2016

సిపిఎం ప్లీనం-బడా మీడియా పాక్షిక రూపం

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) నిర్మాణంపై ప్రత్యేక ప్లీనం సమావేశం జయప్రదంగా ముగిసింది. ప్రతినిధుల నుంచి వచ్చిన కొన్ని సవరణలతో నిర్మాణంపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్ని రాజకీయ పక్షాలూ అంతర్గత కలహాలతో అతలాకుతలమవుతున్న స్థితిలో-కమ్యూనిస్టు ఉద్యమం కూడా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న స్థితిలో-సిపిఎం బలం లోక్‌సభలో ఎన్నడూ లేనంత తక్కువకు పడిపోయిన దశలో- ఈ అఖిల భారత సమావేశం ఇంత ఏకోన్ముఖంగా జరగడం ఒక విశేషం.

విద్యార్థులపై రాజధాని రుసుం..

రాజధాని నిర్మాణానికి ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల నుంచి తలో రూ.10 చొప్పున వసూలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. 'నా రాజధాని నా అమరావతి నా ఇటుక' కార్యక్రమంలో భాగంగా ఈ వసూళ్లు చేయాలంది. ఈనెల 10లోగా ఈ వసూళ్లు పూర్తి చేసి, ముఖ్యమంత్రికి అందజేయాలని మోమోలో పేర్కొన్నారు.

హక్కుల రక్షణకు కమిషన్‌:VSR

హక్కుల రక్షణకు జాతీయ స్థాయిలో కమిషన్‌ ఏర్పాటుచేయాలని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. 'మారుతున్న రాజకీయ నేపథ్యంలో దళితులు, గిరిజనులు కర్తవ్యం' అనే అంశంపై సోమవారం ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ పదవుల్లో ఉన్న ఎంతటి వారైనా శిక్షలు పడితేనే వివక్ష అంతమవుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్నాయని, ఈ తరగతులకు ఉన్న హక్కులు పోతున్న తరుణంలో కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు

దేశంలోనే అగ్రగామిగా త్రిపుర స్టేట్

ఆదివాసీ చట్టాల అమలు, అభివృద్ధిలోనూ త్రిపుర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, మార్క్సిస్టు పాలన వల్లే ఇది సాధ్యమైందని ఆ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి, పార్లమెంట్‌ సభ్యులు జితిన్‌ చౌదరి తెలిపారు.మార్క్సిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా భూమి బదలాయింపు నిషేధి త చట్టాన్ని అమలు చేసిందని, ఆదివాసీల భూమిని ఆదివాసేతరులు కొనకుండా కట్టడి చేసిందన్నారు. రాష్ట్రంలో పకడ్బందీగా భూసంస్కరణలు అమలు చేసిందని, భూమి లేని నిరుపేద లందరికీ భూములు పంచిందని తెలిపారు. 

గిరిజనసంఘంఅధ్యక్షులుగా రాజయ్య

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర తొలి మహాసభలు ఉట్నూర్‌లోని హెచ్‌కేఎన్‌ గార్డెన్‌లో సోమవారం ముగిశాయి. చివరి రోజున తెలగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రతినిధుల మహాసభల సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. 25 మందికి కమిటీలో స్థానం కల్పించారు. అధ్యక్షులుగా మరోసారి సున్నం రాజయ్య ఎన్నికకాగా, ప్రధాన కార్యదర్శిగా తొడసం భీంరావును ఎన్నుకున్నారు. 

మోడీని టార్గెట్ చేసిన శివసేన

ప్రధాని మోడీపై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మోడీ పాక్‌కు వెళ్లకుండా ఉంటే ఈ ఘటన జరిగేది కాదని తన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. ఇద్దరు నేతలు కలిసి టీ తాగిన ఫలితం.. ఏడుగురు సైనికులు బలయ్యారని ఆరోపించింది. 

120అడుగుల మావో గోల్డెన్‌ స్టాట్యూ

మ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా వ్యవస్థాపకులు మావో జిడాంగ్‌ భారీ విగ్రహాన్ని చైనాలో నిర్మించారు. 120 ఫీట్లు (36.6 మీటర్ల) ఎత్తైన గోల్డెన్‌ విగ్రహానికి 3 మిలియన్‌ యువాన్లు (3 కోట్ల 60లక్షలకుపైగా) ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు.మావో విగ్రహాన్ని పేద కళకారులు తయారుచేయడం విశేషం. 

భారత్‌-పాక్ చర్చలపై సందిగ్ధత..

పంజాబ్లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జనవరి 14,15న ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. అయితే పఠాన్‌కోట్‌లో దాడి జరిపిన ఉగ్రవాదుల మూలాలు పాక్‌లోనే ఉన్నాయని ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. పాక్ అధికార వర్గాలు ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి పాటించకుండా ఓ వైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరో వైపు ఉగ్రమూకలకు సహకరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫ్రీ బేసిక్స్‌తో డిజిటల్‌ బానిసత్వం

ఫ్రీ బేసిక్స్‌ వినియోగదారులను కొన్ని వెబ్‌సైట్లకు మాత్రమే పరిమితం చేస్తుంది.    వినియోగదారులు ప్రత్యక్షంగా లాభపడేలా ఇంటర్నెట్‌ ప్యాకేజీలను అందించటం మంచి పథకం. బీహార్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా, రత్నౌలీ గ్రామానికి చెందిన సంజరు సాహ్ని పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేసి ఢిల్లీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను తన గ్రామానికి ఎప్పుడు వచ్చినా తమకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేయటానికి జాబ్‌ కార్డులు అందలేదనో, చేసిన పనికి వేతనాలు అందలేదనో గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వింటుండేవాడు. ఒకరోజు ఆయన ఢిల్లీలో కంప్యూటరు ముందు కూర్చొని ''యన్‌రీగా బీహార్‌'' అని టైప్‌ చేశారు.

బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ పాదయాత్ర..

కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అనవసరపు భూసేకరణకు వ్యతిరేకంగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యాన 25 కిలో మీటర్ల పాదయాత్ర జరిగింది.రైతులకు ఇష్టం లేకుండా విజయవాడ మెట్రో రైల్‌ కోచ్‌ డిపోను నిడమానూరులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఏలూరు కాలువ మళ్లింపు ప్రతి పాదననూ విరమించుకోవాలి. తుళ్లూరు రైతుల కంటతడి ఆరకముందే నిడమానూరు, గన్నవరాల్లో బలవంతంగా భూములు గుంజుకోవడానికి ప్రయత్నించడం శోచనీయం. బలవంతపు భూ సేకరణను నిలిపివేయాలి.

Pages

Subscribe to RSS - 2016