2016

విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలి. ఈ నెల 13 నుండి కొత్తగా హౌరా - యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02863) కు విశాఖలో హాల్ట్‌ ఏర్పాటు చేయాలి. - సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

                 ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించాలి. రైల్వేపరంగా విశాఖపట్నంకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి. నిన్న రైల్వే అధికారుతో జరిగిన రాష్ట్ర ఎం.పి.ల సమావేశంలో ఎం.పి.లే అసంతృప్తి చెందారంటే రైల్వేపరంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో అర్ధమౌతుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పుకుతుంది తప్ప, దానికి కావల్సిన మౌళిక రవాణా సదుపాయం అయిన రైల్వే జోన్‌ సాధించడంలో పూర్తిగా వైఫ్యలం చెందింది.

నాడు ద్వేషం..నేడు ప్రేమా? :VH

తెలంగాణ రాకముందు టీఆర్‌ఎస్‌ నేతలు సీమాంధ్రులను రెచ్చగొట్టి నేడు ఎన్నికల వేళ.. ప్రేమ కురిపిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలు సినిమా వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసిన ఘటనను ప్రజలు మరువరని అన్నారు. సీమాంధ్రులపై టీఆర్‌ఎస్‌ నేతలన్న వ్యాఖ్యలను విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వ లోపాలపై గవర్నర్‌ నరసింహన్‌ స్పందించడం లేదని ఆరోపించారు.

లిక్కర్ పాలసీపై బ్రిందా ఫైర్..

విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో మద్యపాన నిషేదంపై జరిగిన సదస్సులో  పాల్గొన్న సీపీఎం మహిళా నాయకురాలు బృందాకారత్ మాట్లాడుతూ జన్మభూమిని మద్యం భూమిగా చంద్రబాబు నాయుడు మార్చేశారని విమర్శించారు. ఆదాయం కోసం మద్యాన్ని వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.

నష్టాలతో స్టాక్ మార్కెట్లు

చైనా స్టాక్ మార్కెట్ల పతనం భారత స్టాక్‌మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి 24,851 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 7,568 వద్ద ముగిసింది. కాగా, హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.26,140కి అమ్ముడు పోతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.24,310కి అమ్ముడు పోతోంది. కిలో వెండి ధర రూ.36,112కు అమ్ముడవుతోంది.

రాయల సీమ జిల్లా సమస్యల ఫై ప్రజా ఉద్యమం

 6.1.2016తేదీన చిత్తూర్ జిల్లా తిరుపతిలోని సిపియం  పార్టీ  కార్యాలయంలో  రాయల సీమ జిల్లాలకు చెందినా  సిపియం కమిటీ సబ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి  రాష్ట్ర కార్యదర్శి పి. మధు గారు, కేంద్ర కమిటీ సబ్యులు యం. ఎ. గాఫ్ఫూర్ గారు, రాయల సీమ అభివృది సబ్ కమిటీ కన్వినర్ ఓబులు గారు, హాజారు ఐయరు.

సీమ అభివృద్ధికి సీపీఎం పాదయాత్ర..

సీమ అభివృద్ధిలో భాగంగా ఉద్యమాలకు సీపీఎం శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాయలసీలమ అభివృద్ధి నినాదంతో వచ్చే నెలలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఫ్రిబవరి రెండో వారంలో రాయలసీమ జిల్లాల నుండి బస్సు, పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, రాయలసీమలోని సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక రాయలసీమ అన్నది వ్యర్థమైన డిమాండ్ అని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాయలసీమకు అదనంగా నిధులు కేటాయించాలన్నారు. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మాస్టర్‌ప్లాన్‌పై రైతుల్లో ఆగ్రహం..

రాజధాని ప్రాంత రైతుల్లో అగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వమిచ్చిన హమీలేమీ అమలుకు నోచకపోగా జరీబులో భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో భూములు కేటాంచాలని నిర్ణయించడం, వేలకోట్లతో నిర్మిస్తామని చెబుతున్న రాజధాని తొలి తాత్కాలిక నిర్మాణానికే అప్పు తీసుకోవాలని నిర్ణయించడం వంటి విషయాలతో రైతుల్లో అనుమానాలతోపాటు ఆగ్రహమూ పెరుగుతోంది. జరీబు రైతులకు వారి గ్రామాల్లో భూములివ్వబోమని చెప్పడంతో మందడం రైతులు సిఆర్‌డిఏ కార్యాలయంలోనే మాస్టర్‌ప్లాను నకలు కాపీని చించిపారేశారు. అక్కడ భూములిస్తే మాస్టర్‌ప్లాన్‌కు ఇబ్బందని, పక్కకు వెళ్లిపోవాల్సిందేనని సిఆర్‌డిఏ అధికారులు తేల్చిచెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ - అద్దె సచివాలయం

ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర తాత్కా లిక సచివాలయాన్ని మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో 20 ఎకరా లలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.180 కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తంలో రూ.90 కోట్లు వడ్డీలేని రుణం ఇస్తారని, మరో రూ.90 కోట్లు రుణాలు తీసుకొని సిఆర్‌డిఎ నిర్మాణాలను పూర్తి చేస్తుందని, నిర్మాణం పూర్తయి, వివిధ ప్రభుత్వ శాఖలు ఆ భవనాలలోకి వచ్చిన తర్వాత, ఆయా ప్రభుత్వ శాఖలు వినియోగించుకున్న విస్తీర్ణాన్ని బట్టి సిఆర్‌డిఎకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.

Pages

Subscribe to RSS - 2016