District News

ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ హాయాంలో విడుదలచేసిన జి.వో.నెం.289ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, ఎపిఎండిసికి 1212 హెక్టార్లు బాక్సైట్‌ తవ్వకాల అనుమతులకు సంబంధించిన జి.వో.నెం.97 రద్దుకు సమాదానం చెప్పకుండా దాటివేశారు. దీనిని సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గిరిజనుల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్తామన్న చంద్రబాబు గిరిజన సలహా మండలి ఏర్పాటుపై పెదవి విప్పలేదు. దీనిని బట్టి బాక్సైట్‌ తవ్వకాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కపటనాటకాలాడుతుందని అర్ధమౌతుంది.

                చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా తన హాయంలో విడుదల చేసిన జి.వో.నెం.97ను, అన్‌రాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను...

 కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళంపై కలెక్టర్‌ సమాధానం చెప్పాలని నినదించారు. కలెక్టర్‌ తీరును నిరసిస్తూ వాహనాన్ని కదలకుండా సిపిఎం శ్రేణులు భైఠాయిం చాయి. ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించారు. ఈ బృం దాలు కలెక్టరేట్‌లోకి చేరుకున్న వెంటనే ఉద్యమకా రులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.కలెక్టర్‌ సభాభవన్‌లోని గ్రీవెన ్‌సెల్‌ కార్యక్రమంలో ఉన్నప్పటికీ స్పందించక పోవడం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా భవనం వద్దకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు...

అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అంగన్‌వాడీల ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సిఎం క్యాంపు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో 20 మంది అంగన్‌వాడీలు అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీకి మద్దతు తెలిపిన సిపిఎం, సిఐటియు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో టిడిపి ప్రభుత్వమే భూకబ్జాదారుగా మారిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. భూసేకరణ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల, బ్రాహ్మణపల్లె, గడివేముల మండలం గని గ్రామాల్లో సోలార్‌ హబ్‌ కింద భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడేందుకు శుక్రవారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాలకు సంబంధించిన భూసేకరణలో ఎక్కడ భూసేకరణ జరిగినా 80 శాతం మంది నిర్వాసితులు గ్రామసభలో ఒప్పుకోవాలనే నిబంధన ఉందన్నారు. భూమిని తీసుకున్నాక పూర్తిస్థాయిలో వారికి పునరావాసం కల్పించాలని చట్టంలో ఉందన్నారు. మార్కెట్‌ విలువ ఆధారంగా నాలుగు...

పోరాటానికి మరో పేరు అంగన్ వాడీలని వామపక్ష నేతలు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు శుక్రవారం చలో బెజవాడకు భారీ ర్యాలీని చేపట్టారు. తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మగాంధీ రోడ్డు వరకు చేరుకోగానే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలను ఇష్టమొచ్చినట్లు లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, న్యాయంగా జారీ చేయాల్సిన జీవోను జారీ చేయాలని కోరుతున్నారన్నారు. ఏసీ గదుల్లో ఉండడం కాదు..వారి కోపాన్ని తట్టుకొనే శక్తి ఉందా అని బాబును ఉద్ధేశించి...

 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి కాల్‌ మనీ కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమో క్రసీ, లిబ రేషన్‌, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా, బహు జన సమాజ్‌ పార్టీల ఆధ్వర్యంలో బుధ వారం వంద లాది మంది భారీ ప్రదర్శన నిర్వహిం చారు. అనంతరం సిపి గౌతమ్‌ సవాంగ్‌ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబూరావు మాట్లా డుతూ, కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ ఘటనపై ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా స్పందించా లన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తమ పార్టీకి చెందిన నేతలు ఇటువంటి అరాచకాలకు పాల్పడుతుంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంద న్నారు.

గత 45రోజులుగా రిలే నిరహారదీక్షలు చేస్తున్న విఆర్ఎలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలిపారు. 45రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, తక్షణం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న వాళ్లనందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు తాను అధికారంలోనికి వస్తే అందరిని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారని కాని ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. వి ఆర్ ఎ లు చేసే న్యాయమైన పోరాటానికి సిపిఎం మద్దతు ఎప్పుడూ ఉంటుందని మధు తెలిపారు.. 

విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ ఘటనపై హైకోర్టు న్యాయ మూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు.చట్టవిరుద్ధంగా కాల్‌మనీ వ్యాపారం చేస్తూ మహిళలను వ్యభిచారకూపంలోకి దించిన వారి ఆస్తులను తక్షణమే జప్తుచేయాలని కోరారు. ఆయా ఆస్తులను బాధిత మహిళలకు తిరిగి ఇవ్వాలన్నారు. కాల్‌మనీ వ్యాపారమే కాకుండా దాని ద్వారా మహిళలను వేధించడం, లోబరచుకోవడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చట్టం చేసి దానిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

రాజధాని ప్రాంతంలో అభద్రతా భావం పెరుగుతోందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, గుంటూరు కార్యదర్శివర్గ సభ్యులు జొన్న శివశంకరరావు, రాధాకృష్ణ, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవితో కలిసి శ్రీనివాసరావు సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు.సింగపూర్‌ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. తప్పులకు అధికారులను బలిపశువులు చేస్తూ మంచిని మాత్రం మంత్రులు తమకు ఆపాదించుకుంటున్నారని తెలిపారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో 40 వేల మంది వ్యవసాయ కార్మికులుంటే కేవలం...

రాయలసీమకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు.రాయలసీమ అభివృద్ధి సమితి అధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ అభివృద్ధిపై నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు..అలాంటి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూములను స్వాధీనం చేసుకొంటోందని, టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.

Pages