రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనలకు దిగారు.ఆందోళన చేస్తున్న వారికి వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి.