District News

జిల్లాలో వర్షాభావ పరి స్థితుల వల్ల వ్యవసాయం దెబ్బ తిందని, ఉపాధి కూలీలకు పనులు దొరకడం లేదని, ఈ నేపథ్యంలో కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సుదర్శనవర్మ స్మారక భవనంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో కరువు పరిస్థితి నెలకొంటే ముఖ్య మంత్రి విదేశీ పర్యటలకు ఎక్కువ సమయం కేటాయి స్తున్నారని అన్నారు. వేల, కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వెచ్చించి చేపట్టిన హంద్రీనీవా పనుల్లో మామూళ్ల కోసం నాణ్యతను పట్టించు కోకుండా నాసిరకంగా నిర్మాణం చేపటా ్టరన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీరు ఉంచాలని, జిల్లాలోని...

రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ వ్యాపార ధోరణులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సింగపూర్‌లో సిఎం బృందం ఇటీవలి పర్యటనలో పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లేరు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సిఆర్‌డిఎ పరిధిని పెంచారనే వార్తలూ వస్తున్నాయి. రెవెన్యూ శాఖను పక్కన పెడుతునట్టు, మున్సిపల్‌శాఖలో అధికారులను ఒక్కొక్కరిని మార్పు చేస్తున్నట్టు పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల్లోనూ సంబంధిత అధికారులకు సమాచారం ఉండటం లేదు. ఇటీవలి సింగపూర్‌ పర్యటనలో పట్టణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌కు స్థానం కల్పించలేదు. రాజధాని ప్రణాళికపై సింగపూర్‌లో...

 జిల్లాకేంద్రంలోని పెద్దాసుపత్రిని ప్రయివేటు సంస్థ మాన్సాస్‌కు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన గురువారం ధర్నా చేశారు. ఆసుపత్రి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ స భ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజి లేని జి ల్లా విజయనగరమేనన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు కూడా జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజి ఏర్పాటు చేస్తామని ప్రకటిం చారని తెలిపారు. కానీ నేడు కేంద్రమంత్రి అశోక్‌గజపతికి చెందిన మాన్సాస్‌ సంస్థ కు కేంద్రాసుపత్రిని కట్టబెట్టాలని నిర్ణయించడం దుర్మార్గమైన...

ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు మొండివైఖరిని కొనసాగిస్తే... ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా ప్రభుత్వ మెడలు వంచుతామని వామపక్షాలు హెచ్చరించాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్‌ మండలంలోని బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో భూసేకరణ నోటిఫికేషన్‌ ప్రకటించిన గ్రామాలైన మంగినపూడి, బుద్దాలపాలెం, గుండుపాలెంలో గురువారం సభలు నిర్వహించగా అందులో తొమ్మిది వామపక్ష అగ్రనేతలు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, భూ బ్యాంక్‌ పేరుతో ప్రతి జిల్లాలోనూ లక్షలాది ఎకరాలు సేకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగు లేస్తుండడంతో బాధితులందరినీ కూడగట్టడానికి వామ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. మంగినపూడిలో కొందరు భూస్వాములను...

అసైన్డ్‌, సీలింగు భూముల లబ్ధిదారులకు పరిహారం చెక్కులివ్వాలని రాజధాని ప్రాంత పేదలు వినూత్న నిరసనకు దిగారు. బహిరంగ నిరసనలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టి, అరెస్టులకు పాల్పడుతుండటంతో పేదలు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని స్వీయ గృహ దీక్ష చేపట్టారు. దాదాపు 30 చోట్ల వందలాది మంది మహిళలు ఈ దీక్షల్లో కూర్చున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టబోమని భీష్మించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో మోహరించారు.ఈ దీక్షలకు క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మద్దతు ప్రకటించారు. బాబూరావు మాట్లాడుతూ 206 ఎకరాల భూములను 380 మంది పేద రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారని వాటికి ఇంతవరకు కౌలు పరిహారం ఇవ్వలేదని...

ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ఉద్యమించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కూడా దోహదం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ లెనిన్‌ సెంటరు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏడాదిన్నర గడుస్తున్నా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌, పూర్తి స్థాయిలో పరిశ్రమలు, విద్యా సంస్థలు రాలేదన్నారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ పవర్‌ప్లాంటుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూములను కేటాయిస్తూ 2009లో 1107 జీవో విడుదల చేసింది. సర్వేనెంబరు 152/2లో 972 ఎకరాల భూమిని ఎన్‌సిసి లిమిటెడ్‌కు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి కేటాయించింది. పవర్‌ప్లాంట్‌ నిమిత్తం కేటాయించిన ఈ భూమికి చెందిన రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఆ ప్రాంతంలో వివిధ రూపాలలో ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలను, భూమి కోల్పోతున్న రైతులను ప్రజా...

హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పిన తీరు దుర్మార్గం. ఏ మాత్రం కనికరం లేకుండా పోలీసులు విరుచుకు పడిన తీరే పైనుండి అందిన ఆదేశాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అసాంఘిక శక్తులతోనూ, శత్రు సమూహాలతోనూ వ్యవహరించినట్లు పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించారు. విద్యార్థినులను సెల్‌ ఫోన్లో చిత్రీకరించడం, చున్నీలు గుంజడం, జుట్టు పట్టి లాగడం వంటి చర్యలు పోలీసుల అనాగరిక స్వభావాన్ని వెల్లడిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లు లాఠీఛార్జీ చేయడం, సొమ్మసిల్లి పడిపోయిన వారిని కూడా బూటు కాళ్లతో తొక్కడం, బలవంతంగా వ్యాన్‌లలో ఎక్కించిన తరువాత కూడా పిడిగుద్దులకు దిగడం వంటి చర్యలు ఏ నాగరికతకు వారసత్వమో పోలీసు...

కార్పొరేట్ల అనుకూల విధానాలను అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా తరగతుల ప్రజలు విశాల ఉద్యమం చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. పార్టీ ఒంగోలు జిల్లా కమిటీ సమావేశం మంగళవారం సుందరయ్య భవన్‌లో జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వై వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల అనుకూల విధానాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం గతం కంటే మరింతగా కార్పొ రేట్ల ప్రయోజనాలు కోసం పని చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పేరు చెప్పి బహుళజాతి కంపెనీలకు, పెద్దపెద్ద...

 తూర్పుగోదావరి జిల్లా చింతూరులో గిరిజన సంఘం, జన విజ్ఞాన వేదిక, ఎపిఎంఎస్‌ఆర్‌యు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. మన్యంలో మలేరియా కేసులు లేవని ప్రభుత్వం చెబుతోంది. వైద్య శిబిరంలో బ్రెయిన్‌ మలేరియా కేసులు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చింతూరులో ఈనెల 23న ప్రారంభమైన వైద్య శిబిరం అక్టోబర్‌ 22 వరకు కొనసాగనుంది. బుధవారం 43 గ్రామాల నుంచి రోగులు తరలివచ్చారు. 109 మందికి పరీక్షించగా, 22 మంది జ్వరపీడితులు ఉన్నారు. వీరిలో ఆరు బ్రెయిన్‌ మలేరియా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  మిడియం బాబూరావు చెప్పారు. గురువారం 50 మంది రోగులను పరీక్షించగా, వారిలో 13 మంది...

Pages