December

తమిళనాడుకి వెయ్యి కోట్ల సాయం..

తమిళనాడు లో వరద ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళనాడు ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 940 కోట్ల సాయం ప్రకటించామని, మరో రూ.1000 కోట్ల సాయాన్ని మోదీ ప్రకటించారు.

మోడీని టార్గెట్ చేసిన ISIS..

ISIS తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో భారత ప్రధాని మోడీని టార్గెట్ చేసారు.ముస్లింలపై హిందువులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు.

 

పెద్దల సభలో కులం రగడ..

గుజరాత్‌లోని ఓ ఆలయంలో తనను కులం అడిగారంటూ కాంగ్రెస్‌ ఎంపి కుమారి షెల్జా చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కుమారి షెల్జా మాట్లాడుతూ..తాను యుపిఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్నపుడు గుజరాత్‌లోని ద్వారక ఆలయాన్ని సందర్శించానని, ఆ సమయంలో తన కులమేమిటని అక్కడి నిర్వాహకులు అడిగినట్టు ఆమె తనకెదురైన అనుభవాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా గుజరాత్‌ నమూనానే అనుసరిస్తోందంటూ ఆమె విమర్శించారు.

కోట్ల రూపాయల సౌర కుంభకోణం!

కేరళలో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల సౌర కుంభకోణంలో అనేక వాస్తవాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ కుంభకోణంలో నిందితురాలయిన టీమ్‌ సోలార్‌ సంస్థ యజమాని సరితా ఎస్‌ నాయర్‌తో ముఖ్య మంత్రి ఊమెన్‌ చాందీ వివాహేతర సంబంధాలను కొనసా గించారని, అంతేకాక ఈ కుంభకోణంలో తాను ముఖ్య మం త్రికి రు.5.5 కోట్ల ముడుపులు అందచేశానని ప్రధాన నింది తుడైన బిజు బాలకృష్ణన్‌ అలియాస్‌ ఆర్‌కె నాయర్‌ జుడిష ియల్‌ కమిషన్‌కు తెలిపారు. సంచలనాత్మకమైన ఈ విషయా లకు సంబంధించిన ఆధారాలు పొందుపర్చిన సిడిని ఆయన బుధవారం కమిషన్‌కు అందచేశారు.

విద్యపైWTOఒత్తిళ్లకు లొంగొద్దు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపైన, డబ్ల్యూటిఓ మంత్రుల సమావేశం ముందుకు తెస్తున్న వినాశకర విధానాలపైన సమర భేరి మోగిస్తూ బుధవారం నాడు భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ), అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎఐఎస్‌ఎఫ్‌), అలిండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌(ఎఐడిఎస్‌ఓ) సంఘాలు ఉమ్మడిగా ఆందోళన నిర్వహించాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి. విద్యా వ్యతిరేక విధానాలు నశించాలి, డబ్ల్యూటిఓ గో బ్యాక్‌, ఫెలోషిప్స్‌ అందరికీ ఇవ్వాలని ప్రదర్శకులు నినదించారు.

మత సామరస్యం కోరుతూ కరపత్రాల పంపిణీ

ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకే ఇటీవల అస హన ధోరణులు, దాడులు పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఐ(ఎం) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భిన్నతంపై మతోన్మాద దాడులు, అసహన ధోరణు లకు నిరసనగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోనూ సిపిఎం ప్రచార యాత్ర లు నిర్వహిస్తోంది. అందులోభాగంగా బుధవారం శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు నిర్వహించారు. అసహన ధోరణులకు వ్యతిరేకంగా, మత సామరస్యం కోరుతూ సిపిఎం శ్రీకాకుళం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాయివీధిలో మతసామరస్యంపై కరపత్రాలను పంపిణీ చేశారు.

Pages

Subscribe to RSS - December