చిరువ్యాపారులు జీఎస్టీకి వెలుపలే..

దేశవ్యాప్తంగా ఏకరీతి పన్నుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన జీఎస్టీ అమలుకు సంబంధించి మరో కీలకమైన ముందడుగు పడింది. వార్షిక టర్నోవర్‌ రూ.20లక్షల లోపు ఉండే చిరు వ్యాపారులను వస్తుసేవల పన్ను (జీఎస్టీ)కి వెలుపలే ఉంచే విషయంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అలాగే వ్యాపార పరిధిని అనుసరించి ఆయా డీలర్లు/వ్యాపారులపై అజమాయిషీ ఎవరిది ఉండాలనే అంశంలోనూ చాలా వరకు స్పష్టత వచ్చింది.