ప్రధాని మోడీపై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. పఠాన్కోట్లో ఉగ్రవాదుల దాడిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మోడీ పాక్కు వెళ్లకుండా ఉంటే ఈ ఘటన జరిగేది కాదని తన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. ఇద్దరు నేతలు కలిసి టీ తాగిన ఫలితం.. ఏడుగురు సైనికులు బలయ్యారని ఆరోపించింది.