2015

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బాక్సైట్‌ తవ్వకాల శ్వేతపత్రంపై సిపియం వ్యతిరేకం.-రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. నరసింగరావు

           విశాఖ జిల్లా జర్రెల బాక్సైట్‌ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తి అవాస్తవాలతో వున్నది. జర్రెల బాక్సైట్‌ గనుల్లో అపార నిల్వలు వున్నాయని, ఈ నిల్వలను వెలికితీసి రాష్ట్రానికి ఆదాయం పెంచవచ్చని ప్రభుత్వ ప్రధాన వాదన. తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల జారీచేసిన బాక్సైట్‌ తవ్వకాల జి.వో.నెం.97కు ముందే కాంగ్రెస్‌ మరియు వైఎస్‌ఆర్‌ పార్టీలు బాక్సైట్‌ తవ్వకాల పర్యావరణ అనుమతుల జి.వో జారీచేశాయని, రస్‌ ఆల్‌ఖైమాతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని మరో వాదన.  బాక్సైట్‌ అత్యధికంగా వున్న ఒరిస్సాలో తవ్వకాలు జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ తవ్వకాలు ఎందుకు జరపకూడదనేది మూడవ వాదన.

ఒక్క టెండరు కూడా ఖరారు కాలేదు..!

రాజధాని పనులకు ఇంతవరకు ఒక్క టెండరూ ఖరారు చేయలేదు. కేవలం కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియ మినహా ఇతర టెండర్లను ఖారారు చేయలేదు. అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. రాజధానికి అనుసంధాన ప్రధాన రహదారికే ఇంతవరకు స్పష్టత లేదని అధికారులే వాపోతున్నారు. కన్సల్టెంట్లు కూడా రాజధాని కేంద్ర ప్రాంతం నుండి కొండవీటివాగు స్లూయిస్‌ వరకూ ప్లానింగ్‌ ఇచ్చారు. అక్కడి నుండి జాతీయ రహదారికి అనుసంధాన రహదారిని ఫైనల్‌ చేయలేదు. అధికారులు మాత్రం మణిపాల్‌ ఆస్పత్రి వెనుక భాగంలోనూ, వడ్డేశ్వరం సమీపంలోనూ భూ పటుత్వ పరీక్షల కోసం పిల్లర్లు వేసి వదిలేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రోడ్డు ఎక్కడ వేయాలనేది స్పష్టం చేయలేదు.

పోలవరం ప్రాంతాల్లో లెఫ్ట్ పర్యటన

దేశంలో పేట్రేగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని పది వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని తీర్మానించింది. గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిన బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలపాలని నాయకులు నిర్ణయించారు. జర్రెల ప్రాంతానికి 10 వామపక్ష పార్టీల నాయకులు వెళ్ళి బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు.

"రస్‌ ఆల్‌ ఖైమా" కోసమే ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి

శ్వేత పత్రం విడుదల, చర్చల పేరిట బాక్సైట్‌ తవ్వకాలకు కొనసాగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈనెల 30వ తేదీలోగా బాక్సైట్‌ తవ్వకాల అనుమతులను ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. విదేశానికి చెందిన రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీ కోసమే ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలను అనుమతించిందని విమర్శించారు. దేశీయ కంపెనీతో కలిసి రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని, ఆ కంపెనీ నష్టాలను అధిగమించేందుకు గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

బీఫ్ విందు..విహెచ్‌పి దాడి !

స్వతంత్ర ఎమ్మెల్యే, ఇంజనీర్‌ అబ్దుల్‌ రషీద్‌పై విశ్వ హిందూ పరిషత్‌(విహెచ్‌పి) కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం దాడి చేశారు. శ్రీనగర్‌ అసెంబ్లీ గెస్ట్‌ హౌస్‌లో గొడ్డుమాంసంతో విందు ఇచ్చినందుకు ఈ దాడి అని చెప్పారు. ఈ ఘటనలో రషీద్‌, ఆయన పీఆర్‌వోలకు గాయాలయ్యాయి. తన మద్దతుదారులతో కలసి చెనాబ్‌ లోయలో రషీద్‌ మోటారు సైకిళ్ల యాత్రను నిర్వహించారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన విహెచ్‌పి కార్యకర్తలు ఆయన్ను ఆపి, నల్లజెండాలు చూపించి, వ్యతిరేక నినాదాలు చేశారు. చూస్తుండగానే ముఖంపై సిరా పోసి, ఆయన ప్రయాణిస్తున్న స్కార్పియోపై రాళ్లతో దాడి చేశారు.

GSTబిల్లుపై కసరత్తేది? :ఏచూరి

గురువారం నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభను సాఫీగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఐ(ఎం) బుధవారం స్పష్టం చేసింది. ''జిఎస్‌టి బిల్లుపై ప్రభుత్వం చేయాల్సిన కసరత్తు చేయలేదు. ఒకవేళ సభలో గనుక బిల్లు ఆమోదం పొందకపోతే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని'' సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

ప్రపంచ కార్పొరేట్‌ పాలన దిశగా...

 పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై అనేక దేశాలతో చర్చించటం ద్వారా ఒక సరికొత్త ప్రపంచ పాలనా నిర్మాణాన్ని అమెరికా చేపడుతున్నది. ఈ ఒప్పందాలన్నీ అమలులోకి వస్తే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 80 శాతం వీటి పరిధిలోకి వస్తుంది. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థంతా వీటి ఆధీనంలోకి వస్తుంది. అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు(బిట్సి, ట్రాన్స్‌అట్లాంటిక్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌(టిటిఐపి), ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌(టిపిపి)వంటివి) వీటిలో ఉన్నాయి. ఇందులో చేరాల్సిందిగా భారత్‌ను ప్రేరేపిస్తున్నందున ఈ నిర్మాణాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంది.

ఆనం బ్రదర్స్ TDPలోకి..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో చర్చించామని, ఒకటి రెండు రోజుల్లో సీఎం చంద్రబాబుతో కూడా చర్చించి పార్టీలో చేరిక తేదీని ఖరారు చేస్తామన్నారు. తొలుత ఆనం సోదరులు గురువారం నెల్లూరులోని తమ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, అభిప్రాయ సేకరణ జరిపారు.

మతవిద్వేషాలు పెరిగిపోయాయ్:తమ్మినేని

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతవిద్వేషాలు పెరిగిపోయాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 27న బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తమ్మినేని వీరభద్రంను ఆహ్వానించారు. దీనికి ఆయన మద్దతు ప్రకటించారు.

Pages

Subscribe to RSS - 2015