మన ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని కాపాడుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రాసిన ‘సిటిజన్ అండ్ సొసైటీ’ పుస్తకం ఆవిష్కరణ రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. అనేక సమస్యలున్నా సమాజానికి దారి చూపగల శక్తి దేశానికి ఉందని మోదీ అన్నారు. అన్సారీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు.