కేంద్రం అమెరికాను అనుసరిస్తోంది..

భారతదేశం కూడా అమెరికా విధానాలనే అమలు చేస్తోందని సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుధాభాస్కర్‌ విమర్శించారు. ప్రణాళికా సంఘం(ప్లానింగ్‌ కమిషన్‌) ఎత్తివేతే దీనికి నిదర్శనమన్నారు. అక్టోబర్‌ 14 నుంచి సంగారెడ్డిలో జరగనున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల నేపథ్యంలో విలేకర్లతో వారు మాట్లాడారు. అమెరికాలో ప్లానింగ్‌ కమిషన్‌ ఉండదనీ, ఇక్కడ ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేశారని గుర్తుచేశారు. ప్రణాళిక లేకుండా అభివృద్ధి ఎలా సాధిస్తామనేది ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.