించాలన్నారు. తెలంగాణలో పుష్కరాలకు నీరు తక్కువగా ఉందని, అందుకోసం మహారాష్ట్ర నుంచి నీటి విడుదలకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని కమలానంద భారతి సూచించారు.

ప్రభుత్వ హత్యలే..

ఇవి తొక్కిసలాట మరణాలు కావు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలు. గోదావరి పుష్కరాలు జరుపుతున్నాం రండి, రండి అని వేలాది మంది ప్రజలను రప్పించి నిర్లక్ష్యంతో సర్కారు చేసిన హత్యలివి. గొప్ప పరిపాలనా దక్షునిగా తనకు తానే కితాబులిచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో జరిగిన హత్యలివి. 
రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత పడ్డారన్న వార్త విన్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి బాధ్యులెవరు అని. మూడు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.

1107 జిఒ రద్దు చేయాలి:మధు

రైతుల భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పూనుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ కాల్పుల ఘటనకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి, మత్స్యకారుల ఐక్యవేదిక ఆధ్వర్యాన సోంపే టలో మంగళవారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న విమానా శ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచుగా తిరుగుతున్న సింగపూర్‌ అంతర్జాతీయ విమానా శ్రయం కూడా 1200 ఎకరాల్లోనే నిర్మించారని గుర్తుచేశారు.

వామ‌ప‌క్షాల పార్టీ‌ల దీక్ష ప్రారంభం

హైదరాబాద్: గ‌త ప‌ది రోజులుగా స‌మ్మె చేస్తు‌న్న మున్సి‌ప‌ల్ కార్మి‌కుల‌ను ప‌ట్టించుకొకుండా ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని దానికి నిర‌స‌న‌గా ప్రభుత్వ తీరును ఖండిస్తూ కార్మి‌కులు,వామ‌ప‌క్షాల పార్టీ‌లు నేటి నుంచి ఇందిరాపార్క్ వ‌ద్ద నిర‌హార‌దీక్షకు దిగాయి. ఈ దీక్ష‌లు సిపియం పోలిట్ బ్యూ‌రో స‌భ్యు‌లు బి.వి.రాఘ‌వులు ప్రారంభించారు. అనంత‌రం బి.వి.రాఘ‌వులు మాట్లా‌డుతూ మున్సి‌ప‌ల్ కార్మి‌కుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే పరిష్క‌రించాల‌ని లేకుంటే స‌మ్మె ఇంకా తీవ్ర రూపం దాలుచుతుందదాన్నా‌రు.

నేతలకే మద్యం ఆదాయం

 మద్యం దుకాణాలకు వేలం పాడిన వారంతా ఇప్పుడు తలలు పట్టుకురటున్నారు. లాభాలు బాగా ఉరటాయని ఈ వ్యాపారంలోకి వచ్చిన వారు తమ ఆదాయంలో సగ భాగాన్ని అప్పనంగా పరులకు ఇవ్వాల్సి రావడంపై వారంతా ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల నురచి భారీగా వసూళ్లు చేసే నేతల సంఖ్య పెరిగిపోతోరదట. పది నురచి గరిష్టంగా 50 శాతం వరకు వారికి చెల్లిరచుకోవాల్సి వస్తోరదని వ్యాపారులు అరటున్నారు. మద్యం దుకాణాలపై వేలం ముగిసిన వెరటనే అనేక మంది సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి వ్యాపారులతో సమావేశాలు నిర్వహిరచారు. ఆ ప్రారతంలో దుకాణాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి తమకూ వాటా కావాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోరది.

ఉధృతంగా మున్సిపల్‌ సమ్మె

 ఐదో రోజూ పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగింది. వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగాయి. వీరి ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. సమ్మెలో భాగంగా మంగళవారం విజయవాడలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎపి మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(జెఎసి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వచ్చిన కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌ రహదారిపై కార్మికులు మోకాళ్లపై నిలబడి రాస్తారోకో నిర్వహించారు.

ప్రభుత్వ ఏకపక్ష వైఖరి వల్లే విషాదం - సిపిఎం

ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్లే పుష్కర ఘాట్‌లో ప్రజలు తొక్కిసలాటలో చనిపోయారనీ, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలనీ, ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, పుష్కరాల్లో మిగిలిన రోజులైనా ఎలాంటి అపశృతీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోని క్షతగాత్రులు, బంధువులను ఆయన మంగళవారం పరామర్శించారు.

Pages

Subscribe to RSS - 2015