District News

మున్సిపల్‌ కార్మికుల పొట్టగొట్టే 279 జీవోను రద్దుచేయాలని కోరుతూ కనిగిరి నగర పంచాయతీ కార్మికులు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కనిగిరి డివిజన్‌ కార్యదర్శి పీసీ కేశవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఉద్యోలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్‌, ఉపాధి హామి సిబ్బంది తొలగించారని, ఆరోగ్య మిత్ర, అంగన్‌వాడీల మెడమీద కత్తిపెట్టారని ఆన్నారు. మున్సిపల్‌ కార్మికుల తొలగింపునకు జీవో జారిచేయటం దారుణమన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల తొలగింపు చర్యలు మానుకోవాలని లేకుంటే పోరాటాలు తీవ్రతరం...

మున్సిపల్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి పురపాలక సంఘం వరకు వారు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, కార్మికులకు ప్రభు త్వమే వేతనాలు చెల్లించాలని, ప్రజల పై భారాలు చేసే యూజర్‌ ఛార్జీలను విరమించాలన్నారు. 279 ఇఒని రద్దు చేయాలని వారు డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో సిఐటియు నాయకులు...

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని, మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు అన్యాయం చేసే జిఒ 279ని రద్దు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా అధ్యక్షులు ఆది నికల్సన్‌ డిమాండ్‌ చేశారు.జిఒ 279ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నికల్సన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకునేందుకు ఈ జిఒ తీసుకువచ్చిందన్నారు. జిఒ అమలులోకి వస్తే ప్రభుత్వానికి, కార్మికులకు సంబంధం లేకుండా పోతుందని తెలిపారు. మున్సిపాల్టీల్లో...

                       అతి కీలకమైన రవాణా శాఖను ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించాలని చూస్తోంది. అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రైవేటు రాగం తీస్తున్న చంద్రబాబు ఒక్కొక్క ప్రజా సేవపై వేటు వేస్తూ వస్తున్నారు. తాజాగా రవాణా శాఖ సేవలను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేశారు. బిడ్డింగుల పేరిట బహుళ జాతి సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించాలని చూస్తున్నారు. ముందుగా వాహన సేవలన్నింటినీ ఆన్‌లైన్‌ చేసి, వాటి బాధ్యతను ఐదు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి కోట్ల రూపాయల భారాలను ప్రజలపై వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఫిబ్రవరి నాటికి విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నూతన విధానం వల్ల రాష్ట్ర రవాణా శాఖలోని వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం...

 వంశధార నిర్వాసితులకు పునరావాసం, 2013 ఆర్‌అండ్‌ఆర్‌ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, అప్పటివరకూ పనులు నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ సీతారామారావును సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోరాడ నారాయణరావు, వంశధార నిర్వాసిత సంఘం ప్రతినిధి జి.సింహాచలం వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ జలాశయం పనులు చేపట్టి దశాబ్దకాలం పూర్తయినా నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పంచలేదని తెలిపారు. ధరలు పెరిగినా, చట్టాల్లో మార్పు వచ్చినా ఒక నిర్దిష్ట కాలంలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ప్రభుత్వ...

           విశాఖపట్నం, వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు కె లోకనాధం, డాక్టర్‌ బి గంగారావు ఆర్‌కెఎస్‌వి కుమార్‌ ఈస్ట్‌కోస్టు రైల్వే జనరల్‌ మేనేజరు రాజీవ్‌ విష్ణోరుకు వినతిపత్రం అందజేశారు. శుక్రవార స్థానిక డిఆర్‌ఎం కార్యాలయంలో జిఎమ్‌ను కలిసి, వినతిపత్రం అందజేసిన తర్వాత వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం, 2014లో పేర్కొన్న విశాఖపట్నం ప్రత్యేకరైల్వేజోన్‌ అంశాన్ని జిఎం దృష్టికి తీసుకెల్లామన్నారు. ఏడాదికి సుమారు రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోర్టు స్టీల్‌ప్లాంట్‌, సెజ్‌లు, ఫార్మా ఇండిస్టీలు, విద్యాసంస్థలు...

            విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ కంపెనీ విస్తరణ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, దీని కోసం వచ్చే నెల 23న నిర్వహించబోయే ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు లోకనాథం రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. 'భద్రతా చర్యలు పాటించకపోవడంతో తరచూ డెక్కన్‌ కెమికల్‌ కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించని ఈ కంపెనీ విస్తరణకు అనుమతులు మంజూరు చేస్తే కంపెనీ కార్మికులతో సహా పరిసర రాజవరం, గజపతినగరం, పెంటకోట, వెంకటనగరం, రాజానగరం, కేశవరం, శ్రీరాంపురం, రాజగోపాలపురం ప్రజలకు తీరని...

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, బిసిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన వేదిక రాష్ట్ర గౌరవ సలదారులు ప్రొఫెసర్‌ ఎ.దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్‌ ఛైర్మన్‌ గంటా శ్రీరామ్‌ అధ్యక్షతన స్థానిక వివేకానంద హాలులో ఆదివారం జిల్లా సదస్సు జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. బిసిల నివాస ప్రాంతాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయని తెలిపారు....

ప్రజా ప్రయోజనాల పేరుతో గిరిజనుల జీవితాలను ఫణంగా పెట్టి కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసం బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న పాలకుల నిరంకుశ చర్యలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని నార్ల వెంకటేశ్వరరావు భవన్లో 'జువార్‌ నేస్తం' పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం 'బాక్సైట్‌ తవ్వకాలు-గిరిజనుల భవితవ్యం' అంశంపై ఎపి గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత విస్తృతపర్చేందుకు గిరిజనులంతా ఏకోన్ముఖంగా కదలాలన్నారు. బాక్సైట్‌ తవ్వకాలు అన్‌...

దళిత పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల‌ ఆత్మహత్యకు కారకులైన విసి అప్పారావు, కేంద్ర‌మంత్రులైన బండారు, స్మృతి ఇరానీల‌ను కూడా  కఠినంగా శిక్షించాల‌ని కోరుతూ శుక్రవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ బంద్‌ పూర్తిగా జయప్రదమయ్యింది. వేలాదిమంది విద్యార్ధులు తమ తరగతుల‌ను బహిష్కరించి  భారీ ర్యాలీ నిర్వహించారు. గత రెండురోజుల‌ నుండి ఎస్‌.ఎఫ్‌.ఐ నాయ‌కులు ప్రతి విద్యార్ధిని కలిసి కరపత్రాలు పంపిణీచేసి బంద్‌లో పాల్గొవాల‌ని పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. నేడు జరిగిన బంద్‌లో సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌.నరసింగరావు, నగర, జిల్లా కార్యదర్శులు బి.గంగారావు, కె.లోకనాధం గార్లు కూడా పాల్గొని తమ మద్దతు తెలియజేసారు. ఇత‌ర వామ‌ప‌క్ష‌పార్టీలు,...

Pages