GSTబిల్లుపై కసరత్తేది? :ఏచూరి

గురువారం నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభను సాఫీగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఐ(ఎం) బుధవారం స్పష్టం చేసింది. ''జిఎస్‌టి బిల్లుపై ప్రభుత్వం చేయాల్సిన కసరత్తు చేయలేదు. ఒకవేళ సభలో గనుక బిల్లు ఆమోదం పొందకపోతే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని'' సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.